<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	xmlns:georss="http://www.georss.org/georss" xmlns:geo="http://www.w3.org/2003/01/geo/wgs84_pos#" xmlns:media="http://search.yahoo.com/mrss/"
	>

<channel>
	<title>KadaliTaraga : a wave in the Ocean !</title>
	<atom:link href="http://kadalitaraga.wordpress.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://kadalitaraga.wordpress.com</link>
	<description>I may disapprove of what you say, but I will defend to the death your right to say it - Voltaire</description>
	<lastBuildDate>Mon, 16 Nov 2009 04:23:08 +0000</lastBuildDate>
	<generator>http://wordpress.com/</generator>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<cloud domain='kadalitaraga.wordpress.com' port='80' path='/?rsscloud=notify' registerProcedure='' protocol='http-post' />
<image>
		<url>http://www.gravatar.com/blavatar/7f32a6d7d97ca2fa53b15b15755b6417?s=96&#038;d=http://s.wordpress.com/i/buttonw-com.png</url>
		<title>KadaliTaraga : a wave in the Ocean !</title>
		<link>http://kadalitaraga.wordpress.com</link>
	</image>
			<item>
		<title>అమెరికా అధినేత శాంతిదూతేనా?</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/11/03/america_adhineta_shantidootena/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/11/03/america_adhineta_shantidootena/#comments</comments>
		<pubDate>Mon, 02 Nov 2009 20:34:19 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[Ee Bhoomi]]></category>
		<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=260</guid>
		<description><![CDATA[అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 9 న చేసిన ప్రకటన ఎంతమందికి సంతోషం కలిగించిందో చెప్పలేము గాని అంతకన్న ఎక్కువమందికి విచారాన్నీ, ఇంకా ఎక్కువమందికి ఆశ్చర్యాన్నీ కలిగించి ఉంటుంది. తనకు ఈ బహుమానం ప్రకటించడం తనను కూడ ఆశ్చర్య పరచిందనీ, తాను అందుకు తగననీ, ఇది తాను చేసిన పనికి గుర్తింపుగా కన్న చేయవలసిన పనికి ప్రేరణగా భావిస్తున్నాననీ స్వయంగా ఒబామానే అన్నాడు. అమెరికా [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=260&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;">అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 9 న చేసిన ప్రకటన ఎంతమందికి సంతోషం కలిగించిందో చెప్పలేము గాని అంతకన్న ఎక్కువమందికి విచారాన్నీ, ఇంకా ఎక్కువమందికి ఆశ్చర్యాన్నీ కలిగించి ఉంటుంది. తనకు ఈ బహుమానం ప్రకటించడం తనను కూడ ఆశ్చర్య పరచిందనీ, తాను అందుకు తగననీ, ఇది తాను చేసిన పనికి గుర్తింపుగా కన్న చేయవలసిన పనికి ప్రేరణగా భావిస్తున్నాననీ స్వయంగా ఒబామానే అన్నాడు. <span id="more-260"></span>అమెరికా అగ్రరాజ్యపు పెత్తందారీ, దురాక్రమణ, హంతక విధానాలకు బలి అయిపోయిన దేశదేశాల పౌరులు ఆ విధానాలను ఇసుమంత కూడ మార్చని ఒబామాకు శాంతి బహుమానం వచ్చిందంటే అది క్రూర పరిహాసమనుకుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలలో తొమ్మిదివందలకుపైగా అమెరికన్ సైనిక స్థావరాలు, రెండు లక్షల మంది దాకా సైనిక బలగాలు, లక్షకు పైగా పౌర ఉద్యోగులు ఉన్నారు. ఇరాక్, అఫ్ఘనిస్తాన్ తో సహా కనీసం డజను దేశాలలో ఆ అమెరికన్ సైనిక బలగాలు హత్యలకూ, అత్యాచారాలకూ, హింసకూ, కుట్రలకూ పాల్పడుతున్నాయి. ఆ హంతక విదేశాంగ నీతినే ఆమలు చేస్తున్న అధినేతకు శాంతి బహుమానం రావడాన్ని ఆయాదేశాల ప్రజలు ఎలా స్వీకరిస్తారో ఎవరయినా ఊహించవచ్చు.</p>
<p style="text-align:left;">అసలు ఒబామాకు ఎందుకీ శాంతి బహుమతి? నార్వేజియన్ నోబెల్ కమిటీ మాటల్లో చెప్పాలంటే, ‘అంతర్జాతీయ దౌత్యసంబంధాలకూ ప్రజల మధ్య సహకారానికీ ఆయన చేసిన దోహదానికి’ ఈ బహుమానం ఇస్తున్నారట. అతి క్లిష్టమైన అంతర్జాతీయ సమస్యలను కూడ చర్చలద్వారా, సంప్రదింపులద్వారా పరిష్కరించాలని ఒబామా అన్నారని, అణ్వస్త్రాల నిరాయుధీకరణ కోసం ప్రయత్నిస్తున్నారని, ప్రత్యేకంగా అణ్వాయుధాలు సంపాదించడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఈ కమిటీ ప్రకటించింది. కాని ఈ నిర్ణయం వెనుక కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలున్నాయి. సాధారణంగా నోబెల్ శాంతి బహుమాన ప్రతిపాదనలు ఒక ఏడాది ముందర మొదలవుతాయి. ఈసారి 2009 బహుమానాలకు గాను అక్టోబర్ 2008 లో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. అప్పటికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడ జరగలేదు. ఒబామా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ పడుతున్నాడు. ఇక నోబెల్ కమిటీ తన అంతిమనిర్ణయాన్ని నిర్ధారించినది 2009 ఫిబ్రవరి 1న. అప్పటికి ఒబామా అధ్యక్ష పదవిని స్వీకరించి పన్నెండు రోజులు మాత్రమే అయింది. అంటే ఒబామా ఏవేవో చేశాడనీ, అందుకే బహుమతి ఇస్తున్నామనీ నోబెల్ బహుమాన కమిటీ చేసిన ప్రకటనకు అర్థమే లేదు.</p>
<p style="text-align:left;">సరే, ఆ సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా, అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయిన తొట్టతొలి ఆఫ్రో అమెరికన్ కు, ఒక నల్లజాతి నాయకుడికి ఈ ప్రతిష్టాత్మక, అంతర్జాతీయ గుర్తింపు రావడం దానికదిగా మంచిదేనని భావించే వాళ్లూ ఉన్నారు. నోబెల్ బహుమానాల చరిత్రలో నల్లజాతివారికి, ఆఫ్రో అమెరికన్లకు వచ్చిన బహుమానాలు చాల తక్కువ. గత నూటపది సంవత్సరాలలో ఎనిమిది వందల మందికి బహుమానాలు అందితే, నల్లవారికి అందినవి పన్నెండు మాత్రమే. దీన్ని ఇంకా విడదీసి చూస్తే, భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాలలో ఇప్పటివరకూ ఒక్క నల్లజాతీయుడికి కూడ నోబెల్ బహుమానం రాలేదు. అర్థశాస్త్రంలో 64 మంది బహుమతి గ్రహీతలలో ఒకరు, సాహిత్యంలో 106 మందిలో ముగ్గురు, శాంతి బహుమానాలలో 97 మందిలో ఎనిమిది మంది మాత్రమే నల్లజాతీయులు. అంతర్జాతీయ సమాజంలో, ముఖ్యంగా అమెరికా సమాజంలో నల్లజాతి వారి పాత్రతో పోలిస్తే ఈ బహుమానాల నిష్పత్తి చాల తక్కువగా ఉన్నదనేది స్పష్టమే. నల్లజాతివారు ప్రతిభావంతులు కారనే దురభిప్రాయానికి ఇది సూచన. అందువల్ల ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతి ఒబామాకు దక్కడం సరయినదేనని అనుకునే వారు ఉన్నారు. ఒక చారిత్రక అన్యాయాన్ని సవరించే ప్రయత్నంగా ఈ బహుమతిని చూసేవారున్నారు.</p>
<p style="text-align:left;">కాని నాణానికి మరో ముఖం కూడ ఉంది. పుట్టుకతో నల్లజాతి వ్యక్తే అయిన ఒబామా ఇవాళ కేవలం నల్లజాతి వ్యక్తి మాత్రమే కాదు. చరిత్రలోకెల్లా అత్యంత దుర్మార్గమైన అమెరికన్ సామ్రాజ్యవాద విధానాల నిర్వాహకుడు. ప్రపంచ వనరులన్నీ తనకే దక్కాలని, ప్రపంచమార్కెట్లన్నీ తన గుప్పెట్లోనే ఉండాలని అనుకునే అమెరికన్ పాలకవర్గాల కోరికలను తీర్చే ప్రభుత్వాధినేత. ఏ ఇంట్లో కోడి కూసినా తన ఇంట్లోనే తెగాలని అనుకునే మధ్యయుగాల భూస్వాముల లాగ, ఎక్కడ సంపద ఉన్నా అది తన ఖజానాలో డాలరయి రాలాలని అనుకునే పాలకవర్గాల నాయకుడూ ప్రతినిధీ ఒబామా. దేశాల మధ్య చిచ్చుపెట్టి ఆయుధాలు అమ్ముకుంటూ, సైనిక &#8211; పారిశ్రామిక సామ్రాజ్యం మీద ఆధారపడుతూ, ప్రపంచాన్ని బెదిరించడానికి తానే స్వయంగా యుద్ధాలకు దిగుతున్న యుద్ధోన్మాద రాజకీయాల నిర్వాహకుడు ఒబామా. నిజానికి ఒక నల్ల జాతీయుడిగా, శాంతివాదిగా, రిపబ్లికన్ల యుద్ధోన్మాదాన్నిఖండించిన డెమొక్రాట్ గా ఒబామాకు ఆ విధానాలను అమలు చేయకుండా ఉండే అవకాశం ఉంది. కనీసం తాత్సారం చేసే ప్రయత్నమయినా మొదలుపెట్టి ఉండవచ్చు. ఆయన ఆ ప్రయత్నం చేస్తాడనీ, ఆ క్రమంలో అమెరికన్ యుద్ధ పరిశ్రమాధిపతులు ఆయనను మట్టుపెడతారనీ కూడ అమెరికన్ పత్రికలలో కొన్ని నెలలకింద ఊహాగానాలు వచ్చాయి.</p>
<p style="text-align:left;">కాని కొనసాగుతున్న అమెరికన్ యుద్ధోన్మాద విధానాలను తారుమారు చేయడం అలా ఉంచి, వీసమెత్తు మార్పులు కూడ చేయబోనని ఆయన ఈ తొమ్మిది నెలల పాలనలో అమెరికన్ పాలకవర్గాలకు మాటల్లోను, చేతల్లోను హామీ ఇస్తూ వచ్చాడు. తాను అధికారంలోకి వచ్చేనాటికి కొనసాగుతున్న అఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలను రెంటినీ ఆపివేయకపోవడం మాత్రమే కాదు, అఫ్ఘనిస్తాన్ కు అదనపు బలగాలను పంపడానికి నిర్ణయించాడు. అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నదని, మరొక 17,000 మంది అమెరికన్ సైనిక బలగాలను పంపితేనే దాన్ని చక్కదిద్దవచ్చునని ప్రకటించి అమెరికా ప్రపంచ పోలీసు పాత్రలో ఎంతమాత్రం మార్పు లేదని స్పష్టం చేశాడు. గుంటనామో బే లాంటి ప్రపంచ అపఖ్యాతిపొందిన చిత్రహింసా శిబిరాలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాడు గాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ చిత్రహింసా శిబిరాలన్నీ యథాతథంగా ఉన్నాయి. ఇరాక్ లో ప్రతిరోజూ కోట్లాది డాలర్ల వ్యయంతో మారణకాండ సాగుతూనే ఉంది. లాటిన్ అమెరికన్ దేశాలలో ప్రజలు ప్రకటిస్తున్న సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేయడానికి అమెరికన్ సైనిక బలగాలు, సిఐఎ జరుపుతున్న కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. క్యూబా మీద అమెరికా ఆంక్షలు యథాతథంగా ఉన్నాయి. తానేమో కుప్పలుగా అణ్వాయుధాలు పోగేసుకుని కూచుని, ఇరాన్ కు గాని, ఇతర దేశాలకు గాని అణ్వాయుధాలు తయారు చేసుకునే అధికారం లేదని నీతులు పలికే అమెరికా పాలకవర్గాల అహంకారం చెక్కుచెదరలేదు. కొన్ని డజన్ల దేశాలలో ఇప్పటికీ అమెరికన్ సైనిక బలగాలు తిష్టవేసి ఉన్నాయి. అనేక దేశాల సైనిక బలగాలకు శిక్షణ ఇవ్వడం, సంయుక్త విన్యాసాలు జరపడం చేస్తున్నాయి. ఇతరదేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నాయి. ఆయా దేశాలలో ప్రజా ఉద్యమాలను అణచడానికి సహాయం చేస్తున్నాయి. లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలలో స్థానిక ప్రజా ఆకాంక్షలను భగ్నం చేయడానికి అన్ని కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయి.</p>
<p style="text-align:left;">ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికన్ పాలకవర్గాలు ప్రపంచప్రజల ప్రధాన శత్రువు స్థానం నుంచి ఒక్క మిల్లీమీటరు కూడ పక్కకు జరగలేదు. అమెరికా పాలక విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానంలో గత రిపబ్లికన్ పాలన సమయంలో, బుష్ పాలనా కాలంలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఆ విధానాలను వ్యతిరేకిస్తూ అధికారంలోకి వచ్చిన ఒబామా ఆ విధానాలలో ఏ ఒక్కదానినీ మార్చలేదు సరిగదా, కనీసం మారుస్తాననే దిశగా ప్రయత్నాలు కూడ ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో చూస్తే ఈ శాంతి బహుమానం అమెరికా అధ్యక్షుడికి అందడం అనుచితం. అమెరికా అధ్యక్షుడిని శాంతి చిహ్నంగా చూడడం ప్రపంచ శాంతి అనేమాటకే అవమానం.</p>
<p style="text-align:left;">ఇంతకూ నోబెల్ బహుమానాలను అసలు ఇంతగా గౌరవించవచ్చునా అనే చర్చ కూడ ఉంది. విధ్వంసకరమైన డైనమైట్ తయారుచేసి దానితో సంపన్నుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద సాగే ఈ బహుమతి చాలసార్లు అగ్రరాజ్యాలకు, సామ్రాజ్యవాదానికి, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉన్నవారికే వచ్చినమాట నిజమే. కాని కొన్నిసార్లయినా ప్రదర్శనావస్తువుగానైనా, సాధికారత సంపాదించుకునే ఉద్దేశంతోనైనా ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు ఇచ్చిన ఉదాహరణలున్నాయి. ఆ ఉదాహరణలవల్లనే ఈ బహుమతులకు అంతర్జాతీయ ప్రతిష్ట కూడ వచ్చింది. అది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సూచిక అయింది. అందువల్ల నోబెల్ బహుమతిని గౌరవించినా, గౌరవించకపోయినా దాని ఉచితానుచితాల గురించి ఆలోచించడం, విశ్లేషించడం అవసరం.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/260/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/260/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/260/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/260/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/260/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/260/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/260/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/260/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/260/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/260/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=260&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/11/03/america_adhineta_shantidootena/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>బాలగోపాల్ సాహిత్య వ్యక్తిత్వం</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/10/27/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%97%e0%b1%8b%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/10/27/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%97%e0%b1%8b%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4/#comments</comments>
		<pubDate>Tue, 27 Oct 2009 06:36:02 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=258</guid>
		<description><![CDATA[ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ పరిశీలనలో ఉంది. వారు ప్రచురించిన/తిరస్కరించిన తర్వాత ఈ సైట్ మీద ప్రచురించబడుతుంది.
       <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=258&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p>ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ పరిశీలనలో ఉంది. వారు ప్రచురించిన/తిరస్కరించిన తర్వాత ఈ సైట్ మీద ప్రచురించబడుతుంది.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/258/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/258/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/258/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/258/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/258/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/258/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/258/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/258/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/258/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/258/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=258&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/10/27/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%97%e0%b1%8b%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>అక్షరాలా తీరని లోటు</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/10/23/tirani_lotu_balagopal/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/10/23/tirani_lotu_balagopal/#comments</comments>
		<pubDate>Fri, 23 Oct 2009 16:54:06 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[Telugu]]></category>
		<category><![CDATA[కె. బాలగోపాల్]]></category>
		<category><![CDATA[BalaGopal]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=248</guid>
		<description><![CDATA[‘ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అనే మాట వినీ వినీ అరిగిపోయింది గాని ఆ మాట అక్షరాలా వర్తించే, సంపూర్ణంగా నిజమయ్యే మనిషి కె. బాలగోపాల్ (1952-2009). నిజంగా తెలుగు సమాజానికీ, ప్రజాఉద్యమాలకూ, ప్రజల హక్కుల పరిరక్షణకూ, తెలుగునాట మేధోకృషికీ ఆయన మరణం తీరని లోటు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకున్నంత తీవ్రంగా పట్టించుకునే, ఆయన ఆలోచించినంత సమగ్రంగా ఆలోచించే, ఆయన పనిచేసినంత సమర్థంగా పనిచేసే మనుషులు తయారు కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేము. తెలుగు సమాజం [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=248&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;">‘ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అనే మాట వినీ వినీ అరిగిపోయింది గాని ఆ మాట అక్షరాలా వర్తించే, సంపూర్ణంగా నిజమయ్యే మనిషి కె. బాలగోపాల్ (1952-2009). నిజంగా తెలుగు సమాజానికీ, ప్రజాఉద్యమాలకూ, ప్రజల హక్కుల పరిరక్షణకూ, తెలుగునాట మేధోకృషికీ ఆయన మరణం తీరని లోటు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకున్నంత తీవ్రంగా పట్టించుకునే, ఆయన ఆలోచించినంత సమగ్రంగా ఆలోచించే, ఆయన పనిచేసినంత సమర్థంగా పనిచేసే మనుషులు తయారు కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేము. <span id="more-248"></span>తెలుగు సమాజం మాత్రమే కాదు యావత్ దేశమే ఒక ఆత్మీయ మిత్రుడిని, హక్కులకోసం ఎలుగెత్తే గొంతును కోల్పోయింది. అటుచివర కాశ్మీర్ నుంచి మరొకచివర ఈశాన్య ప్రాంత ఉద్యమకారులనుంచి, ఛత్తీస్ ఘర్ ఆదివాసులు, గుజరాత్ మైనారిటీలు, కంధమాల్ క్రైస్తవులు, మత్స్యకారులు, ప్రత్యేక ఆర్థిక మండలాల నిర్వాసితులు, దేశవ్యాప్తంగా అభివృద్ధి పథకాల నిర్వాసితులు, ప్రపంచీకరణ విధానాల బాధితులు, రాష్ట్రంలోని అన్ని ప్రజాఉద్యమాల కార్యకర్తలు, విప్లవోద్యమ కార్యకర్తలు, దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనారిటీలు &#8212; ఆయన స్పృశించని బాధిత సమూహం లేదు. ఆయన పట్టించుకోని జీవన సమస్య లేదు.</p>
<p style="text-align:left;">ఇరవై ఐదు సంవత్సరాలకింద వరంగల్ లో పనిచేస్తుండిన ఒక పోలీసు అధికారి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఉత్తరం రాస్తూ బాలగోపాల్ గురించి ‘ఎక్కడ శవం కనబడితే అక్కడ వాలే రాబందు’ అని వ్యాఖానించాడు. (ఇప్పుడు అదే పోలీసు అధికారి ఆయనను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాడు). ఆమాటలో ఉన్న కసినీ, వ్యంగ్యాన్నీ, దూషణనూ పట్టించుకోనక్కరలేదు. కాని నిజంగానే బాలగోపాల్ ‘బ్రదుకును ప్రచండ భేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం’ లాంటి సమగ్రవ్యక్తి. బతుకులోని సమస్త విషయాలనూ ఆయన పట్టించుకున్నారు. నిజంగానే గండభేరుండ దృష్టితో విహంగ వీక్షణ చేసి తన పరిధిలోకి రాని విషయంలేదని రుజువు చేసుకున్నారు. ప్రజాసమస్యల పరిశీలనకూ, ప్రజల హక్కుల రక్షణకూ ఎంత తీక్షణ, అత్యంత నిశిత దృష్టి అవసరమో ప్రదర్శించి చూపారు.</p>
<p style="text-align:left;">యాభైఏడు సంవత్సరాల జీవితంలో, తొలి ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకు పోయినా, మిగిలిన ముప్పై సంవత్సరాలకు పైగా ఆయన సాధించిన విస్తృతి, సాగించిన కృషి చూస్తే ఒక మనిషి, ఇంత జీవితకాలంలో ఇన్ని సాధించగలరా అని ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఆ చదువు కూడ ఆయన ఎంత అసాధారణ ప్రతిభతో సాగించారంటే, 1981లో ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో లెక్చరర్ పదవికి ఇటర్వ్యూకు హాజరయినప్పుడు, ప్రొఫెసర్లకు కూడ లేని అర్హతలు ఆయనకు ఉన్నాయని ఇంటర్వ్యూ కమిటీ అభిప్రాయపడిందని చెప్పుకునేవారు. అప్పటికే ఆయన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజిలో గణితశాస్త్రంలో ఎం ఎస్ సి (1974), అక్కడే స్టాటిస్టిక్స్ లో పి ఎచ్ డి (1977) చేసి, ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో పోస్ట్ డాక్టొరల్ రిసర్చ్ చేస్తూ 1980లో వదిలేసి వచ్చారు. స్టాటిస్టిక్స్ కు చెందిన అంతర్జాతీయ ప్రామాణిక పత్రికలలో పరిశోధనా పత్రాలు రాశారు. అమెరికన్ మాథమాటికల్ సొసైటీ పత్రికకు సమీక్షాసంపాదకుల బృందంలో ఉన్నారు. అంటే మూడు పదులు నిండకుండానే ఆయన ఇటు గణితశాస్త్రంలో అపారమైన ప్రజ్ఞ మాత్రమే కాక, క్రికెట్, సంగీతం, సినిమాలు, సాహిత్యం వంటి విభిన్నమైన, వైవిధ్యభరితమైన ఆసక్తులలో కేవలం ప్రవేశమే కాదు, ప్రావీణ్యం సంపాదించి ఉన్నారు. అప్పటికే మార్క్సిస్టు ప్రామాణిక గ్రంథాలు చదివి మార్క్సిజాన్ని ఒక శాస్త్రంగానూ, ప్రజాసమస్యల పరిష్కారమార్గం గానూ నమ్ముతున్నారు. ఆయనే 1987లో జెంటిల్ మన్ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ఆర్ ఇ సి లో పి ఎచ్ డి చేస్తున్న కాలంలో అమరుడు సూరపనేని జనార్దన్ వంటి రాడికల్ విద్యార్థుల కార్యక్రమాలు, వరంగల్ ప్రజాచైతన్యం, ఎమర్జెన్సీ నిర్బంధం చూస్తూ, అసలు వీళ్లు చెప్పే మార్క్సిజం ఏమిటో తెలుసుకోవాలని కాపిటల్ చదివేశారు.</p>
<p style="text-align:left;">1981 మార్చ్ లో కాకతీయ విశ్వవిద్యాలయ గణిత శాఖలో లెక్చరర్ గా చేరి, అప్పటినుంచే సృజన సాహితీమిత్రులలోనూ, పౌరహక్కుల సంఘంలోనూ పనిచేయడం మొదలుపెట్టారు. 1983లో పౌరహక్కులసంఘం ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1980 నుంచీ కూడ ఆయన వరంగల్ సామాజిక జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా, ఎందరికో తలలో నాలుకలా, మిత్రుడిగా, ఆత్మీయుడిగా ఎదిగారు. ఆ రోజుల్లో ఆయన సహాయం పొందని వరంగల్ ప్రజా ఉద్యమ కార్యకర్తలు ఒక్కరు కూడ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి రాడికల్ విద్యార్థి యువజన కార్యకర్తకూ ఆయన తమకు రక్షణగా ఉన్నాడనే భరోసా ఉండేది. జిల్లాలో అప్పుడు విస్తరిస్తున్న రైతాంగ ఉద్యమం ఆయనను తన మిత్రుడిగా, మార్గదర్శిగా, ప్రచారకుడిగా ఆత్మీయంగా తీసుకుంది. అందుకే పాలకవర్గాలకు, పోలీసులకు ఆయన పేరే కంటగింపయింది. 1985లో పోలీసు ఇనస్పెక్టర్ యాదగిరిరెడ్డి శవయాత్ర డా. రామనాథం ఆస్పత్రి మీదుగా వెళ్లడంతో డాక్టరుగారి హత్య జరిగిందిగాని, ఆ ఊరేగింపులో ‘బాలగోపాల్ ను చంపుతాం’ అని పోలీసులు నినాదాలు ఇచ్చారు. అప్పటికాయన హనుమకొండలో రాగన్నదర్వాజలోని ఒక చిన్న గదిలో ఉంటున్నారు. ఇక వరంగల్ లో ఉండలేని పరిస్థితి వచ్చాక నాలుగైదేళ్లపాటు పేరుకు హైదరాబాదులో గది ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లేవారు. తర్వాత హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పడి, న్యాయవాదవృత్తి మొదలుపెట్టినా ప్రతి శని ఆదివారాలు ఎక్కడికో ఒకచోటికి వెళ్ళి ప్రజాసమస్యల అధ్యయనాలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. మార్క్సిస్టు దృక్పథం నుంచి దూరమయ్యానని తానే రాసినా, పౌరహక్కుల సంఘంలో చర్చ ఫలితంగా మానవహక్కుల వేదిక ఏర్పాటు చేసినా ఆయన తనకోసం తాను నిర్వచించుకున్న పనిని, సమాజమూ కాలమూ తన నుంచి ఆశించిన పనిని ఎన్నడూ వదిలిపెట్టలేదు.</p>
<p style="text-align:left;">బహుముఖ ప్రజ్ఞ, విస్తారమైన అధ్యయనం, నిరంతరమైన పని, అత్యంత నిరాడంబరమైన జీవనశైలి నిండిన బాలగోపాల్ ఆలోచనలనుంచీ, రచనల నుంచీ, ఆచరణనుంచీ, పని విధానం నుంచీ నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. బహుశా తెలుగు సామాజిక కార్యకర్తలలో ఆయన మొదటిసారి ప్రారంభించిన సంప్రదాయాలూ ఉన్నాయి. తెలుగులో ప్రజాఉద్యమాలు, ఉద్యమకారులు రచనలు, ఉపన్యాసాలు చాలవరకు ఆలంకారిక శైలిలో, ఉత్తేజపరిచే లక్ష్యంతో ఉండడమే ఎక్కువ అలవాటు. కాని ప్రజాఉద్యమాల ఆలోచనలు విషయ పరిజ్ఞానంతో, వాదనాపటిమతో, విశ్లేషణా శక్తితో, ఇతరులను, ముఖ్యంగా ఆ సమస్య గురించి అవగాహనలేని వాళ్లను ఒప్పించగల నేర్పుతో ఉండాలనేది ప్రధానంగా బాలగోపాల్ ఇచ్చిన కానుకే. విశాల ప్రజాసమస్యలపట్ల అధ్యయనం లేకుండా ఊకదంపుడు మాట్లాడగూడదని, ఆ సమస్యలను స్థూలస్థాయిలో మాత్రమే కాక, సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయాలనీ ఆయన తన ఆచరణ ద్వారా చెప్పారు. సాధారణంగా ప్రజా ఉద్యమాలు తమవాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదివరకే పరివర్తన పొందినవారిని పరివర్తన చెందించడానికి ప్రయత్నిస్తుండగా, ఆయన కొత్తవారినీ, తటస్థులనూ ఆకట్టుకోవడానికి ప్రయత్నించి విజయం సాధించారు.<br />
ఇలా కొత్తవారిని ఆకర్షించడం అనేది కేవలం సంఖ్యా బలాన్ని పెంచడానికి మాత్రమే కాదు, అసలు అవగాహనలోనే ప్రజాఉద్యమం అనేది అత్యంత సూక్షమైన సమస్యలను కూడ పట్టించుకుని, ఆ చిన్న చిన్న పోరాటాలను కూడ ఏకం చేసి మహాప్రవాహం కావాలని ఆయన విశ్వసించారు. అందువల్లనే ఆయన కృషి పౌరహక్కుల ఉద్యమ పరిధిని విస్తృతం చేయడం దిశగా సాగింది. కేవలం రాజ్య హింస, రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణ మాత్రమే కాక, అన్ని ఆధిపత్య శక్తులు సాగించే హక్కుల ఉల్లంఘనలమీద మాట్లాడాలని ఆయన పరిధిని విస్తృతపరచడం మొదలుపెట్టారు. అలా పౌరహక్కుల ఉద్యమం 1980లలో అనేక కొత్త సమూహాలలోకి, సమస్యలలోకి, ప్రాంతాలలోకి విస్తరించింది. ఆ వాదనను ఆయన ప్రజాఉద్యమ నిర్మాణాలు కూడ ఆధిపత్య శక్తులు కాగలవనే వాదనలోకి, వారి ఉల్లంఘనలను కూడ ఖండించాలనే దగ్గరికి తీసుకుపోయారుగాని, అయినా ప్రజల సమస్యలపై ఉద్యమాలను మాత్రం సంపూర్ణంగా సమర్థిస్తూనేవచ్చారు.<br />
పౌరహక్కుల ఉద్యమంతోపాటు సాహిత్య విమర్శ, చరిత్ర, తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రాలు, సమకాలీన రాజకీయార్థిక పరిణామాలు, మొదలయిన ఎన్నో విషయాలమీద ఆయన సాగించిన రచనలు, అద్భుతమైన సమాచార, విశ్లేషణా సంపదతో నిండిన వక్తృత్వం, పదునైన వ్యంగ్యం వంటి అపారమైన కృషి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మేధావి – కార్యకర్త అనేవి ఒకదానికొకటి సంబంధంలేని ద్వంద్వాలనీ, మేధావి అనిపేరు వచ్చినవారు పనిచేయరనీ, కార్యకర్తలు మేధోకృషి సాగించలేరనీ ఉన్న దురభిప్రాయాన్ని ఆయన తన జీవితాచరణతో రద్దుచేశారు.<br />
1980లో సృజనలో ఆర్ ఎస్ సుదర్శనం రాసిన మార్క్సిజం – సాహిత్యం పై త్రిపురనేని మధుసూదనరావు విమర్శ రాయగా, దానిమీద చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గొంటూ రాసిన వ్యాసం బాలగోపాల్ మొదటి తెలుగు వ్యాసం కావచ్చు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆర్ ఇ సి క్వార్టర్స్ లో మిత్రుడి ఇంట్లో ఉంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండిన రోజులనుంచీ 30 సంవత్సరాల అనుబంధంలో లెక్కలేనన్ని అనుభవాలు. ఆయన వ్యక్తిగతంగా నాకు గురువు, మిత్రుడు, మార్గదర్శి, జీవనదాత. 1988 మార్చ్ లో నేను ఒక రోడ్డుప్రమాదానికి గురయి చావుబతుకుల మధ్య ఉండినపుడు, పోలీసులు చేర్చిన ఆస్పత్రిలోనే ఉంటే బహుశా చచ్చిపోయి ఉండేవాడినే. అక్కడ వైద్యం సరిగాలేదని, వాళ్లతో పోట్లాడి, ఏమైనా చేసుకోండి అని నన్ను భుజాన వేసుకుని మరో ఆస్పత్రికి చేర్చి నన్ను బతికించినది బాలగోపాలే. అంతకు రెండు సంవత్సరాల ముందు నాజీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ఆయనతో చర్చించి తీసుకున్న నిర్ణయమే. ఆయన అభిప్రాయాలతో తీవ్రమైన విభేదం వచ్చినప్పుడు ఆయనను విమర్శిస్తూ పుస్తకమే రాసినప్పటికీ ఆయన అపారమేధోశక్తిముందు, ఆయన అకుంఠితదీక్షముందు, అవిశ్రాంతమైన ఆయన పనిముందు ఎప్పుడూ వినమ్రుడినై ఉన్నాను. అక్టోబర్ 9 సాయంకాలం పంజగుట్ట శ్మశానవాటికలో కట్టెలపరుపుమీద ఆయన చేతిని ఆఖరిసారి ముట్టుకుని ఆ వినమ్రత ప్రకటించాను.</p>
<p style="text-align:left;">ఆయననుంచి నేర్చుకుని, ఆచరణలో పెట్టినప్పుడే ఆయనలేని లోటు కొతయినా తీరుతుంది.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/248/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/248/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/248/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/248/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/248/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/248/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/248/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/248/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/248/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/248/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=248&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/10/23/tirani_lotu_balagopal/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>చెరగని హక్కుల స్ఫూర్తి బాలగోపాల్‌</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/10/22/balagopal_obituary/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/10/22/balagopal_obituary/#comments</comments>
		<pubDate>Thu, 22 Oct 2009 11:12:29 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[Surya]]></category>
		<category><![CDATA[Telugu]]></category>
		<category><![CDATA[బాలగోపాల్]]></category>
		<category><![CDATA[BalaGopal]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=232</guid>
		<description><![CDATA[ఒక వస్తువు, ఒక పరిణామం తన స్థలానికీ కాలానికీ ఎంత గాఢంగా బద్ధమైతే అంతగా సార్వజనీనం, సార్వకాలికం అవుతుందని తత్వశాస్త్రంలో ఒక భావన ఉంది. జూన్ 20, 1952న పుట్టి, అక్టోబర్ 8, 2009 న మరణించిన, ఆంధ్రప్రదేశ్ అనే నిర్దిష్టమైన స్థలంలో, 1980 నుంచి 2009 దాకా అనే స్పష్టమైన కాలంలో పనిచేసిన డా. కందాళ బాలగోపాల్ అనే స్థల కాలబద్ధుడైన వ్యక్తి సాగించిన కృషి నిజంగానే ఆయన జీవితాచరణను ఎల్లకాలానికీ ఒక ఆదర్శంగా, చెరగని [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=232&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;">ఒక వస్తువు, ఒక పరిణామం తన స్థలానికీ కాలానికీ ఎంత గాఢంగా బద్ధమైతే అంతగా సార్వజనీనం, సార్వకాలికం అవుతుందని తత్వశాస్త్రంలో ఒక భావన ఉంది. జూన్ 20, 1952న పుట్టి, అక్టోబర్ 8, 2009 న మరణించిన, ఆంధ్రప్రదేశ్ అనే నిర్దిష్టమైన స్థలంలో, 1980 నుంచి 2009 దాకా అనే స్పష్టమైన కాలంలో పనిచేసిన డా. కందాళ బాలగోపాల్ అనే స్థల కాలబద్ధుడైన వ్యక్తి సాగించిన కృషి నిజంగానే ఆయన జీవితాచరణను ఎల్లకాలానికీ ఒక ఆదర్శంగా, చెరగని స్పూర్తిగా మార్చింది. ఆయన సాహిత్య విమర్శ గురించీ, రచన గురించీ, ఉపన్యాసం గురించీ, ఆయన జీవిత విలువల గురించీ, న్యాయవాదిగా ఆయన చేసినపని గురించీ, గణితశాస్త్ర అధ్యాపకుడిగా చేసిన కృషి గురించీ ఎంతయినా చెప్పుకోవచ్చు. కాని ఇక్కడ హక్కుల ఉద్యమ నిర్మాణంలో, వికాసంలో ఆయన సాగించిన కృషి గురించి వివరించడానికి మాత్రం పరిమితమవుతాను.</p>
<p style="text-align:left;"><span id="more-232"></span>హక్కుల ఉద్యమంలో బాలగోపాల్ పాత్రకు కచ్చితమైన స్థల కాలాలున్నాయి. ఆయన హక్కుల కృషి మొదలయింది వరంగల్ లో. కొనసాగినది రాష్ట్రమంతా, దేశమంతా. మొదలయిన సందర్భం 1981 నుంచి 1985 దాకా. కొనసాగినది చివరి ఊపిరిదాకా. ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో భాగంగానే బాలగోపాల్ హక్కుల ఉద్యమకృషి మొదలయింది.</p>
<p style="text-align:left;">బ్రిటిష్ వలసపాలన కాలంలోనే భారతదేశంలో మధ్యతరగతి విద్యావంతుల పౌరహక్కుల కృషికి బీజాలు పడినప్పటికీ, 1947 తర్వాత ఆ కృషి మార్క్సిస్టుల బాధ్యత మాత్రమే అయింది. అది కూడ కమ్యూనిస్టు నాయకుల అరెస్టు తర్వాత జరిగిన ప్రయత్నాలలోనే వ్యక్తమయింది. ఆ చెదురుమదురు ప్రయత్నాలు ముందుకు సాగలేదు కూడ. ఆ తర్వాత, శ్రీకాకుళ విప్లవోద్యమం మీద దారుణమైన నిర్బంధం, వందలాది మందిని ఎన్ కౌంటర్ పేరిట హత్య చేయడం, కుట్రకేసులు, వేలాదిమంది సాధారణ ప్రజానీకాన్ని నిర్బంధించి, వేధించడం, భూమయ్య, కిష్టాగౌడ్, నాగభూషణ పట్నాయక్ వంటి వారి ఉరిశిక్షలు మొదలయిన సంక్షుభిత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లో పౌరహక్కుల కృషి విస్తృతమై, నిర్మాణ రూపం ధరించి ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఎ పి సి ఎల్ సి), ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఒపిడిఆర్) ఏర్పడ్డాయి. ఇదంతా ఎమర్జెన్సీకి పూర్వమే.</p>
<p style="text-align:left;">ఆ స్థితిలో ఎమర్జెన్సీ వచ్చి దేశంలో మార్క్సిస్టులు కాని మధ్యతరగతి విద్యావంతులలోనూ పౌరహక్కుల స్పృహను లేవనెత్తింది. ఇందిరాగాంధీ తన అధికారాన్ని రక్షించుకోవడం కోసం దేశం మీద రుద్దిన ఎమర్జెన్సీ ప్రతిపక్షనాయకుల నుంచి సాయుధవిప్లవాన్ని సమర్థించేవారివరకూ, ఆనందమార్గ్, ఆర్ ఎస్ ఎస్ నాయకులనుంచి జమాతే హింద్ నాయకులవరకూ అందరినీ జైళ్లలో కుక్కడంతో, దేశంలో పౌర, ప్రజాస్వామిక హక్కులను రక్షించడానికి విశాల వేదికలు కావాలనే ఆలోచనలు మొదలయ్యాయి. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జయప్రకాశ్ నారాయణ, సురేంద్రమోహన్, జార్జి ఫెర్నాండెజ్, ఎంవి తార్కుండే, గోబింద ముఖోటీ, అరుణ్ శౌరి వంటి ప్రముఖుల ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహాలతో పౌరహక్కుల ఆలోచనలు విస్తరించాయి. తాజాగా నిర్బంధాన్ని చవిచూసిన మధ్యతరగతి ఇటువంటి ఉద్యమ అవసరాన్ని గుర్తించింది.</p>
<p style="text-align:left;">ఆ దేశవ్యాపిత ప్రజాస్వామ్య పవనాలలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్ కౌంటర్ హత్యలపై తార్కుండే కమిటీ నివేదిక, భార్గవా కమిషన్ విచారణ, జగిత్యాల, సిరిసిల్ల కల్లోలిత ప్రాంతాల ప్రకటనపట్ల నిరసన వెల్లువ, తిరిగి మొదలయిన ఎన్ కౌంటర్లపై వ్యతిరేకత కొనసాగాయి. ఎపిసిఎల్ సి, ఒపిడిఆర్ బలం పుంజుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలో బాలగోపాల్ ఎపిసిఎల్ సి లో ప్రవేశించారు. పౌరహక్కుల ఉద్యమంవైపు వస్తున్న విభిన్న రంగాల విద్యావంతుల ఆసక్తులను అర్థం చేసుకుని వారికి తగిన అవగాహనను అందించడం, దాన్ని నానాటికీ విస్తరించడం, పౌరహక్కుల చైతన్యాన్ని, నిర్మాణాన్ని బలోపేతం చేయడం తన బాధ్యతగా బాలగోపాల్ నిర్విరామ కృషి ప్రారంభించారు.</p>
<p style="text-align:left;">అప్పటివరకూ ఎపిసిఎల్ సి నిర్మాణమై ఉన్న పద్ధతిలో హక్కులకోసం అడిగే క్రమంలో హక్కులు కోల్పోయిన వారికి, ప్రధానంగా విప్లవోద్యమకారులకు, విప్లవోద్యమ సానుభూతిపరులైన ప్రజలకు అండగా నిలవడం మాత్రమే ఉండేది. హక్కులకోసం అడిగిన కొద్దీ నిర్బంధం పెరుగుతుందనే మాట, అందువల్ల ఉద్యమకారుల హక్కుల కొరకే ఎక్కువ శ్రద్ధతో పనిచేయాలనే మాట నిజమే. పౌరహక్కుల సంఘం ఆ పనినే ప్రధానబాధ్యతగా ఎంచుకుంటుంది కాని, దానితోపాటు పౌరహక్కుల ఉద్యమ అవగాహనను విస్తరించకపోతే సంస్థ నిర్మాణంలో విస్తృతి సాధించలేమని, సంస్థ కార్యకర్తల అవగాహన లోతు పెంచలేమని బాలగోపాల్ భావించారు. ఆ క్రమంలోనే రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడుతూనే, అసలు సమాజంలో హక్కుల ఉల్లంఘన ఎక్కడెక్కడ జరుగుతున్నదో అధ్యయనం చేయాలని, ఎక్కడెక్కడ ఉల్లంఘన జరిగితే అక్కడల్లా పౌరహక్కుల కార్యకర్తకు పని ఉంటుందని ఆయన భావించారు. రాజ్యం మాత్రమే కాక, ఆస్తి, కులం, మతం, పురుషాధిపత్యం, మత దురహంకారం వంటి శక్తులు కూడ ఆధిపత్య స్థానంలో ఉండి తమ అధీనంలో ఉన్న మనుషుల హక్కులను కొల్లగొడతాయని, అటువంటి ప్రతి సందర్భంలోనూ పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరిగినట్టే భావించి, అక్కడ ప్రజల ప్రతిఘటనను సమర్థించాలని, వారి పోరాటాలకు అండగా నిలబడాలని, ఆ పోరాటాలగురించి ప్రజలకు తెలియజెప్పే బాధ్యత తీసుకోవాలని ఆయన అనుకున్నారు. 1983 జనవరిలో వరంగల్ పౌరహక్కుల సంఘం పక్షాన ఆయన తయారుచేసిన ‘పౌరహక్కుల సంఘం దృక్పథం, పరిధి’ అనే వ్యాసం ఆ విషయాన్ని వ్యక్తీకరించింది. 1980 దశాబ్దమంతా పౌరహక్కుల సంఘం చేసిన కృషిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఆ రోజుల్లో ముఖ్యంగా 1985-89 కాలంలో ఎన్ టి రామారావు ప్రభుత్వం ‘ఆట, పాట, మాట బంద్’ అంటూ దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు, ఒకవైపు ఆ నిర్బంధాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూనే పౌరహక్కుల సంఘం విభిన్న జీవన రంగాలలోకి, వైవిధ్య పూరితమైన ప్రజాసమస్యలలోకి ప్రవేశించింది. ఆయా రంగాల ప్రజల పోరాటాలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఆయా రంగాల నుంచి పౌరహక్కుల సంఘానికి సంఘీభావం లభించింది. ఆంధ్రప్రదేశ్ లోనూ, దేశంలోనూ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలో ఈ వికాసానికి, విస్తరణకు దారితీసిన అవగాహన అందించినందుకు బాలగోపాల్ స్థానం పదిలంగా ఉంటుంది.</p>
<p style="text-align:left;">ఈ విస్తరణకు 1990 దశకం వచ్చేసరికి రెండు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి 1991 జూన్ &#8211; జులైల్లో నూతన ఆర్థిక విధానాల పేరుతో మొదలయిన ప్రపంచీకరణ విధానాలు. రెండు, 1992 డిసెంబర్ లో బాబ్రీ మసీదు విధ్వంసంతో మైనారిటీ మతస్తులమీద పెరిగిన హిందూ మతోన్మాద దాడి. ఈ రెండు పరిణామాలు అనేకమంది నిస్సహాయులను బాధితులను చేస్తాయనీ, పౌరహక్కుల ఉద్యమ పరిధిలోకి ఈ రెండు అంశాలు కూడ రావలసి ఉంటుందని గుర్తించిన తొలి మేధావులలో బాలగోపాల్ ఒకరు. ఆ రెండు అంశాలమీదా ఆయన విస్తృతంగా రాశారు, మాట్లాడారు, ప్రజాచైతన్యాన్ని పెంచడానికి విశేషంగా కృషి చేశారు.</p>
<p style="text-align:left;">దాదాపు ఆ సమయంలోనే ఆయన ఆలోచనలలో మార్పులు రావడం మొదలయింది. అప్పటివరకూ మార్క్సిజాన్ని నమ్ముతూ వచ్చిన ఆయన మార్కిస్టు విశ్లేషణా సాధనాలు ఉపయోగకరమైనవే అయినప్పటికీ, సామాజిక పరివర్తనా సాధనంగా మార్క్సిజం సరిపోదేమోననే సందేహాలు వెలిబుచ్చడం ప్రారంభించారు. మార్క్సిస్టేతర రాడికల్ ఆలోచనా ధోరణికి, బెర్ట్రాండ్ రస్సెల్ ఆలోచనలకు తాను దగ్గరవుతున్నానని చెప్పుకున్నారు. దాదాపు అదే సమయంలో రాజ్యేతర హక్కుల ఉల్లంఘనా శక్తులలో ఉద్యమసంస్థలను కూడ చేర్చాలనే ఆలోచనకు వచ్చారు. కనుక ఉద్యమసంస్థల హింసను, హక్కుల ఉల్లంఘనలను కూడ ఖండించాలన్నారు. ఈ తాత్విక భావనలు, సంస్థాగతమైన ఆచరణాత్మక సమస్యలు కలగలసి, ఆ పరిణామాలలో చివరికి ఆయన పౌరహక్కుల సంఘాన్ని వదిలి మానవహక్కులవేదికను ఏర్పాటు చేశారు.</p>
<p style="text-align:left;">ఆ వివాదం సమయంలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయంలో నాతోసహా ఆయన విమర్శకులందరమూ తీవ్రంగా పొరపాటు పడ్డాం. ఆయన మార్క్సిస్టేతర ఆలోచనల మీద 1999లో పుస్తకం రాసిన నేను ఆయన తిరోగమన దిశలో ఉన్నారని రాశాను.</p>
<p style="text-align:left;">కాని ఆయన మా ఆలోచనల బోలుతనాన్ని రుజువుచేస్తూ తన అధ్యయనం, రచన, ఆచరణ యథాతథంగానో, అంతకు ముందరి కన్న ఎక్కువగానో కొనసాగించారు. ఉద్యమ సంస్థల మీద విమర్శలు ఉంచుకుంటూనే, ఆ విమర్శలు బహిరంగంగా చెపుతూనే, ఎక్కడ ప్రజాఉద్యమానికి హక్కుల ఉద్యమ మద్దతు అవసరమయినా అక్కడికి వెళ్లారు. గతంలోలాగనే, గతంకన్న ఎక్కువగా కూడ రచనా, ఉపన్యాస కృషి కొనసాగించారు. మానవ హక్కుల వేదికను చాల బలోపేతంచేసి, రాష్ట్రంలోని ముఖ్యమైన పౌర, ప్రజాస్వామిక, మానవహక్కుల ఉద్యమ నిర్మాణంగా మార్చారు.</p>
<p style="text-align:left;">ఉద్యమ సంస్థల హింసను ఖండించే విషయంలోకూడ ఆయన ఔచిత్యాన్ని, విచక్షణను పాటించారని నా వ్యక్తిగత అనుభవం. ఎల్ టి టి ఇ మీద చివరిదాడి జరుగుతున్న సమయంలో ఆయన, నేను ఒక టివి చర్చలో పాల్గొన్నాం. అప్పుడు ఉన్న వాతావరణంలో ఆయన టైగర్ల హింసను కూడ ఖండిస్తారని నేను అనుమానించాను. ముందు మాట్లాడుతూ, ఇప్పుడు టైగర్ల హింస గురించి చర్చించే సందర్భంకాదు, ఇప్పుడు రాజపక్ష దుర్మార్గ హింస గురించే మాట్లాడాలి అని నేనన్నాను. ఆయన నాతో పూర్తిగా ఏకీభవించడం ఒక గొప్ప ఊరట.</p>
<p style="text-align:left;">తెలుగు సమాజం 1980లనుంచీ ఈ దశకందాకా పడుతున్న ఘర్షణలో ఎటువంటి మేధావి, వ్యాఖ్యాత, కార్యకర్త, ఉద్యమ నిర్మాతను కోరుకున్నదో సరిగా అటువంటి సమర్థుడైన, అద్భుత ప్రజ్ఞావంతుడైన నాయకుడు బాలగోపాల్. ఆయన స్ఫూర్తి ఎన్నటికీ చెరగదు.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/232/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/232/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/232/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/232/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/232/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/232/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/232/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/232/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/232/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/232/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=232&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/10/22/balagopal_obituary/feed/</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>The Anguish Of A Forlorn Child</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/10/09/anguish_of_a_forlorn_child/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/10/09/anguish_of_a_forlorn_child/#comments</comments>
		<pubDate>Thu, 08 Oct 2009 19:30:58 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[English]]></category>
		<category><![CDATA[Tehelka]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=229</guid>
		<description><![CDATA[IT WAS on May 23, 2008. After a tiring yet fascinating Village Walking Tour in New York’s Greenwich Village, the three of us (my poet friend Narayana Swamy, my companion Vanaja and I) engrossed ourselves in seeing places where 19-year-old Bob Dylan first sang, the pub Dylan Thomas used to frequent, 1969 Stonewall Rebellion where [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=229&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;"><img class="alignright size-full wp-image-230" title="Illustration : Anand Naorem" src="http://kadalitaraga.files.wordpress.com/2009/10/taxi_venu.jpg?w=200&#038;h=198" alt="Illustration : Anand Naorem" width="200" height="198" />IT WAS on May 23, 2008. After a tiring yet fascinating Village Walking Tour in New York’s Greenwich Village, the three of us (my poet friend <a title="SANDUKA: Narayana Swamys Blog" href="http://sanduka.wordpress.com/" target="_blank">Narayana Swamy</a>, my companion Vanaja and I) engrossed ourselves in seeing places where 19-year-old Bob Dylan first sang, the pub Dylan Thomas used to frequent, 1969 Stonewall Rebellion where the Gay Liberation Movement began, houses and restaurants and pubs that speak of their attachment to James Fennimore Cooper, Louisa May Alcott, Jack London, Upton Sinclair, Theodore Dreiser, Sinclair Lewis, Eugene O’Neill, Herman Melville and John Reed among others. Finally stepping out of New School on 12th Street, our next destination was the Brecht Forum on West Street.</p>
<p style="text-align:left;"><span id="more-229"></span>Getting into the cab, I noticed the registration plate and read out the driver’s name: Rammohan Puni.</p>
<p style="text-align:left;">‘Oh, Indian,’ I exclaimed.</p>
<p style="text-align:left;">‘Yes, Punjabi,’ he said with a bit of pride and enquired about us. Brecht Forum is also the place of <a title="about Biju Mathew on Wiki" href="http://en.wikipedia.org/wiki/Biju_Mathew" target="_blank">Biju Mathew</a>, a noted Marxist intellectual and a Hyderabadi like us. He organised the powerful cab drivers’ union, the New York Taxi Workers Alliance, and wrote <em><a title="Taxi!: Cabs and Capitalism in New York City - on AMAZON" href="http://www.amazon.com/Taxi-Cabs-Capitalism-York-City/dp/156584811X" target="_blank">Taxi!: Cabs and Capitalism in New York City</a></em>. We asked Rammohan whether he knew Biju. ‘Oh, that leftist guy. Unionist. Heard about him, but haven’t met,’ he said.</p>
<p style="text-align:left;">I then asked him whether he knew Sant Ram Udasi’s songs. Even as my question did not leave my lips, he started singing and asked me how I knew Udasi. I told him about my involvement with revolutionary literature and started tracing back my interest in Punjab. ‘I wrote a piece in Telugu about a revolutionary student leader of Punjab, who was killed by communal forces in the late 1970s,’ I said. My article was published in September 1979 issue of Srjana, a monthly forum for modern literature. He asked me who the student leader was. I said Prithipal Singh Randhawa.</p>
<p style="text-align:left;">Rammohan stopped the vehicle in the middle of the road. Luckily, there wasn’t much traffic on the street. He opened the door, stood on the road and asked me to get out. I didn’t know what it all was. As I came out he gave me a typical, warm and solid Punjabi hug and I could see tears rolling down his cheeks.</p>
<p style="text-align:left;">We resumed the journey and he went on, “Prithi was a close friend. He was from Dasuya village in Hoshiarpur district, from where I come. His village and mine were next to each other. I was with SFI then and he was with Punjab Students Union of Naxalite politics. He was killed brutally in Ludhiana in 1979. I came here 25 years ago but my mind is still in those villages. Every inch of my body and all my thoughts cry for Punjab even now,” he cried like a child.</p>
<p style="text-align:left;">Then I told him that I also translated several poems of Avtar Singh Pash into my mother tongue. As if triggered by the mention of the name, he started reciting Pash’s poems including the famous one – <em>Sabse khatarnaak hota hai</em>.</p>
<p style="text-align:left;">Then to come out of the mood, he began reciting his own compositions in Punjabi. But every poem was speaking of the anguish of a forlorn child. ‘It is my body that is here, but I am there’ was the refrain. Narayana Swamy, living in New Jersey for the last 15 years, has been writing similar nostalgic verses and they exchanged their moments of anguish. They started singing Pash together – Sabse khatarnak hota hai hamare sapnon ka mar jaana.</p>
<p style="text-align:left;">We reached our destination and paid the fare but Rammohan was not in a mood to leave. At least three other passengers were waiting for the cab. He ignored them at first and then waved them off and went on reciting poems, talking about Punjab, remembering friends and dreaming of India.</p>
<p style="text-align:left;">In the middle of the road on the Washington Street.</p>
<p style="text-align:left;">Between Bethune Street and Bank Street.</p>
<p style="text-align:left;">On a sunny afternoon.</p>
<p style="text-align:left;">We paid tributes to revolutionaries killed long ago.</p>
<p style="text-align:left;"> </p>
<p style="text-align:right;">- From <a title="Tehelka - ‘Every One Of His Poems Spoke Of The Anguish Of A Forlorn Child’" href="http://www.tehelka.com/story_main42.asp?filename=hub101009personalhistories.asp" target="_blank">Tehelka Magazine</a>, Vol 6, Issue 40, Dated October 10, 2009</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/229/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/229/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/229/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/229/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/229/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/229/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/229/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/229/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/229/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/229/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=229&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/10/09/anguish_of_a_forlorn_child/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>

		<media:content url="http://kadalitaraga.files.wordpress.com/2009/10/taxi_venu.jpg" medium="image">
			<media:title type="html">Illustration : Anand Naorem</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>తెలుగు సమాజంపై చైనా సాహిత్య ప్రభావం</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/10/03/telugu_samajam_pai_china_sahitya_prabhavam/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/10/03/telugu_samajam_pai_china_sahitya_prabhavam/#comments</comments>
		<pubDate>Fri, 02 Oct 2009 22:01:44 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[Telugu]]></category>
		<category><![CDATA[Vaartha]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/2009/10/03/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf/</guid>
		<description><![CDATA[తెలుగు సమాజం మీద చైనీస్ సాహిత్య ప్రభావం గత అరవై సంవత్సరాలకుపైగా చాల ఎక్కువగానే ఉంది. అసలు భారత సమాజంమీదనే ఈ ప్రభావం బలంగా ఉండడానికి చాల కారణాలున్నాయి. విముక్తి పూర్వ చైనా ప్రజల కడగండ్లతో సమానమైన వేదన భారత ప్రజానీకంలో కూడ ఉండడం కావచ్చు. చైనాలో ఉండిన అర్ధభూస్వామ్య, అర్ధ వలస రాజకీయార్థిక, సామాజిక స్థితే ఇక్కడ కూడ ఉండడం కావచ్చు. చైనాలో సాగిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పోలిన విప్లవమే భారత సమాజంలో కూడ [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=227&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;">తెలుగు సమాజం మీద చైనీస్ సాహిత్య ప్రభావం గత అరవై సంవత్సరాలకుపైగా చాల ఎక్కువగానే ఉంది. అసలు భారత సమాజంమీదనే ఈ ప్రభావం బలంగా ఉండడానికి చాల కారణాలున్నాయి. విముక్తి పూర్వ చైనా ప్రజల కడగండ్లతో సమానమైన వేదన భారత ప్రజానీకంలో కూడ ఉండడం కావచ్చు. చైనాలో ఉండిన అర్ధభూస్వామ్య, అర్ధ వలస రాజకీయార్థిక, సామాజిక స్థితే ఇక్కడ కూడ ఉండడం కావచ్చు. <span id="more-227"></span>చైనాలో సాగిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పోలిన విప్లవమే భారత సమాజంలో కూడ జరగవలసి ఉందనే విప్లవోద్యమ అవగాహనలవల్ల కావచ్చు. తెలుగు సమాజంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ విప్లవోద్యమం సజీవంగా, శక్తిమంతంగా ఉండడం వల్ల చైనా సాహిత్య అధ్యయనం, అనువాదం, అనుసరణ, ఆచరణ, ప్రభావం విస్తృతంగా ఉన్నాయి.</p>
<p style="text-align:left;">‘ఓల్గా ఘనీభవించెను/ యాంగ్సీ నది పొంగెను/ హోరుహోరు హోరుగా/ హొయలు హొయలు హొయలుగా/ రుతుగీతికి పులకరించి/ గంగ కూడ పొంగెను’ అని శివసాగర్, ‘బోల్షివిక్కు వారసులం/ నక్సల్బరి బిడ్డలం/ జనచైనా వెలుగులలో/ నడుస్తున్న వారలం’ అని చెరబండరాజు భారత సమాజంమీద చైనా ప్రభావాన్ని మూడున్నర దశాబ్దాల వెనుకనే కవితాత్మకంగా వ్యక్తీకరించారు.</p>
<p style="text-align:left;">బ్రిటిష్ పాలన వల్ల మనకు ఇరుగుపొరుగు, సోదర ఆసియన్ దేశాల సాహిత్యం కన్న యూరపియన్ సాహిత్యమే ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. చైనా సాహిత్యం తెలుగులోకి రావడం ఎప్పుడు మొదలయిందో పరిశోధించవలసే ఉంది గాని 1940ల కన్న ముందు, సన్ యట్ సేన్ గురించి అరకొర ప్రస్తావనలు తప్ప, అనువాదాలు గాని, చైనా ప్రభావం గాని పెద్దగా ఉన్నట్టు కనబడడం లేదు.</p>
<p style="text-align:left;">‘చైనా మార్గమే మన మార్గం’ అనే మాట మొదటిసారి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర ప్రొవిన్షియల్ కమిటీ 1948 జూలై 9 న చేసిన తీర్మానంలో కనబడుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి వివరించే క్రమంలో ఈ అవగాహన వ్యక్తమయింది. నిజానికి అప్పటికి చైనా విప్లవం విజయం సాధించలేదు. కాని అప్పటికే చైనా విప్లవపరిణామాల గురించిన వార్తలు తెలుగు సమాజంలోకి వస్తున్నాయి. అన్నా లూయీ స్ట్రాంగ్ రాసిన ‘మా సి యాంగ్ బోధనలు’ అనే పుస్తకాన్ని ప్రజాశక్తి ప్రచురణాలయం 1947 లోనే ప్రచురించింది. అటూ ఇటూగా కమ్యూనిస్టు, అభ్యుదయ పత్రికలలో చైనా గురించిన వార్తలు, వ్యాసాలు, రచనల అనువాదాలు మొదలయి ఉంటాయి.</p>
<p style="text-align:left;">చైనా విముక్తి (1949 అక్టోబర్ 1) తర్వాత సహజంగానే చైనా వ్యవహారాలపట్ల ఆసక్తి మరింత పెరిగింది. తెలుగు సమాజంలో కూడ 1950 దశకం తొలి అర్ధభాగంలో చైనా సాహిత్య అనువాదాలు విస్తరించాయి. మావోసేటుంగ్ వ్యాసాలు ఆచరణ, ప్రజల ప్రజాతంత్ర నియంతృత్వం లను మహీధర జగన్మోహన రావు అనువాదం చేశారు. వాటిని మహీధర సోదరులు రాజమండ్రిలో ప్రారంభించిన విశ్వసాహిత్యమాల 1952 లో విడివిడిగా ప్రచురించింది. “చైనాను గురించీ, ప్రపంచాన్ని కదిల్చివైచిన చైనా విప్లవాన్ని గురించీ, చైనా విప్లవ సారథులైన మావ్ మొదలైన వారి సిద్ధాంతాలను గూర్చీ తెలుగుభాషలో వున్న పుస్తకాలు చాల కొద్ది మాత్రమే. చైనా సాహిత్యమును మన తెలుగు భాషలోకి తేవడానికి యధాశక్తి విశ్వసాహిత్యమాల ప్రయత్నించగలదని మనవి చేస్తున్నాము” అని జగన్మోహనరావు రెండో పుస్తకానికి పీఠికలో రాశారు. ఆ తర్వాత వారే, డిప్యూటీ చైర్మన్ అనే చీనా విప్లవకథల సంపుటాన్ని, ఆస్వాల్డ్ ఎడ్ బర్గ్ రాసిన (సంకలనం చేసిన?) చీనా కథలు అనే సంపుటాన్నీ ప్రచురించారు. పురిపండా అప్పలస్వామి అనువాదం చేసి, సంపాదకత్వం వహించిన విశ్వకథావీథి సంపుటాలలో (1955) టింగ్ లింగ్, లూసన్ ల కథలు చెరి ఒకటి ఉన్నాయి. చైనా విప్లవ క్రమంలో తమ ప్రత్యక్ష భాగస్వామ్యానికి నవలా రూపం ఇస్తూ యువాన్ చింగ్, కుంగ్ చూయే రాసిన కొడుకులు – కూతుళ్లు ను చిట్టా మహానందీశ్వరశాస్త్రి (మహేశ్) అనువదించగా ఆదర్శ గ్రంథమండలి 1955లోనే ప్రచురించింది.</p>
<p style="text-align:left;">ఆ తర్వాత గడిచిన అరవై సంవత్సరాలలో తెలుగులో చైనా పుస్తకాల అనువాదాలు వందకు పైగానే వెలువడి ఉంటాయి. వాటిలో కొన్ని పుస్తకాలు అనేక సార్లు పునర్ముద్రణలు కూడ పొందాయి. తెలుగు పత్రికలలో చైనా రచనల అనువాదాలు వందలాదిగా వెలువడ్డాయి. చైనా గురించి ఇతరులు రాసిన పుస్తకాల అనువాదాలు, తెలుగులో స్వతంత్ర రచనలు కూడ వెలువడ్డాయి. ఈ విశాలమైన చైనా ప్రభావిత సాహిత్య సంపదలో కథ, కవిత్వం, నవల, వ్యాసం, బాల సాహిత్యం వంటి సృజనాత్మక రచనలు, విప్లవోద్యమ అనుభవ కథనాలు, చైనా గురించి విదేశీయుల రచనలు, సైద్ధాంతిక రచనలు, తెలుగు రచయితలు రాసిన విశ్లేషణలు ఉన్నాయి.</p>
<p style="text-align:left;">అలాగే ఈ ఆసక్తి గత ఆరు దశాబ్దాలలో వేరువేరు సందర్భాలలో వేరువేరుగా కూడ వ్యక్తమయింది. మొదటి దశ 1950ల నుంచి 1960ల మధ్య భాగందాకా సాగితే, 1966-67 నుంచి 1980ల మధ్యదాకా రెండో దశగా, ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా మరొకదశగా సాగుతోంది. మొదటి దశలో విప్లవం సాధించిన మరొక వ్యవసాయ సమాజ అనుభవాన్ని తెలుసుకోవలసిన అవసరం నుంచి, తొలి ఆసక్తి నుంచి రచనలు, అనువాదాలు, పరిచయాలు సాగాయి. కాని అప్పటికే తెలుగు నాట కమ్యూనిస్టు ఉద్యమం సోవియట్ ప్రభావంలో ఉండడం వల్ల, 1956 నుంచే సోవియట్ యూనియన్ కూ చైనాకూ మధ్య విభేదాలు మొదలు కావడం వల్ల తెలుగునాట అధికారిక కమ్యూనిస్టు ప్రచురణలు గాని, రచయితలు గాని చైనా సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఈ లోగా 1962లో భారత – చైనా యుద్ధం జరగడంతో నిరాధారమైన దేశభక్తి, చైనా పట్ల వ్యతిరేకత తెలుగు రచయితలలో వ్యక్తమయ్యాయి. అజంతా, కాళోజీ వంటి కవులు కూడ చైనా వ్యతిరేక కవిత్వం రాశారు. మొత్తం మీద మొదటి దశ, కొద్దికాలం వ్యతిరేకత మినహాయిస్తే, కేవలం పరిచయ దశగా, ఆసక్తి ప్రేరక దశగానే తప్ప నిజంగా ప్రభావం వేయగలిగిందా అనుమానమే.</p>
<p style="text-align:left;">ఇక సోవియట్ యూనియన్ కమ్యూనిస్టుపార్టీకీ, చైనా కమ్యూనిస్టు పార్టీకీ గ్రేట్ డిబేట్ జరిగి, అది అంతర్జాతీయ ప్రకంపనాలు సృష్టించి, భారతదేశంలో కూడ నక్సల్బరీ పంథా ఆ ప్రభావానికి లోనయిన తర్వాత, చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారికంగా నక్సల్బరీ పంథాను సమర్థించిన తర్వాత చైనా ప్రభావం విస్తృతమయింది. నక్సల్బరీ ప్రజ్వలనను చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారపత్రిక పీపుల్స్ డైలీ ‘వసంతమేఘ గర్జన’ గా అభివర్ణించింది. చైనా పట్ల భారత విప్లవోద్యమపు మైత్రి చైనా చైర్మన్ మన చైర్మన్ అనే అతివాద నినాదం దాకా విస్తరించింది. అప్పటి లిబరేషన్ పత్రికలోనూ, అప్పుడు వెలువడిన అనేక పుస్తకాల మీద రేడియో పెకింగ్ ఇంగ్లిషు, హిందీ ప్రసారాల వేళలు ప్రచురించారంటే ఆ ప్రభావం ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థమవుతుంది. ఈ పూర్వరంగంలో చైనా సాహిత్య అధ్యయనం, అనువాదం, ప్రచారం 1960ల చివరినుంచీ, 1980ల మొదటి దాకా విపరీతంగా సాగాయి. మొత్తం పుస్తకాలలో మూడు వంతులు ఆ పది పన్నెండు సంవత్సరాలలోనే వెలువడి ఉంటాయి.</p>
<p style="text-align:left;">మావో మరణానంతరం డెంగ్ సియావో పింగ్ అధికారానికి వచ్చి చైనా కమ్యూనిస్టుపార్టీనీ, పాలననూ పెట్టుబడిదారీ మార్గానికి మళ్లించిన తర్వాత, చైనా మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. పాత ప్రచురణల పునర్ముద్రణలు, చైనా మీద విదేశీయులు రాసిన విశ్లేషణల ప్రచురణలు, విప్లవకాలపు అనుభవాల పాత పుస్తకాల అనువాదాలు మినహా సమకాలీన చైనా సాహిత్యం గురించి తెలుసుకోవడానికి తెలుగు సమాజం పెద్దగా ప్రయత్నించినట్టులేదు, ప్రభావితమయిందీ లేదు. అడవిగాచిన వెన్నెల వంటి కమ్యూనిస్టు వ్యతిరేక రచనల అనువాదాలు ఒకటి రెండు వచ్చాయిగాని వాటి ప్రభావం పెద్దగా లేదు.</p>
<p style="text-align:left;">ఇవాళ్టి స్థితి ఏమయినప్పటికీ, రెండో దశలో వెలువడిన ప్రచురణలు, విస్తరించిన ప్రభావం అపారమైనవి. ప్రాంతాల పేర్లతోనూ, మనుషుల పేర్లతోనూ, బౌద్ధ సంస్కృతి చిహ్నాల తోనూ తెలుగు పాఠకులు కొంత దూరాన్ని అనుభవించినప్పటికీ, చైనా వ్యవసాయసమాజపు జీవితాన్ని చదువుతుంటే మన జీవితం చదువుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడి పోరాట అనుభవాలు చదువుతుంటే మన పోరాట అనుభవాలు మనం నెమరు వేసుకుంటున్నట్టే ఉంటుంది. అతిభయంకరమైన నిర్బంధకాండ సాగుతున్నప్పుడు విప్లవసందేశాన్ని వినిపించడానికి లూసున్ ఉపయోగించుకున్న వ్యంగ్య రచనా శైలి మన రచయితలను ఎందరినో ప్రభావితులను చేసింది. కొడుకులు – కూతుళ్లు నవలను మహేశ్ కేవలం ఆసక్తి తోనే, ఏ ఉద్యమ వాతావరణం లేనప్పుడే అనువాదం చేసి ఉండవచ్చు గాని, నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో ఆ నవల గోర్కీ అమ్మ లాగ నిత్య పఠనీయ గ్రంథమయింది. ఉద్యమం తర్వాత వెలువడిన మొదటి నవల టావ్ చెంగ్ నాకుటుంబం (నోముల సత్యనారాయణ అనువాదం) మొదట 1972లో సృజనలో సీరియల్ గా వచ్చి, తర్వాత పుస్తక రూపంలో వెలువడింది. ఇప్పటికి ఎన్నోసార్లు పునర్ముద్రణ పొందిన నాకుటుంబం ఒక స్త్రీ ప్రధాన పాత్రగా చైనా విప్లవఘట్టాలను అత్యంత రోమాంచకారిగా వివరిస్తుంది. మరికొద్దికాలానికే చౌ లి పో నవల ఉప్పెన చైనాలో జరిగిన విప్లవ భూసంస్కరణలను, గ్రామీణ జీవిత సంక్లిష్టతను చెపుతూ భారత విప్లవం ఏమి సాధించదలచుకున్నదో కళాత్మకంగా చూపించింది. ఎన్ ఎస్ ప్రకాశరావు ప్రారంభించిన ఆ అనువాదాన్ని ఆ తర్వాత నళిని కొనసాగించారు. మొదట సృజనలో సీరియల్ గా వచ్చిన ఈ నవల రెండు భాగాలు సృజన ప్రచురణగా వెలువడింది. పాత్రల సంభాషణలలో విశాఖపట్నం మాండలికాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఉప్పెన తెలుగు సమాజానికి చాల సన్నిహితమయింది. ఆ తర్వాత విద్యార్థి యువజన ఉద్యమాలను వివరించే యాంగ్ మో నవల ఉదయగీతిక, ఎర్రమందారాలు నవలలు 1980లలో వెలువడి చాల ఆదరణను పొందాయి. ఇప్పటికి రెండు మూడు సార్లు పునర్ముద్రణ పొందాయి. వీటితో పాటుగానే చెప్పుకోదగినవి సు కువాంగ్ యావో నవల మైదానం మండుతోంది, లిన్ చింగ్ నవల నవజీవన నిర్మాతలు.</p>
<p style="text-align:left;">చైనా కథల తెలుగు అనువాదాలు కూడ ఎన్నో వచ్చాయి. కేవలం లూసన్ వంటి లబ్ధప్రతిష్టులైన కథకుల కథలు మాత్రమే కాక, చైనీస్ లిటరేచర్ పత్రికలోనూ, ఇతరచోట్లా వచ్చిన భావ స్ఫోరకమైన, ప్రభావ శీలమైన కథలెన్నో తెలుగులోకి అనువాదమయ్యాయి. చలసాని ప్రసాదరావు సొంతంగా ఒక అనువాదకథల పుస్తకం ప్రచురించగా, వివిధ పత్రికలలో వచ్చిన చైనా అనువాద కథలను క్రాంతి ప్రచురణలు నేలతల్లి చెర విడిపించిన లాంగ్ మార్చ్ పేరుతో ప్రచురించింది. అలాగే యే ట్జు కథల సంపుటం పంట ను కూడ వెలువరించింది. అలాగే నేనూ బడికి వెళ్తా, బాల గెరిల్లా లాంటి బాలసాహిత్య రచనలు కూడ ఎన్నో తెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా ఎన్నో కవితలు, వ్యాసాలు, నాటికలు కూడ అనువాదమయ్యాయి.</p>
<p style="text-align:left;">ఇక ఇక్కడ సాగుతున్న విప్లవోద్యమానికి స్ఫూర్తినీ, ప్రేరణనూ అందించడానికి చైనా విప్లవోద్యమ చరిత్రలోని అద్భుత ఘట్టాలగురించిన పుస్తకాలు కూడ ఎన్నో తెలుగులో వెలువడ్డాయి. లాంగ్ మార్చ్ లో చైర్మన్ మావోతో, కోట్లాది వీరయోధులు, మావో జీవితచరిత్రలు, ఛూటే జీవితచరిత్ర జైత్రయాత్ర, నార్మన్ బెతూన్ జీవితచరిత్ర రక్తాశ్రువులు, కంకార్డ్ దీవి మిలీషియా మహిళలు వంటి రచనలు వేలాదిమందికి తమ విప్లవజీవితంలో ఉత్తేజాన్ని నింపాయి. అలాగే చైనా విప్లవం జరుగుతున్న సమయంలోనే చైనాలో పర్యటించిన జర్నలిస్టు ఎడ్గార్ స్నో రాసిన చైనాపై అరుణతార ఎంతోమందిలో విప్లవవిజయం గురించిన విశ్వాసాన్ని నింపింది. విలియం హింటన్ చైనా గ్రామీణ ప్రాంతాలలో సాగిన విప్లవ భూసంస్కరణల గురించి రాసిన ఫాన్ షెన్ కు సహవాసి సంక్షిప్త అనువాదం విముక్తి చాలమందిలో విప్లవ నిబద్ధతను బలోపేతం చేసింది. అలాగే జాక్ బెల్డెన్ చైనాలో జరుగుతున్న మార్పుల గురించి రాసిన చైనా షేక్స్ ది వరల్డ్ లోనుంచి కొన్ని అధ్యాయాలు తెలుగులోకి వచ్చాయి. చైనాలో జరిగిన మార్పులన్నిటిలోకీ ముఖ్యమైనది స్త్రీలపట్ల సామాజిక దృక్పథంలో వచ్చిన మార్పు. పాదాలకు బంధనాలు విధించి పరుగెత్తడానికి కూడ వీలులేకుండా చేసిన పాత సమాజం నుంచి స్త్రీలను సోషలిజం విముక్తి చేసింది. ఆ విముక్తి కథనాలు క్లాడీ బ్రాయెల్, డెలియా డేవిన్ ల వంటి పాశ్చాత్య రచయితల పుస్తకాల అనువాదాల ద్వార తెలుగు పాఠకులకు చేరాయి.</p>
<p style="text-align:left;">చైనా శ్రామికవర్గ మహత్తర సాంస్కృతిక విప్లవంలో జరిగిన ప్రయోగాలు, సాగిన అన్వేషణలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బ్రాడ్ షీట్ గ్రూప్ పేరుతోనూ, కన్సర్న్ డ్ ఏషియన్ స్కాలర్స్ పేరుతోనూ, స్వతంత్రంగానూ అనేక మంది అమెరికన్లు, యూరపియన్లు చైనా అధ్యయనాలు సాగించారు. ఇంగ్లిషులో వందలాది పుస్తకాలు వెలువడ్డాయి. ఆ పుస్తకాలలోనుంచి అనువాదాలు గాని, పరిచయాలుగాని, ఉపన్యాసాలలో ప్రస్తావనలుగాని తెలుగులోకి వచ్చి చాల ప్రభావం చూపాయి. డెంగ్ అనంతర పరిణామాల గురించి కూడ ఛార్లెస్ బెతల్ హాం, విలియం హింటన్ మొదలయిన వారి రచనలు తెలుగులోకి వచ్చాయి.</p>
<p style="text-align:left;">ఇక చైనా విప్లవనాయకుల, కార్యకర్తల రచనల తెలుగు అనువాదాలకయితే లెక్కలేదు. 1970ల తొలిరోజుల్లోనే చండ్ర పుల్లారెడ్డి అనువాదం చేసిన మావో మిలిటరీ రచనలు తెలుగులోకి వచ్చాయి. మావో రచనల చైనా అధికారిక ప్రచురణ ఐదు సంపుటాలతో పాటు, ఇంగ్లిషులోనూ తెలుగులోనూ మరొక ఐదు సంపుటాలు ప్రచురించిన ఘనత తెలుగు విప్లవోద్యమానిదే. మావో రచనలలో నుంచి విడివిడి వ్యాసాల పుస్తకాలు కూడ ఎన్నో వెలువడ్డాయి. చైనా విప్లవోద్యమ చరిత్ర పుస్తకాలు కనీసం రెండు (హోచియావో మూ, హో కాన్ చీ) వెలువడ్డాయి. మావో రాసిన కళలూ సాహిత్యం ఎవరికోసం తో పాటు, లూసన్, మావో టున్ తదితరుల విప్లవసాహిత్య విమర్శ వ్యాసాలు ఎన్నో తెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సిద్ధాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన గ్రేట్ డిబేట్ తెలుగులోకి సంపూర్ణంగా వచ్చింది. చౌ ఎన్ లై, ఛూటే, లీ షావ్ చీ, వాంగ్ మింగ, లిన్ పియావో వంటి నాయకుల రచనలు కూడ తెలుగులోకి వచ్చాయి. చైనాలో రాజకీయార్థశాస్త్రం, తత్వశాస్త్ర, చరిత్ర లలో జరిగిన పరిశోధనలు కూడ తెలుగులోకి వచ్చాయి.</p>
<p style="text-align:left;">చైనా ప్రగతి గురించీ, సాంస్కృతిక విప్లవం గురించీ, చైనాలో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించీకూడ తెలుగులో రచనలు వెలువడ్డాయి. శ్రీశ్రీ తన చైనా పర్యటన అనుభవాలను చైనా యానం పేరుతో ప్రచురించారు.</p>
<p style="text-align:left;">మొత్తంగా చెప్పాలంటే తెలుగు సమాజపు ఆలోచనలలో, ఆచరణలో, ఉద్యమాలలో, ప్రభావంలో చైనా పాత్ర అపారమైనది, అసాధారణమైనది. తెలుగు వారి, కనీసం తెలుగు ఉద్యమకారుల మనసులోపలి సన్నిహిత మిత్రురాలు చైనా. కనీసం 1940లనుంచి 1970ల చివరివరకూ అయినా.</p>
<p style="text-align:left;">తెలుగు సమాజం మీద చైనా సమాజ, సాహిత్య ప్రభావాలకు చెరగని నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా రెండు ఉదాహరణలు మాత్రం చెప్పుకోవచ్చు. ఒకటి ఇంద్రవెల్లి స్థూపం. చైనా పర్యటించి, బీజింగ్ లోని తియెన్ ఆన్ మెన్ స్క్వేర్ లో స్థూపాన్ని చూసి ఉత్తేజితులైన ఆంధ్రప్రదేశ్ రైతుకూలి సంఘం అధ్యక్షులు గంజి రామారావు, ఆదివాసి అమరవీరుల స్మృతిలో అటువంటి స్థూపమే ఇంద్రవెల్లిలో నిర్మించాలని ఆలోచించారు. ఎంతోకాలం ఇంద్రవెల్లిలో మకాంవేసి దాని నిర్మాణాన్ని పర్యవేక్షించారు. తర్వాత ప్రభుత్వం దాన్ని కూల్చివేసింది గాని ఇంద్రవెల్లి ఆకాశం బీజింగ్ ఆకాశానికి ప్రతిబింబాన్ని చూపుతూనే ఉంటుంది.</p>
<p style="text-align:left;">రెండవది, చాల భాషలవారికి తెలియనిదీ, తెలుగువారికి వెంటనే అర్థమయ్యేదీ ఆకాశంలో సగం అనే వ్యక్తీకరణ. స్త్రీల గురించి మాట్లాడుతూ మావో అన్న ఆమాట తెలుగు నుడికారంలోకి పూర్తిగా సంలీనమైపోయింది. కొన్ని డజన్లమంది రచయితలూ కవులూ ఆ అభివ్యక్తిని వాడుకున్నారు.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/227/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/227/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/227/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/227/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/227/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/227/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/227/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/227/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/227/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/227/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=227&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/10/03/telugu_samajam_pai_china_sahitya_prabhavam/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ఇరుగుపొరుగుతో ఎందుకీ యుద్ధోత్సాహం?</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/10/01/yuddhotsaham/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/10/01/yuddhotsaham/#comments</comments>
		<pubDate>Thu, 01 Oct 2009 12:01:39 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[Ee Bhoomi]]></category>
		<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=225</guid>
		<description><![CDATA[ఇరుగుపొరుగుదేశాలతో యుద్ధం జరపాలని నిర్ణయాలు తీసుకునేవాళ్లు, యుద్ధం జరగాలని కోరుకునేవాళ్లు, యుద్ధానికి ఆయుధ సంపత్తి సమకూర్చేవాళ్లు, యుద్ధాన్ని సమర్థిస్తూ, యుద్ధానికి కారణాలు చూపిస్తూ వాదనలు చేసేవాళ్ళు చాలమందే ఉంటారు. కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కడా ఏయుద్ధంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్లో, వాళ్ల కుటుంబ సభ్యులో మరణించడం గురించీ, నష్టపోవడం గురించీ ప్రశ్నించవలసిన అవసరమే లేదు. ఎవరో ఎక్కడో ఏ కారణం వల్లనో ఏ స్వలాభం కోసమో యుద్ధం జరపాలని నిర్ణయం తీసుకుంటే అందులో మరణించేది అటయినా [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=225&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;">ఇరుగుపొరుగుదేశాలతో యుద్ధం జరపాలని నిర్ణయాలు తీసుకునేవాళ్లు, యుద్ధం జరగాలని కోరుకునేవాళ్లు, యుద్ధానికి ఆయుధ సంపత్తి సమకూర్చేవాళ్లు, యుద్ధాన్ని సమర్థిస్తూ, యుద్ధానికి కారణాలు చూపిస్తూ వాదనలు చేసేవాళ్ళు చాలమందే ఉంటారు. కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కడా ఏయుద్ధంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్లో, వాళ్ల కుటుంబ సభ్యులో మరణించడం గురించీ, నష్టపోవడం గురించీ ప్రశ్నించవలసిన అవసరమే లేదు. <span id="more-225"></span>ఎవరో ఎక్కడో ఏ కారణం వల్లనో ఏ స్వలాభం కోసమో యుద్ధం జరపాలని నిర్ణయం తీసుకుంటే అందులో మరణించేది అటయినా ఇటయినా పొట్టకూటికోసం సైనికులుగా ఉద్యోగాలు చేసేవాళ్లు. నష్టపోయేది అతి సాధారణ ప్రజలు. ధ్వంసమైపోయేది సమాజసంపద. ఇంతకూ ఆ యుద్ధం సాధారణంగా అబద్ధాలమీద ఆధారపడి ఉంటుంది. చరిత్రపొడవునా కట్టెదుట ఈ కఠినవాస్తవం కనబడుతున్నా మన మధ్యతరగతి ఆలోచనాపరులకు, పత్రికాపాఠకులకు పొరుగుదేశంతో యుద్ధం అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. గజ్జెల మల్లారెడ్డి చెప్పినట్టు భక్తిరసం కాదుగాని, దేశభక్తిరసం తెప్పలుగా పారుతుంది. డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతుంది.</p>
<p style="text-align:left;">ఇప్పుడు అటు చైనాతోనూ, ఇటు పాకిస్తాన్ తోనూ కూడ సరిహద్దులలో నెలకొన్నదని చెపుతున్న స్థితి సరిగ్గా ఈ వాతావరణాన్నే కల్పిస్తున్నది. అసలు ఆ స్థితి ఉన్నమాట నిజమేనా, లేకపోతే ఆ స్థితి ఉన్నదని చెపుతున్నవాళ్లు ఏ అవసరం కోసం చెపుతున్నారు, ఒకవేళ ఆ స్థితి ఉంటే దానితో వ్యవహరించడానికి యుద్ధమే ఏకైక మార్గమా, ఇతర సామరస్యపూర్వకమైన, దౌత్యపరమైన చర్చలు, చర్యలు సాధ్యం కాదా లాంటి అనేక ప్రశ్నలు వేయవలసి ఉంది. ఇవాళ్టి ఘర్షణామయ స్థితి నెలకొనడానికి చరిత్రలో ఇరుదేశాల ప్రభుత్వాల పాత్ర ఎంత, వలసవాద పాలకుల పాత్ర ఎంత వంటి అంశాలు కూడ ఆలోచించవలసి ఉంది.</p>
<p style="text-align:left;">చైనా సైనికులు అరుణాచలప్రదేశ్ లోకీ, సిక్కింలోకీ, లడాఖ్ లోకీ చొచ్చుకువస్తున్నారని, మెక్ మోహన్ రేఖనూ, వాస్తవాధీన రేఖనూ దాటి ఈ చొరబాట్లు, అడపాదడపా కాల్పులు సాగుతున్నాయనీ భారతీయ పత్రికలలో కొద్దికాలంగా వార్తల హోరు పెరిగింది. భారత ప్రభుత్వమే వాస్తవాధీన రేఖను దాటి తన సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదనీ, ఇది 1993 చైనా &#8211; భారత ఒప్పందానికి ఉల్లంఘన అనీ అటు చైనా ప్రభుత్వం వాదిస్తోంది. 1962 భారత – చైనా యుద్ధం మీద ప్రామాణిక గ్రంథం రాసిన నెవిల్ మాక్స్ వెల్ వంటి స్వతంత్ర పరిశీలకులు కూడ చైనా వాదనను సమర్థిస్తున్నారు.</p>
<p style="text-align:left;">నిజానికి ఇరుదేశాల సరిహద్దు ఘర్షణల వార్తలలో నమ్మదగినవెన్నో, స్వార్థ ప్రయోజక శక్తుల కల్పనలెన్నో ఎవరూ చెప్పలేరు. సాధారణంగా రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా సైనిక అధీనంలో ఉంటాయి. అక్కడ ఏమి జరుగుతున్నదో సైనికాధికారులు అధికారికంగా చేసే ప్రకటనలు తప్ప స్వతంత్రంగా నిర్ధారించుకునే అవకాశం ఉండదు. అందులోనూ భారతదేశానికి పొరుగుదేశాలతో సరిహద్దులు నిర్జనమైన హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్నాయి గనుక అక్కడ నిజానిజాలు నిష్పక్షపాతంగా తేల్చుకోగలిగిన అవకాశమే లేదు.</p>
<p style="text-align:left;">ఇటువంటి, నిర్ధారించుకోవడానికి అవకాశాలు లేని, లేదా అవకాశాలు తక్కువగా ఉన్న చోట్ల స్వప్రయోజనపరుల ప్రచారాలకు ప్రాధాన్యత వస్తుంది. ఇంగ్లిషు సామెత చెప్పినట్టు ‘సంక్షుభిత జలాలలో చేపలు పట్టడానికి’ అవకాశం ఎక్కువ. ఇరుగుపొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతూ, తద్వారా కృత్రిమ దేశభక్తిని రెచ్చగొట్టి దేశప్రజలను తమ నిజమైన సమస్యలనుంచి ఏమార్చదలచినవాళ్లకు ఇది మంచి అవకాశం. దేశరక్షణ అనేది ప్రశ్నించడానికి వీలులేని పవిత్ర గోవు వంటిది గనుక ఇక్కడ అన్నిపనులూ రహస్యంగా సాగిపోతాయి. అలా రహస్యంగా సాగే వేలకోట్ల రూపాయల ఆయుధ, సైనికావసరాల వ్యాపారాలు నిర్వహించడానికీ కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. ఆ శక్తులు ప్రచార సాధనాలను వాడుకుని లేని బూచిని చూపడానికి ప్రయత్నిస్తుంటాయి. ఆ శక్తులలోనే కొన్ని విభిన్న ప్రచారాలు కూడ చేస్తూ ప్రజలను గందరగోళంలో ముంచడానికి ప్రయత్నిస్తాయి. మొత్తం మీద విదేశీ సంబంధాలలో, సరిహద్దుల విషయంలో భారత పాలకులు, సైనికాధికారులు, ఆయుధ వ్యాపారులు మొదటినుంచీ అనుసరిస్తున్న వ్యూహం ఇదే.</p>
<p style="text-align:left;">పొరుగుదేశాలతో సమస్యలు ఉంటే చిత్తశుద్ధితో దౌత్యసంబంధాలద్వారా పరిష్కరించుకునే బదులు, వాటిని వాడుకుని దేశంలోపలి సమస్యలను విస్మరింపజేయడానికి ప్రయత్నించడం, ప్రజలను రెచ్చగొట్టి వారు తమ నిజజీవిత సమస్యలమీద కాకుండా ఊహాత్మక, కల్పిత సమస్యలమీద ఆందోళన పడేలా చేయడం భారత పాలకులు ఒక కళగా అభివృద్ధి చేశారు. అందుకే ప్రస్తుత ఘర్షణలలో ఒకవైపు ‘భారత సరిహద్దులు అత్యంత శాంతియుతంగా ఉన్నాయి, దానిమీద ఆందోళన పడవలసిందేమీలేదు’ అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ ఎం కృష్ణ అంటుండగానే, ఆయా ప్రాంతాల సైనికాధికారులు, యుద్ధ సన్నాహాలవల్ల లాభపడే వ్యాపారులు చైనా సైనికుల చొరబాట్ల గురించి భయం గొలిపే ప్రకటనలు చేస్తున్నారు. భారతీయ జనతాపార్టీ, ఇండియన్ డిఫెన్స్ రివ్యూ లాంటి యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే పత్రికలు, యుద్ధవ్యవహారాల విశ్లేషకులు, కొన్ని సాధారణ పత్రికలు కూడ ఏదో జరిగిపోతున్నదన్నట్టు, వెంటేనే యుద్ధానికి సర్వసన్నాహాలు చేయాలన్నట్టు హడావిడి చేస్తున్నాయి. భారత ప్రభుత్వం ఉండవలసినంత యుద్ధ సన్నద్ధతతో లేదని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానిస్తున్నది. వెంటనే ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని, చైనా చొరబాట్లను గట్టిగా తిప్పికొట్టాలనీ పిలుపునిచ్చింది. భారత ప్రభుత్వం కూడ అధికారికంగా మాత్రం చైనా ప్రభుత్వానికి కోపం తెప్పించే మాటలూ చేతలూ వద్దని అంటూనే, ఏ సమస్యనైనా దౌత్య పరంగానే పరిష్కరించుకోవాలని అంటూనే, మరోవైపు యుద్ధోన్మాదాన్ని రాజేసే పనులు చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు, పాలకులు ప్రజలకు నిజాలు చెప్పరనీ, అబద్ధాలాడి మాయ చేస్తారనీ భావించే మేధావులు, పత్రికా వ్యాఖ్యాతలు కూడ సరిహద్దులు, విదేశీ సంబంధాల విషయంలో మాత్రం ప్రభుత్వం చెప్పే ప్రతి మాటనూ నమ్మడానికి సిద్ధంగా ఉంటారు.</p>
<p style="text-align:left;">చైనాకూ భారతదేశానికీ సరిహద్దు తగాదా కొత్తది కాదు. బ్రిటిష్ పాలనాకాలం నాటినుంచీ శతాబ్దానికి పైగా సాగుతున్న సమస్య ఇది. భారత ఉపఖండాన్ని తాము ప్రత్యక్షంగా పాలించే స్థితి రద్దయిపోయినా ఇక్కడ ఆరని మంటలకోసం చిచ్చు రగిల్చిపోవాలనుకున్న వలసవాదుల వ్యూహంలో భాగంగానే ఈ ఘర్షణలన్నీ తలెత్తాయి. మెక్ మోహన్ రేఖ, డురాండ్ రేఖ, రాడ్ క్లిఫ్ రేఖ వంటి భారతదేశపు సరిహద్దురేఖలన్నీ భారత ప్రజలకు, పొరుగుదేశాల ప్రజలకు, ఆ ప్రజాజీవితాలకు సంబంధంలేకుండా బ్రిటిష్ పాలకులు గీసినవే. బ్రిటిష్ అధికారి మెక్ మోహన్ 1914లో అప్పటి బ్రిటిష్ ఇండియాకూ, అప్పటి టిబెట్ కూ మధ్య సరిహద్దుగా గీసిన రేఖను చైనా ప్రభుత్వాలు ఏవీ గుర్తించలేదు. భారత ప్రభుత్వం ఆ రేఖ గురించి పట్టుపడుతుండగానే, 1962 యుద్ధం తర్వాత వాస్తవాధీన రేఖ అనే కొత్త సరిహద్దు కూడ వచ్చి చేరింది. గత నాలుగు దశాబ్దాలలో ఈ రేఖలగురించి ఎన్నోసార్లు చర్చలు జరిగి అసంపూర్తిగా ఉండిపోయాయి. నిజానికి 1947కు ముందు ఇవాళ్టి భారతదేశం గాని, పాకిస్తాన్ గాని లేవు. 1959 తర్వాత టిబెట్ లేదు. 1971కి ముందు బంగ్లాదేశ్ లేదు. 1975 తర్వాత సిక్కిం లేదు. కనుక ఈ వివాదాస్పద ప్రాంతంలోని దేశాల సరిహద్దుల గురించి చర్చించేటప్పుడు తప్పనిసరిగా వలసవాదుల కుతంత్రాలను అర్థం చేసుకుని, ఆ కుతంత్రాలను తిప్పికొట్టగల సామరస్యపూర్వకమైన, ప్రజానుకూలమైన వైఖరులు తీసుకోవలసి ఉంటుంది. దేశమంటే మట్టికాదోయి, దేశమంటే మనుషులోయ్ అనే వైఖరిని, విభిన్న సమాజాలు ఆదాన ప్రదానాలతో, సహకారంతో, సామరస్యంతో, సమస్యలను దౌత్యపరంగా చర్చలద్వారా పరిష్కరించుకోవాలనే అవగాహనతో సహజీవనం చేయవలసి ఉంటుంది. ఈ అవగాహన కొంతలో కొంతయినా ఉండింది గనుకనే 1950 దశకంలో పంచశీల, స్నేహసంబంధాలు, ఇరుగుపొరుగుదేశాల మైత్రీ ప్రయత్నాలు సాగాయి. కాని దేశాలమధ్య యుద్ధాలుపెట్టి పబ్బం గడుపుకునే సామ్రాజ్యవాద ఆయుధ పరిశ్రమ ఒకవైపు, తమ దేశ ప్రజల మనసులను నిజసమస్యలనుంచి మళ్లించాలనే పాలకుల దురాలోచనలు మరొకవైపు కలిసి అన్నిదేశాలలోనూ, ముఖ్యంగా పాలకులలో యుద్ధానుకూల వాతావరణాన్ని ఏర్పరచాయి. ఈ యుద్ధోన్మాదంలో ఒకదేశపు పాలకులు తక్కువాకాదు, మరొకదేశపు పాలకులు ఎక్కువాకాదు. ఇది అందరికీ తరతమభేదాలతో ఉన్న యుద్ధోన్మాదమే. యుద్ధం వల్ల ఒనగూరగలిగిన స్వప్రయోజనాల గురించిన దురాలోచనే.</p>
<p style="text-align:left;">కాని ప్రభుత్వాలూ, సైన్యాలూ, ప్రతిపక్షాలూ, వ్యాఖ్యాతలూ ఏ అవసరాలకోసం, ఏ ప్రయోజనాలకోసం యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టినా, ప్రజలలో యుద్ధోత్సాహాన్ని కలిగించినా ఇది కేవలం వాళ్లకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రధానంగా ప్రజలకు, ప్రజా జీవితానికి సంబంధించిన విషయం. యుద్ధ సన్నాహాలు ప్రజా సంక్షేమానికి అందవలసిన నిధులను కొల్లగొడతాయి. ఏ సంవత్సరం భారత బడ్జెట్ చూసినా రక్షణవ్యయంలో పెరుగుదల ఒక్కటే మొత్తం దేశానికి విద్యకో, ప్రజారోగ్యానికో పెట్టే ఖర్చుకన్న ఐదారు రెట్లు ఎక్కువ ఉంటున్నది. ఈ రక్షణ వ్యయంలో కొంతభాగం ఆయుధవ్యాపారుల, రాజకీయప్రముఖుల బొక్కసాలలోకి వెళుతోందని ఇటీవలి కుంభకోణాలు చూపుతున్నాయి. యుద్ధం వస్తే అది ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలిగొంటుంది. పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం సాగే యుద్ధంతో ప్రజలకేమీ నిమిత్తం లేదు. నిజంగా ఇరుగుపొరుగు దేశాలతో సమస్యలు ఉన్నా వాటిని సామరస్యంగా, చర్చలతో, దౌత్యపరంగా పరిష్కరించుకోవలసిందేననీ, తమ మీద అనవసరమైన యుద్ధాన్ని రుద్దగూడదనీ ఎలుగెత్తి యుద్ధవ్యతిరేక ఉద్యమం నిర్మించవలసినది ప్రజలే. యుద్ధవ్యతిరేకతే ప్రజాజీవన భవిష్యత్తుకు హామీ.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/225/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/225/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/225/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/225/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/225/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/225/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/225/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/225/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/225/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/225/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=225&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/10/01/yuddhotsaham/feed/</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ఒక రాక్షస రాత్రి</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/08/29/sakshi-article-29082009/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/08/29/sakshi-article-29082009/#comments</comments>
		<pubDate>Sat, 29 Aug 2009 13:19:11 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=213</guid>
		<description><![CDATA[ఆగస్ట్ 29, 2009 సాక్షి దినపత్రికలో వచ్చిన ఫీచర్

       <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=213&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p>ఆగస్ట్ 29, 2009 సాక్షి దినపత్రికలో వచ్చిన ఫీచర్</p>
<p><a href="http://kadalitaraga.files.wordpress.com/2009/08/venu-article-sakshi1.jpg"><img class="alignnone size-medium wp-image-215" title="venu-article-sakshi" src="http://kadalitaraga.files.wordpress.com/2009/08/venu-article-sakshi1.jpg?w=300&#038;h=96" alt="venu-article-sakshi" width="300" height="96" /></a><a href="http://kadalitaraga.files.wordpress.com/2009/08/venu-article-sakshi.jpg"></a></p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/213/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/213/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/213/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/213/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/213/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/213/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/213/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/213/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/213/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/213/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=213&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/08/29/sakshi-article-29082009/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>

		<media:content url="http://kadalitaraga.files.wordpress.com/2009/08/venu-article-sakshi1.jpg?w=300" medium="image">
			<media:title type="html">venu-article-sakshi</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>రాజకీయ చదరంగంలో బలోచీల స్వేచ్ఛాకాంక్ష</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/08/25/balochila_swecchakanksha/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/08/25/balochila_swecchakanksha/#comments</comments>
		<pubDate>Tue, 25 Aug 2009 04:20:26 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Ee Bhoomi]]></category>
		<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=270</guid>
		<description><![CDATA[ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాధినేతలిద్దరు విడుదలచేసిన సంయుక్త ప్రకటనలోని పదహారు పదాల చిన్న వాక్యం ఒకటి వారాల తరబడి చర్చకూ రచ్చకూ పార్లమెంటు సమావేశాల వాయిదాలకూ ఉద్రిక్తతలకూ దారి తీయగలదా? ఆ రెండు దేశాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పుడు అది సాధ్యం కావచ్చు. లేదా ఆ రెండు దేశాల నాయకులూ తమ ప్రజలు నిత్యజీవిత జీవన్మరణ సమస్యలమీద ఆలోచించగూడదని ఉద్దేశ్యపూర్వకంగానే అటువంటి ఉద్రిక్తతను రెచ్చగొట్టినపుడూ ఆలా జరగవచ్చు. చొక్కా మీద పురుగు తిరుగుతోందనో, పక్కన [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=270&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;">ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాధినేతలిద్దరు విడుదలచేసిన సంయుక్త ప్రకటనలోని పదహారు పదాల చిన్న వాక్యం ఒకటి వారాల తరబడి చర్చకూ రచ్చకూ పార్లమెంటు సమావేశాల వాయిదాలకూ ఉద్రిక్తతలకూ దారి తీయగలదా? ఆ రెండు దేశాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పుడు అది సాధ్యం కావచ్చు. లేదా ఆ రెండు దేశాల నాయకులూ తమ ప్రజలు నిత్యజీవిత జీవన్మరణ సమస్యలమీద ఆలోచించగూడదని ఉద్దేశ్యపూర్వకంగానే అటువంటి ఉద్రిక్తతను రెచ్చగొట్టినపుడూ ఆలా జరగవచ్చు. <span id="more-270"></span>చొక్కా మీద పురుగు తిరుగుతోందనో, పక్కన పదిరూపాయలు పడిపోయాయనో దృష్టి మరల్చి లక్షల రూపాయలు కొల్లగొట్టుకుపోయేవారి ఉదంతాలు వింటూనే ఉంటాం. ఇది కూడ అటువంటి సందర్భమే. కాకపోతే అనాలోచితమైనవిగా, అలవోకగా కనిపించే మాటలూ, చేతలూ అతి గంభీరమైన అంతర్జాతీయ సంబంధాలలోకి ఎలా ప్రవేశిస్తున్నాయో తెలియజెప్పే ఉదంతమిది.</p>
<p style="text-align:left;">ఈజిప్ట్ లోని సినా ద్వీపకల్పం దక్షిణ కొసన ఎర్ర సముద్ర తీరాన షర్మ్ అల్ షేక్ అని ఒక నగరం ఉంది. ఆ నగరం మీద ఆధిపత్యం కోసం గత యాభై సంవత్సరాలలో ఇజ్రాయిల్, ఈజిప్ట్ ల మధ్య ఎన్నో యుద్ధాలు, ఘర్షణలు జరిగాయి గాని చివరికి ఇరుదేశాలమధ్య 1979లో కుదిరిన శాంతి ఒప్పందం ఫలితంగా ఆ నగరం ఈజిప్ట్ పాలనలోకి వచ్చింది. అక్కడ జరిగిన అనేక అంతర్జాతీయ శాంతి సమావేశాల వల్ల, ఒప్పందాల వల్ల ఆ నగరానికి శాంతినగరం అనేపేరు స్థిరపడిపోయింది. ప్రస్తుత అశాంతికారక ప్రకటనకు ఆ శాంతి నగరమే వేదిక.</p>
<p style="text-align:left;">ఆ నగరంలో జరిగిన పదిహేనవ అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా భారత ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ కలుసుకున్నారు. చర్చలు జరిపారు. ఆ చర్చల తర్వాత జూలై 16న ఒక సంయుక్త ప్రకటన వెలువరించారు. దేశాధినేతలు సమావేశం కావడం, సంబంధిత రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, దౌత్య వ్యవహారాలపైన సంయుక్త ప్రకటనలు వెలువరించడం కొత్త విషయమేమీ కాదు. భారత పాకిస్తాన్ ప్రధానుల సమావేశం కూడ ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. కాని ఈసారి మాత్రం ఆ సమావేశ సంయుక్త ప్రకటన పెద్ద ఎత్తున సంచలనానికి కారణమయింది. ఐదువారాలు గడిచినా ఆ దుమారం సమసిపోవడంలేదు. ఇరవై వాక్యాల ప్రకటన అది. ఆ ప్రకటనలో అభివృద్ధి గురించీ, పేదరిక నిర్మూలన గురించీ, ద్వైపాక్షిక సంబంధాల గురించీ మామూలు మొక్కుబడి విషయాలు కొన్ని ఉన్నాయిగాని, ప్రధానంగా ఆ ప్రకటన ఇరుదేశాలూ అనుభవిస్తున్న తీవ్రవాద సమస్య మీద దృష్టి కేంద్రీకరించింది. తీవ్రవాద సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలూ ఒకరికొకరు సహాయం చేసుకోవలసిన అవసరం గురించి ప్రకటించింది. ఆ వరుసలోనే ఒక వాక్యంలో ‘బలోచిస్తాన్, తదితర ప్రాంతాలలో సమస్య గురించి పాకిస్తాన్ దగ్గర కొంత సమాచారం ఉన్నదని ప్రధానమంత్రి గిలానీ ప్రస్తావించారు’ అని ఉంది. ఆ వాక్యమే ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నది. బలోచిస్తాన్ లో సమస్యకు ఆజ్యం పోస్తున్నది భారత ప్రభుత్వమేనని పాకిస్తాన్ చాల కాలంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో, సంయుక్త ప్రకటనలో ఈ వాక్యానికి రాగల అర్థం ఒకటే: ‘మీ జోక్యం గురించి మాదగ్గర సమాచారం ఉంది సుమా’ అని.<br />
ఆ సంయుక్త ప్రకటనమీద, అందులో బలూచిస్తాన్ ప్రస్తావన మీద భారత పార్లమెంటులో పెద్ద రగడ జరిగింది. లోకసభలోనూ, రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రకటనద్వారా దేశ ప్రయోజనాలను ప్రభుత్వం బలిపెట్టిందని భారతీయ జనతాపార్టీ విరుచుకుపడింది. ఈ ప్రకటన వల్ల పాకిస్తాన్ ఇన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందనే అనుమానానికి భారత ప్రభుత్వం అవకాశమిచ్చిందనీ, ఈ అవమానం ఏడేడు సముద్రాలతో కడిగినా పోదనీ భాజపా నాయకులు అన్నారు. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులలో సాగుతున్న బలోచీ తీవ్రవాదాన్ని అణచివేసే ప్రయత్నంలో ఉన్న అమెరికాను సంతృప్తి పరచడం కోసమే ఈ సంయుక్త ప్రకటన వెలువడిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆరోపించింది.</p>
<p style="text-align:left;">ప్రతిపక్షాల విమర్శలు ఇలా ఉండగా భారత ప్రభుత్వ అధికారిక స్పందన గందరగోళంగా, సమన్వయంలేకుండా, అస్పష్టంగా సాగింది. ఇతర విషయాలేమీ ఎత్తకుండా, తనకు పాకిస్తాన్ ప్రధాని ఆ సమాచారమేదీ ఇవ్వలేదని మాత్రమే మన్మోహన్ సింగ్ జవాబిచ్చారు. ‘పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలలో మాజోక్యం లేదు. బలోచిస్తాన్ తీవ్రవాదులకు మేం సహాయం అందించడంలేదు’ అని హోం శాఖ మంత్రి చిదంబరం అన్నారు. ఆ సంయుక్త ప్రకటన అంత పవిత్రమైనదేమీ కాదని, దానికి కట్టుబడి ఉండనవసరం లేదని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఆ సంయుక్త ప్రకటన రచన సరిగా లేదని స్వయంగా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ ఒప్పుకున్నారు. మరొకపక్క ‘కాశ్మీర్ లోని తిరుగుబాటు బృందాలకు పాకిస్తాన్ సహాయం అందిస్తున్నప్పుడు మాకు భారత్ ఎందుకు సహాయపడగూడదు” అని బలోచిస్తాన్ జాతి ఉద్యమ నాయకుడు వహీద్ బలోచి అన్నారు.<br />
ఈ భారత – పాకిస్తాన్ వివాదాలు ఎలా ఉన్నా అసలు ప్రస్తావనకు వచ్చిన బలోచిస్తాన్ సమస్య ఏమిటి? ప్రధానంగా బలోచీ భాష మాట్లాడే బలూచ్ జాతి ఇవాళ్టి పాకిస్తాన్, ఇరాన్, అప్ఘనిస్తాన్ సరిహద్దులతో ముక్కలయిన కొండజాతి. అప్ఘనిస్తాన్ తో యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలకులు 1893లో గీసిన దురాండ్ రేఖ ఈ జాతి నివసించే భూభాగాన్ని ముక్కలు చేసి వారిని విడదీసింది. ఆతర్వాత ఒకటి రెండు దశాబ్దాలలోనే బలోచ్ జాతి స్వేచ్ఛాకాంక్ష, జాతీయవాదం మొదలయ్యాయని చరిత్రకారులు గుర్తిస్తున్నారు. భారత స్వాతంత్ర్య ప్రకటన సమయంలో, భారత ఉపఖండంలోని ప్రజలు/సంస్థానాలు అటు పాకిస్తాన్ లో కాని, ఇటు భారతదేశంలో కాని విలీనం కావచ్చునని, లేదా స్వతంత్రంగా ఉండిపోవచ్చునని మౌంట్ బాటన్ ప్రకటించిన త్రిసూత్ర పథకం బలోచ్ జాతీయవాదాన్ని మరొకసారి వేదిక మీదికి తీసుకువచ్చింది. బలోచిస్తాన్ లో భాగమైన కలత్ సంస్థాన పాలకుడు అహ్మద్ యార్ ఖాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. అప్పటికి యథాతథ ఒడంబడిక కుదుర్చుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం 1948 మార్చ్ 27 న కలత్ పై సైనికచర్య జరిపి, ఖాన్ తో విలీన ఒప్పందం పై బలవంతాన సంతకం చేయించుకుంది. విలీనానికి వ్యతిరేకంగా ఖాన్ సోదరుడు అబ్దుల్ కరీం 1948 జూలైలో సాయుధ పోరాటం ప్రారంభించాడు.</p>
<p style="text-align:left;">అప్పటినుంచీ పాకిస్తాన్ పాలనను వ్యతిరేకిస్తూ, స్వాతంత్ర్యం కోసం బలూచ్ జాతి ఎవరో ఒకరి నాయకత్వాన పోరాడుతూనే ఉంది. గత అరవై సంవత్సరాలలో కనీసం నాలుగు సార్లు – 1948, 1958, 1962, 1973-77 – ఆ పోరాటం ఉధృతంగా, హింసాత్మకంగా సాగింది. ఆ చివరిపోరులో భయంకరమైన అణచివేతను చవిచూసిన బలోచ్ జాతి ఉద్యమకారులు, 1980ల తర్వాత పునస్సంఘటితమై బలోచిస్తాన్ విమోచన సైన్యం, బలోచ్ జాతీయ పార్టీ, బలోచిస్తాన్ విద్యార్థి సంఘం నేతృత్వంలో అవిరామంగా పోరాడుతున్నారు. ఈ ఉద్యమం మీద 2005 డిసెంబర్ లో పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విరుచుకుపడి ఆరునెలలలోనే 900 మందిని చంపేశారు, 450 మందిని మాయం చేశారు, నాలుగువేలమందిని అరెస్టు చేశారు. లక్షన్నర మందిని నిరాశ్రయులను చేశారు. అయినా ఆ పోరాటం ఇంకా సాగుతూనే ఉంది.</p>
<p style="text-align:left;">పాకిస్తాన్ లో ఒక రాష్ట్రంగా బలోచిస్తాన్ ఆ దేశ విస్తీర్ణంలో సగభాగాన్ని ఆక్రమించినా, జనాభాలో మాత్రం ఐదు శాతానికే ఆశ్రయమిస్తోంది. అంటే అది పెద్దగా జనావాసానికి అనుకూలమయిన ప్రాంతం కాదు. కాని అక్కడ విస్తృతంగా చమురు, సహజవాయువు, రాగి వంటి సహజ సంపదలు ఉన్నందువల్ల ఆ ప్రాంతాన్ని వదులుకోవడం పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలకు భంగకరం. అది భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్ కు, అప్ఘనిస్తాన్ కు పొరుగున ఉండడం వల్ల పాకిస్తాన్ కు గాని, అమెరికాకు గాని ఆ ప్రాంతం తమ చెప్పుచేతల్లోనే ఉండాలని బలంగా ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ బలోచిస్తాన్ స్వాతంత్ర్యానికి అంగీకరించగూడదని పాకిస్తాన్, అమెరికాలు అనుకుంటున్నాయి. అందువల్లనే బలోచ్ జాతి ఉద్యమకారుల మీద తీవ్రవాదులుగా ముద్రవేసి, నిషేధించి, అమానుషమైన అణచివేత చర్యలు చేపడుతున్నాయి.</p>
<p style="text-align:left;">ఇటువంటి న్యాయమైన ప్రజాఉద్యమాన్ని సమర్థించే నైతిక అర్హత భారత ప్రభుత్వానికి ఉందా అనే ప్రశ్న ఎలా ఉన్నా, శత్రువుకు శత్రువు మిత్రుడు అనే రాజకీయ ఎత్తుగడతో భారత ప్రభుత్వం బలోచ్ ఉద్యమకారులను సమర్థిస్తూనే ఉంది. సిఐఎ, కెజిబి వంటి జోక్యందారీ సంస్థలను అనుకరిస్తూ తయారయిన రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) బలోచిస్తాన్ లో ఐదువేలమంది ఏజెంట్లను ప్రవేశ పెట్టిందని పాకిస్తాన్ చాలకాలంగా ఆరోపిస్తోంది. ఇప్పుడు సంయుక్త ప్రకటన ఆ ఆరోపణను నిర్ధారిస్తుందేమోననే ఆందోళనే తప్ప ప్రస్తుతం జరుగుతున్న గందరగోళంలో బలోచీల స్వాతంత్ర్యాకాంక్ష, వారిమీద జరుగుతున్న దమనకాండ మరుగున పడిపోతున్నాయి.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/270/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=270&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/08/25/balochila_swecchakanksha/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>రాజపక్షె రక్తసిక్త ప్రవచనాలు</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2009/07/28/rajapakshe/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2009/07/28/rajapakshe/#comments</comments>
		<pubDate>Tue, 28 Jul 2009 16:00:45 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[Ee Bhoomi]]></category>
		<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">http://kadalitaraga.wordpress.com/?p=210</guid>
		<description><![CDATA[విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ
ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ
మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ
కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి

అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ కవిత్వం వెలువడి ఏడెనిమిది దశాబ్దాలు దాటినతర్వాత మన కళ్ల ఎదురుగా మరొక హిట్లర్ తిరుగాడుతున్నాడు. పేరుకు శాంతి అహింసల బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే ఈ [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=210&subd=kadalitaraga&ref=&feed=1" />]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p style="text-align:left;padding-left:30px;"><em>విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ<br />
ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ<br />
మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ<br />
కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి</em>
</p>
<p style="text-align:left;">అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ కవిత్వం వెలువడి ఏడెనిమిది దశాబ్దాలు దాటినతర్వాత మన కళ్ల ఎదురుగా మరొక హిట్లర్ తిరుగాడుతున్నాడు. పేరుకు శాంతి అహింసల బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే ఈ ఇరవయొకటో శతాబ్దపు హిట్లర్ రక్తదాహానికి ఇప్పటికి కొన్ని లక్షలమంది శ్రీలంక తమిళులు బలి అయిపోయారు. <span id="more-210"></span>కాని బ్రెహ్ట్ లో కనబడిన ఆగ్రహంలో వందో వంతయినా ఇవాళ మర్యాదస్తులైన బుద్ధిజీవుల ప్రతిస్పందనలో కనబడడం లేదు. పైగా ఈనాటి మేధావులు కొత్త రక్తపిపాసి ముందర వినయంగా చేతులు కట్టుకుని, ఆ నరహంతకుడి “సాహస” గాథలను తన్మయత్వంతో వింటూ ప్రపంచానికి చెప్పడానికి సాహసిస్తున్నారు.</p>
<p style="text-align:left;">నిజానికి హిట్లర్, ముస్సోలినీ, ఫ్రాంకో లకు వ్యతిరేకంగా 1930 లలో ఉవ్వెత్తున లేచిన మేధో స్పందన, ప్రజాప్రతిఘటన వంటివి ఇవాళ మరొకసారి రావలసిన అవసరం ఉంది. శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్షె గంభీరంగా ప్రకటిస్తున్న ప్రవచనాలలో ప్రతి అక్షరంలోనూ చిప్పిల్లుతున్న శ్రీలంక తమిళుల నెత్తురు ఇవాళ బుద్ధిజీవుల ధర్మాగ్రహానికి దారితీయవలసి ఉంది. కాని రాజపక్షె అధికారపక్షమయ్యాడు. అధికారంలో ఉన్నవారే, గెలిచినవారే చరిత్ర రాసుకున్నట్టుగా ఆ అధర్మ యుద్ధవీరుడు చరిత్ర రచిస్తున్నాడు. అహంకారంతో ప్రగల్భాలు పలుకుతున్నాడు. తమిళ జాతిమీద, తమిళజాతి ఆకాంక్షలు నెరవేర్చడానికి వీరోచితపోరాటం చేసిన తమిళ పులుల మీద, వాళ్ల పోరాట రూపాల మీద అసందర్భమైన, అనుచితమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన గురువులు గోబెల్స్ నూ హిట్లర్ నూ ఆవాహన చేసుకుంటూ పచ్చి అబద్ధాలను పరమసత్యాలుగా ప్రకటిస్తున్నాడు. ఆ అబద్ధాలనూ వ్యాఖ్యలనూ బుద్ధిమంతులైన పత్రికాసంపాదకులు ఆణిముత్యాలుగా స్వీకరించి అక్షరం పొల్లుపోకుండా ప్రకటిస్తున్నారు. ఎల్ టి టి ఇ పోరాట పద్ధతులమీద, ప్రభాకరన్ వ్యవహారసరళి మీద ఎవరికయినా ఎన్ని విమర్శలయినా ఉండవచ్చు. కాని శ్రీలంక తమిళుల ఆత్మగౌరవాన్ని బుగ్గిపాలుచేస్తూ, వాళ్ల నేలమీదనే వాళ్లను రెండోస్థాయి పౌరులుగా మారుస్తూ, అమాయక తమిళ ప్రజానీకాన్ని వేలాదిగా మట్టుబెడుతూ రక్తనదిలో స్నానమాడుతున్న నరహంతకుణ్ని కీర్తించేంతగా దిగజారామా మనం? మన మానవత్వం అంతగా కనుమరుగైపోయిందా? ఒకపక్షం మీద మనకు వ్యతిరేకత ఉండవచ్చు గాని ఆ వ్యతిరేకత అవతలిపక్షం దుర్మార్గాలను సమర్థించే దగ్గరికి మనను తీసుకుపోతున్నదా? ఎక్కడినుంచి ఎక్కడికి పోతున్నాం మనం?</p>
<p style="text-align:left;">శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్షె తో ఒక భారత జాతీయ పత్రిక సంపాదక యజమాని సుదీర్ఘ, ఆంతరంగిక, సన్నిహిత సంభాషణ జరిపి, మూడు రోజులపాటు ఆ వికటాట్టహాసాలను ప్రకటించిన తర్వాత కలిగిన ఆగ్రహంతో రాస్తున్నానిది. నిజానికి ఆ పత్రిక తనను తాను జాతీయ దినపత్రిక అని చెప్పుకుంటుంది గాని, తమిళ జాతి దినపత్రిక అని చాలమంది పరిహాసమాడేవాళ్లు. ఇప్పుడది శ్రీలంక తమిళుల ఊచకోతను నిస్సిగ్గుగా సమర్థిస్తూ తాను తమిళుల పత్రికను కూడ కాదని చూపుకుంటున్నది. అదేసమయంలో ఆసేతుహిమాచలం ఎక్కడెక్కడ ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ ఉద్యమాలు సాగినా వ్యతిరేకిస్తూ తానసలు పాలకవర్గాల పత్రికననీ, ప్రజల పత్రికను కాననీ కూడ చెప్పుకుంటున్నది.</p>
<p style="text-align:left;">సరే, న్యాయమైన ఆకాంక్షలతో మూడు దశాబ్దాలపాటు సాగి ఓడిపోయిన ధర్మపక్షం గురించి రాజపక్షం ఏమంటున్నది?</p>
<p style="text-align:left;">శ్రీలంక తమిళజాతి మనసును ఏ సమస్యలు అల్లకల్లోలం చేశాయో, ఆ సమస్యల పరిష్కారానికి దశాబ్దాలపాటు సాగిన తమిళుల శాంతియుత ప్రయత్నాలమీద సింహళ జాత్యహంకారులూ ప్రభుత్వాలూ ఎంత హింసాకాండను అమలు చేశాయో, చిట్టచివరికి తమిళులు సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుని ఎందుకొరకు పోరాడవలసి వచ్చిందో మాట మాత్రం ఎత్తకుండా ఎల్ టి టి ఇ దుర్మార్గాల గురించి రాజపక్షె మాట్లాడుతున్నాడు. కాల్పుల విరమణ ఒప్పందాలను శ్రీలంక ప్రభుత్వాలు ఎలా ఉల్లంఘించాయో వివరించకుండా ఎల్ టి టి ఇ ఉల్లంఘనల గురించి మాత్రం మాట్లాడుతున్నాడు. దశాబ్దాలుగా సింహళీయులు, శ్రీలంక సైనికులు సాగించిన అకృత్యాల ఊసు లేకుండా, టైగర్ల అక్రమాల గురించి మాట్లాడుతున్నాడు. “మా సైనిక బలగాలకు తగిన ఆదేశాలిస్తే, వారు అడిగినవన్నీ ఇస్తే వారు ఎల్ టి టి ఇ ని ఓడించగలరని నాకు నమ్మకమే. ఎందుకంటే ఎల్ టి టి ఇ తనగురించి తాను చేసుకుంటున్న ప్రచారం వాస్తవం కాదు. ఐతే ఒక రకంగా మేం పొరపాటు పడ్డాం. వాళ్ల దగ్గర సంఖ్యా బలం ఉంది. వాళ్ల దగ్గర ఆయుధ సంపత్తి ఉంది. వాళ్లు కేవలం శ్రీలంక మీద మాత్రమే కాదు, దక్షిణ భారతం మీద కూడ దాడి చేసేవారు. వాళ్లు పోగుచేసిన ఆయుధాలు శ్రీలంకకు మాత్రమే సరిపోయేవి కావు” అని పచ్చి అబద్ధాలు చెపుతున్నాడు. టైగర్లు బలవంతాన తమలో చేర్చుకుంటారనే భయంతో, తప్పించుకునే సాకు కోసం ఒక తమిళ బాలిక ఎప్పుడూ గర్భంతో ఉండేదని, అలా పందొమ్మిదేళ్లకే ఏడుగురు బిడ్డల తల్లి అయిందని ఒక కట్టుకథ చెప్పాడు.</p>
<p style="text-align:left;">తమ సేనలు ఎల్ టి టి ఇ బలగాలను ఒక మూలకు ఎలా నెట్టాయో, అక్కడినుంచి వాళ్లు ఓడిపోక తప్పని స్థితి ఎలావచ్చిందో విజయగర్వంతో వివరించాడు. అంతా తాము వేసిన పథకం ప్రకారమే జరిగిందని రక్తపు తేన్పులతో ప్రకటించాడు. అసలు ప్రభాకరన్ ఎందుకు సాంప్రదాయిక స్థిర యుద్ధం చేశాడో తనకు అర్థం కావడం లేదని, తానే ప్రభాకరన్ నైతే వెంటనే అజ్ఞాతవాసానికి వెళ్లి గెరిల్లాయుద్ధం సాగించి ఉండేవాడినని ప్రగల్భాలు పలికాడు.</p>
<p style="text-align:left;">శరణార్థి శిబిరాలు స్వర్గతుల్యంగా ఉన్నాయని నమ్మబలికాడు. కాని ఇప్పటికి ఏర్పాటు చేసిన 40 శరణార్థి శిబిరాలలో ఉన్నవారికి ఎటువంటి కనీస సౌకర్యాలు అందడంలేదని పరిశీలకులు రాస్తున్నారు. చుట్టూ ముళ్ల కంచెలతో నిర్మాణమైన ఈ శిబిరాలు నాజీల నిర్బంధ శిబిరాలతో సమానంగా ఉన్నాయని అంటున్నారు. ఈ శిబిరాలలో ఉన్నవారిని నిశితంగా పరిశీలించినతర్వాతనే పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం అంటున్నది గాని ఈ పరిశీలన అంటే ప్రతి ఒక్కరినీ వారి ఎల్ టి టి ఇ సంబంధాల గురించి పరీక్షించడమే. ఈలం పాలనలో తమిళులలో ప్రతిఒక్కరికీ ఎల్ టి టి ఇ తో ఏదో ఒక రకమైన సంబంధం ఉన్నది కనుక వారిని ఏరి చంపివేస్తున్నారు. ఎల్ టి టి ఇ సైనికులుగా గుర్తించబడినవారిని యుద్ధఖైదీలుగా పరిగణించాలనీ, అంతర్జాతీయ పర్యవేక్షకుల సమక్షంలోనే వారిని విచారించాలనీ అంతర్జాతీయ సంస్థలు అడుగుతున్నప్పటికీ రాజపక్షె ఆ అభ్యర్థనలను ఖాతరు చేయడంలేదు.</p>
<p style="text-align:left;">గడిచిన ఆరునెలలలో ముప్పైవేలమంది తమిళులను శ్రీలంక సైనికులు చంపివేశారని ఒక అంచనా. ఒక్క మే 17ననే పదివేలమంది తమిళుల ఊచకోత జరిగిందని తమిళులపట్ల సానుభూతి ఉన్న సింహళ వామపక్ష మేధావి బ్రియాన్ సెనెవిరత్నె రాస్తున్నారు. గత సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సిబ్బందితో సహా పరిశీలకులందరినీ శ్రీలంక ఉత్తర ప్రాంతం నుంచి బైటికి పంపించివేసి, సాక్షులెవరూ లేకుండా చేసిన తర్వాత ఈ జాతి హననకాండ పెద్ద ఎత్తున సాగుతోందని సెనెవిరత్నె అంటున్నారు. వందలాదిమంది తమిళ స్త్రీలపైన, బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయని, బలవంతపు గర్భస్రావాలు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, స్వతంత్ర పరిశీలకులు లేనందువల్ల ఈ ఆరోపణల నిజానిజాలు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందని సెనెవిరత్నె రాశారు.</p>
<p style="text-align:left;">ఇక దేశంలో తమిళ అనుకూల పత్రికా రంగం అలా ఉంచి, స్వతంత్ర పత్రికా రంగాన్ని కూడ రాజపక్షె బతికి బట్టకట్టనివ్వలేదు. ఎందరో పాత్రికేయులు హత్యకు గురయ్యారు. నంబర్ లేని తెల్ల వాహనాలు వచ్చి ఎత్తుకుపోయిన పాత్రికేయులు మాయమయిపోయారు. వందలాది మంది పాత్రికేయులమీద హత్యాప్రయత్నాలు, బెదిరింపులు జరిగాయి. భావప్రకటనాస్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యాల స్థితి గురించి అంతర్జాతీయ సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ 173 దేశాల జాబితా తయారుచేస్తే, శ్రీలంక 165 వ స్థానంలో ఉంది.</p>
<p style="text-align:left;">శ్రీలంకలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన గురించి ఇటీవల బ్రిటిష్ ప్రభుత్వం కూడ ఆందోళన వ్యక్తం చేసింది. పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం శ్రీలంకలో సాగించిన అకృత్యాలను గుర్తుచేస్తూ ‘మీరా మాకు చెప్పేది’ అని ప్రశ్నించాడు రాజపక్షె.</p>
<p style="text-align:left;">ఔను, శతాబ్దాలపాటు అటువంటి దుర్మార్గాలే చేసిన వలసవాదులకు అలా ప్రశ్నించే హక్కులేకపోవచ్చు. కాని ప్రజలకు ఆ హక్కు తప్పకుండా ఉంది. అందుకే సెల్వరాస పద్మనాథన్ అధినేతగా పునర్నిర్మాణమైన ఎల్ టి టి ఇ ‘తమ న్యాయమైన హక్కులకోసం లేచి నిలిచి పోరాడడం తమిళుల చారిత్రక కర్తవ్యం’ అని ప్రకటించింది. జరిగిన అపారమైన, సవరించలేని నష్టాలను దృష్టిలో ఉంచుకుని తమ పోరాట రూపాలను, వ్యూహాలను పరిస్థితికి తగినట్టుగా మార్చుకుంటామని ప్రకటించింది. తాత్కాలికంగా అధర్మ రాజపక్షాలు ఊచకోతలూ సాగించవచ్చు, సమర్థనలూ చెప్పుకోవచ్చు. కాని అంతిమంగా బుద్ధుడే చెప్పినటు ధమ్మం శరణం గచ్ఛామి.</p>
  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/210/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/210/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/210/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/210/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/210/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/210/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/210/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/210/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/210/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/210/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&blog=795645&post=210&subd=kadalitaraga&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2009/07/28/rajapakshe/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
	</channel>
</rss>