<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	xmlns:georss="http://www.georss.org/georss" xmlns:geo="http://www.w3.org/2003/01/geo/wgs84_pos#" xmlns:media="http://search.yahoo.com/mrss/"
	>

<channel>
	<title>KadaliTaraga : a wave in the Ocean !</title>
	<atom:link href="http://kadalitaraga.wordpress.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://kadalitaraga.wordpress.com</link>
	<description>I may disapprove of what you say, but I will defend to the death your right to say it - Voltaire</description>
	<lastBuildDate>Wed, 04 Jan 2012 05:14:53 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.com/</generator>
<cloud domain='kadalitaraga.wordpress.com' port='80' path='/?rsscloud=notify' registerProcedure='' protocol='http-post' />
<image>
		<url>http://1.gravatar.com/blavatar/7f32a6d7d97ca2fa53b15b15755b6417?s=96&#038;d=http%3A%2F%2Fs2.wp.com%2Fi%2Fbuttonw-com.png</url>
		<title>KadaliTaraga : a wave in the Ocean !</title>
		<link>http://kadalitaraga.wordpress.com</link>
	</image>
	<atom:link rel="search" type="application/opensearchdescription+xml" href="http://kadalitaraga.wordpress.com/osd.xml" title="KadaliTaraga : a wave in the Ocean !" />
	<atom:link rel='hub' href='http://kadalitaraga.wordpress.com/?pushpress=hub'/>
		<item>
		<title>సకల జనుల సమ్మె కర్తవ్యం ప్రతిఘటన</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/08/17/%e0%b0%b8%e0%b0%95%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%aa/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/08/17/%e0%b0%b8%e0%b0%95%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%aa/#comments</comments>
		<pubDate>Wed, 17 Aug 2011 10:21:37 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/08/17/%e0%b0%b8%e0%b0%95%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%aa/</guid>
		<description><![CDATA[తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలకఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ సాగుతున్న వేరువేరు పోరాట రూపాల కొనసాగింపూ, ఉన్నతీకరణా ఈ సకల జనుల సమ్మె. తెలంగాణ ప్రజల పోరాట శీలాన్నీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష బలాన్నీ ప్రదర్శించగల ఉజ్వల ఉద్యమ ఘట్టం ఇది. చరిత్రాత్మక సందర్భం ఇది. గత ఇరవై నెలల పోరాట క్రమంలో వెలికివచ్చిన వివిధ పోరాట రూపాల [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=691&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలకఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ సాగుతున్న వేరువేరు పోరాట రూపాల కొనసాగింపూ, ఉన్నతీకరణా ఈ సకల జనుల సమ్మె. తెలంగాణ ప్రజల పోరాట శీలాన్నీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష బలాన్నీ ప్రదర్శించగల ఉజ్వల ఉద్యమ ఘట్టం ఇది. చరిత్రాత్మక సందర్భం ఇది.</p>
<p><span id="more-691"></span>
</p>
<p>గత ఇరవై నెలల పోరాట క్రమంలో వెలికివచ్చిన వివిధ పోరాట రూపాల గురించీ, వాటి జయాపజయాల గురించీ, అవి సాధించిన, సాధించలేకపోయిన అంశాల గురించీ చర్చించడానికి ఇది ఒక సందర్భం. ఆ సమీక్ష సకల జనుల సమ్మెలో అనుసరించవలసిన మార్గాల గురించి మన అవగాహన మెరుగుపడడానికి వీలు కల్పిస్తుంది. విభిన్న వర్గాల జెఎసిల ఏర్పాటు, విద్యాసంస్థల బంద్, తెలంగాణ వ్యాప్త బంద్, ప్రజాజీవన స్తంభన, విభిన్న ఉద్యోగ, కార్మిక వర్గాల సమ్మెలు, ఉద్యోగుల పెన్ డౌన్, సహాయనిరాకరణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బోర్డుల మార్పు, రాస్తారోకో, ధర్నా, నిరాహారదీక్ష, ఊరేగింపు, సభ, ధూంధాం, ఆటాపాటా, బోనాలు, కళాప్రదర్శనలు, వంటావార్పూ, రహదారుల మీద ఆటలు, బతుకమ్మ, ప్రజాప్రతినిధులను నిలదీయడం, ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం, శవదహనాలు, దిష్టిబొమ్మల దహనాలు, పిండప్రదానాలు, ఆత్మహత్యలు వంటి అనేక నిరసన రూపాలు ఈ ఇరవై నెలల్లో తెలంగాణలో వ్యక్తమయ్యాయి. వాటి మంచి చెడులను చర్చించవచ్చు గాని, మొట్టమొదట గుర్తించవలసిన అంశం ఇవన్నీ తెలంగాణ ప్రజల నిరసన ప్రకటనలు, ఆగ్రహ వ్యక్తీకరణలు, ప్రజా సంఘటితత్వానికీ, సంఘీభావానికీ, ఐక్యతకూ, ఆకాంక్షకూ చిహ్నాలు.</p>
<p>ఐతే ఈ రూపాలన్నీ తెలంగాణ ప్రజల ఐక్యతనూ, ఆకాంక్షనూ ప్రకటించినంత బలంగా తెలంగాణ ప్రత్యర్థుల మీద ప్రభావం వేశాయా ఆలోచించవలసి ఉంది. నిజానికి ఏదయినా ఒక నిరసన రూపం నిరసన తెలుపుతున్న ప్రజల ఐక్యతనూ, ఆకాంక్షనూ ఎంతగా ప్రకటిస్తుందో, ఎవరి మీద ఆ నిరసన వ్యక్తమవుతున్నదో వారి మీద అంతగా ప్రభావం వేయాలి. యథాస్థితి కొనసాగించడం కుదరదనీ, నిరసనకారుల ఆకాంక్షను గుర్తించి పరిస్థితిలో తగిన మార్పులు చేయక తప్పదనీ వారు గుర్తించేలా చేయాలి. తెలంగాణ ప్రజలు గత ఇరవై నెలల్లో ప్రదర్శించిన అన్నిరకాల నిరసన రూపాలూ నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షను తిరుగులేని విధంగా ప్రకటించాయి. కాని ప్రత్యర్థులు, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకుంటున్న పిడికెడు మంది కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులు, వ్యాపారులు, రాజకీయవేత్తలయినా ఇసుమంత కూడ కదిలినట్టు కనబడడం లేదు. పైగా మొత్తం పరిస్థితి 2009 డిసెంబర్ 9 కన్న ముందరి స్థితికి దిగజారినట్టు అనుమానం కలుగుతున్నది. అంటే తెలంగాణ ప్రజలు వేరువేరు స్థాయిల్లో తమ శక్తి కొద్దీ చేసిన త్యాగాలు, నిరసన ప్రకటనలు ఏ ఫలితమూ సాధించలేదా అని నిరాశ తలెత్తుతున్నది.</p>
<p>అందువల్ల ఈ ఇరవై నెలల నిరసన రూపాలను పునస్సమీక్షించవలసి ఉంది. పునస్సమీక్షించడమంటే ఆ రూపాలను తిరస్కరించడం కాదు, గౌరవించకపోవడం కాదు. సగౌరవంగానే వాటిని అంచనా వేసి వాటి సాఫల్య వైఫల్యాలను మదింపు వేయాలి. వాటి ప్రయోజనాన్నీ నష్టాన్నీ బేరీజు వేయాలి. ఉదాహరణకు ఈ ఇరవై నెలల నిరసన రూపాలలో ఆత్మహత్య అనే రూపం ఎంతమాత్రం అంగీకరించడానికి వీలులేనిది. దాదాపు ఏడు వందలమంది యువతీయువకుల విలువైన ప్రాణాలు ఇలా బలి అయిపోయాయి. ఏ తెలంగాణ సాధన తమ జీవిత లక్ష్యమని వారు అనుకున్నారో, ఆ తెలంగాణ సాకారం కాకుండానే వారు మనమధ్య లేకుండా పోయారు. నిస్సహాయతలో, ఇక గత్యంతరంలేని, దిక్కుతోచని పరిస్థితిలో, వ్యక్తిగత స్థాయిలో ఆత్మహత్య జరిగితే అర్థం చేసుకోవచ్చుగాని, సామాజిక స్థాయిలో మాత్రం ఆత్మహత్యకు అర్థం లేదు. ఎందుకంటే సమాజానికి గత్యంతరం లేకపోవడం, దిక్కుతోచకపోవడం ఉండవు. సామాజిక పరిణామాలు ఎంత వైవిధ్యభరితమైనవంటే ఎన్ని దారులు మూసుకుపోయినా మరొక దారి మిగిలే ఉంటుంది. ఎక్కడా ఇక ముగింపు అని చెప్పవలసిన పరిస్థితి రాదు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఇంకా అన్ని దారులూ ప్రయత్నించనే లేదు. అప్పుడే దారులు మూసుకుపోయాయని నిరాశ చెందడం, ఆత్మహత్యకు పూనుకోవడం నిస్సందేహంగా తప్పుడు చర్యే. అలాగే ఈ ఇరవై నెలల పోరాట రూపాలలో పిండ ప్రదానం వంటి బ్రాహ్మణీయ, మూఢనమ్మక చర్యలు, శవదహనం, దిష్టిబొమ్మల దహనం వంటి సాంకేతిక, తంత్రశాస్త్ర, చేతబడి వంటి చర్యలూ వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఆకాంక్ష వంటి ఉదాత్తమైన ఆకాంక్షతో ఇవి సరిపోవు. ఇవి కొనసాగుతున్న పీడక సంస్కృతిలో భాగమే. పీడితులపై కూడ ఉండే పీడక సంస్కృతి ప్రభావంలో భాగమే. ఇవేవీ ప్ర్రత్యర్థి మీద నిజంగా ప్రభావం వేసే చర్యలు కావు.</p>
<p>ఇక సరైన పోరాట రూపాలు చేపట్టినప్పుడు కూడ అవి ప్రత్యర్థుల మీద ప్రభావం చూపే పద్ధతిలో, చూపేంత బలంగా జరగలేదు. ‘మీ నిరాహార దీక్షల వల్ల మీ కడుపే మాడుతుంది, మీ రాస్తారోకోల వల్ల మీ ప్రజల ప్రయాణానికే ఇబ్బంది కలుగుతుంది, మీ బంద్ ల వల్ల మీ ప్రజాజీవనమే స్తంభించిపోతుంది. మీ విద్యాసంస్థల బంద్ వల్ల మీ పిల్లల చదువే చెడిపోతుంది’ అని ప్రత్యర్థులు పరిహాసమాడే స్థితి వచ్చింది. నిరాహారదీక్ష నైతిక ఒత్తిడి తేగల చర్యే గాని ఇవాళ తెలంగాణ ప్రత్యర్థులు ఎంత నీతి లేని వారంటే నిరాహారదీక్ష వంటి రూపం వారిమీద ఎటువంటి ప్రభావమూ వేయదు. ఇక మిగిలిన రూపాలు ఏకకాలంలో ప్రజాజీవనాన్నీ, ప్రభుత్వపాలననూ స్తంభింపజేసే శక్తి గలవి. కాని ఈ ఇరవై నెలలలో అవి ప్రజా జీవనాన్ని స్తంభించినంతగా, ప్రభుత్వాన్ని, పాలకవర్గాలను కదిలించగలిగాయా ఆలోచించవలసే ఉంది.</p>
<p>ఈ నిరసన రూపాలు ఎంతో గొప్పగా, విస్తృతమైన ప్రజా మద్దతుతో, ప్రజా భాగస్వామ్యంతో జరిగినప్పటికీ, అవి ప్రత్యర్థులమీద ప్రభావం చూపకపోవడానికి ప్రధాన కారణం, అవి నిరసనగా మాత్రమే మిగిలిపోవడం, ప్రతిఘటనగా ఎదగకపోవడం. తమ వనరులను దోచుకోవడం ఆగిపోవాలంటే, తమ నిధులు, నీళ్లు, నియామకాలు తమకే దక్కాలంటే తమ రాష్ట్రం తమకు దక్కాలని నిరసన తెలుపుతున్న ప్రజలు ఆ నిరసన సఫలం కావాలంటే ఆ వనరుల దోపిడీని ఎక్కడికక్కడ ప్రతిఘటించక తప్పదు. నిధుల కేటాయింపులో, నీళ్ల పంపిణీలో, నియామకాలలో సాగుతున్న అన్యాయాలను ఎక్కడికక్కడ ప్రతిఘటించక తప్పదు. ఈ అసమానతకు, దోపిడీకి, వివక్షకు కారణమైన పాలనను ప్రతిఘటించక తప్పదు. కాని దురదృష్టవశాత్తూ ఈ ప్రతిఘటనలేవీ జరగలేదు, ప్రారంభమైనవి కూడ ముందుకు సాగలేదు. </p>
<p>ఇవాళ సకల జనుల సమ్మె ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ప్రతిఘటన. దోపిడీని, పీడనను ప్రతిఘటించడం కేవలం రాజకీయ చర్యో, సామూహిక చర్యో మాత్రమే కాదు. ఏ ఒక్కరో చేసి, ఇతరులు సాక్షులుగా ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ చేయవలసినది, చేయగలిగినది. వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయి వరకు ఎన్ని రూపాలలోనయినా ప్రతిఘటన ఉండవచ్చు.</p>
<p>ఈ ప్రతిఘటన కోస్తా నుంచి, రాయలసీమ నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన సాధారణ ప్రజల మీద కానక్కరలేదు. ప్రజల మధ్య విద్వేషాలూ, ఘర్షణలూ అవసరం లేదు. తెలంగాణ ఫిర్యాదు పాలకులమీద, పాలక విధానాల మీద, తెలంగాణలో పుట్టి కూడ ఆ పాలకులలో భాగమైనవారి మీద మాత్రమే గాని, ఇతర ప్రాంతాల సాధారణ ప్రజల మీద కాదు. నిజం చెప్పాలంటే, తెలంగాణ నేల మీదికి గత ఐదారు వందల సంవత్సరాలలో డజన్ల కొద్దీ జాతులు వలస వచ్చి ఇక్కడి ప్రజలతో శాంతియుత సహజీవనం చేస్తున్నాయి. తెలంగాణలో భాగమయ్యాయి. అలా కాక, ఈ ఆరు దశాబ్దాలలో కోస్తా, రాయలసీమల నుంచి తెలంగాణకు వచ్చిన కొందరు, పొట్టచేతపట్టుకుని వచ్చినప్పటికీ, ఆభిజాత్యంతో, ఇంకా అక్కడివారమనే అహంకారంతో స్థానికులను చిన్నచూపు చూస్తూ, పాలకుల పక్షం చేరిన వారున్నారు. వారిని కూడ ప్రతిఘటించనక్కరలేదు గాని, వారికి నిజాలు చెప్పి దారికి తేవలసి ఉంది.</p>
<p>ఇవాళ జరగవలసిన ముఖ్యమైన ప్రతిఘటన తెలంగాణ ప్రత్యర్థుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలమీద. ఆ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు నెరవేరకుండా ప్రతిఘటించడం ఇవాళ్టి అవసరం. ఈ ఇరవై నెలలలో కూడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించే రాజకీయవాదుల, వ్యాపారుల ప్రయోజనాలు తెలంగాణ గడ్డమీద యథావిధిగా సాగిపోయాయి. తెలంగాణను వ్యతిరేకించే, పైకి సమర్థిస్తున్నట్టు కనబడి లోపల వ్యతిరేకించే, కపటపు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు చీమ తలకాయంత నష్టం కూడ జరగలేదని భావించే పరిస్థితి ఉంది. చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాము వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటించిన పార్టీలు కూడ తెలంగాణ గడ్డమీద సజావుగా తిరుగుతున్నాయి, కార్యక్రమాలు నడుపుతున్నాయి. ఉత్తుత్తి రాజీనామాలు చేసి, ప్రభుత్వంలో కొనసాగుతున్న, తెలంగాణ వ్యతిరేకుల అంటకాగుతున్న నాయకులు తెలంగాణలో మామూలుగా తిరుగుతున్నారు. తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ప్రకటిస్తున్న ఆకాంక్షను వ్యతిరేకిస్తున్న వారి రాజకీయ ప్రయోజనాలు తెలంగాణలో దెబ్బతినక తప్పదని ప్రకటిస్తే తప్ప, వారిని ప్రతిఘటిస్తే తప్ప రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల ద్వంద్వవైఖరికి అడ్డుకట్ట పడదు. అలా రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని అర్థమైనప్పుడు మాత్రమే ఆ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తెలంగాణను వ్యతిరేకించి తమ ఉనికిని కోల్పోవడమా, తెలంగాణ సాధన కృషిలో భాగం కావడమా తేల్చుకోక తప్పని స్థితి వస్తుంది. ఆ స్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపు దారితీస్తుంది.</p>
<p>ఇవాళ రాజకీయాలంటే వ్యాపారమే. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో చేరి తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నదీ ఈ వ్యాపార-రాజకీయ వర్గమే. తెలంగాణను వ్యతిరేకిస్తూనే తెలంగాణలో వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న ఈ వర్గపు ఆర్థిక ప్రయోజనాలను ప్రతిఘటించనంతవరకూ, తెలంగాణ నుంచి వారికి చేకూరుతున్న ఆర్థిక మూలాల మీద అడ్డుకట్ట వేయనంతవరకూ వారు తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఈ డబ్బు సంచులే పట్టుకుని తెలంగాణను వ్యతిరేకించడానికి ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉంటారు. ఇలాంటి వారు డజన్లకొద్దీ ఉన్నారు గాని ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, తెలంగాణకు ప్రథమ శత్రువుగా తనను తాను ప్రకటించుకున్న రాజకీయ వ్యాపారికి చెందిన విద్యుత్ కర్మాగారం సింగరేణి బొగ్గుతోనే నడుస్తున్నది. అది ఈ ఇరవై నెలల్లో ఒక్కరోజు కూడ బొగ్గు కొరతను ఎదుర్కోలేదు. ఈ ఇరవై నెలల్లో కూడ వందలకోట్ల రూపాయల లాభాలు సంపాదించింది. ఇలా తెలంగాణ వ్యతిరేక ఆర్థిక ప్రయోజనాలు సజావుగా సాగిపోతున్నాయి. </p>
<p>కనుక ఈ సకల జనుల సమ్మె సందర్భంగానైనా తెలంగాణ వ్యతిరేకుల, ప్రత్యర్థుల, శత్రువుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ప్రతిఘటిస్తామని శపథం చేయవలసి ఉంది. అరణ్యవాసమూ, అజ్ఞాతవాసమూ అయిపోయి, రాయబారం కూడ విఫలమై, ఇక యుద్ధం తప్పదని తెలిసిన ఈ క్షణాన జమ్మిచెట్టు మీంచి ఆయుధాలు దించక తప్పదు. సకలజనుల సమ్మె ఆ యుద్ధానికి నాంది కావాలి.</p>
<p>n <b>ఎన్ వేణుగోపాల్ </b><b></b></p>
<p>ఆగస్ట్ 13, 2011</p>
<p>(నమస్తే తెలంగాణ లో ప్రచురణ: ఆగస్ట్ 14, 2011) </p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/691/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/691/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/691/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/691/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/691/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/691/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/691/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/691/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/691/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/691/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/691/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/691/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/691/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/691/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=691&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/08/17/%e0%b0%b8%e0%b0%95%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%aa/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ఇరవై ఏళ్ల ప్రపంచీకరణ</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%87%e0%b0%b0%e0%b0%b5%e0%b1%88-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b1%80%e0%b0%95%e0%b0%b0%e0%b0%a3/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%87%e0%b0%b0%e0%b0%b5%e0%b1%88-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b1%80%e0%b0%95%e0%b0%b0%e0%b0%a3/#comments</comments>
		<pubDate>Tue, 16 Aug 2011 11:08:26 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%87%e0%b0%b0%e0%b0%b5%e0%b1%88-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b1%80%e0%b0%95%e0%b0%b0%e0%b0%a3/</guid>
		<description><![CDATA[ఈభూమి ఆగస్ట్ 2011 ఇది ఒక విష విషాద గాథ. ఇది ఈ దేశం మరోసారి మోసపోయిన జాడ. ఇది మన ప్రియ భారత జనయిత్రి మూలుగులు పీల్చడానికి చెప్పన్నారు దేశాల గద్దలూ రాబందులూ గండభేరుండాలూ కలిసి వాలిన బీభత్స గాథ. మన రాజకీయ పక్షాలన్నీ తోడేళ్లలా నక్కల్లా తమ నిజరూపాలు చూపుకుని జనాలను పీక్కు తినడానికి ఆ రాబందుల వెంట సాగిన హీన గాథ ఇది. 1991 జూలైలో (కచ్చితంగా చెప్పాలంటే జూలై 1న) మొదలైన [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=689&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><u>ఈభూమి ఆగస్ట్ 2011 </u></p>
<p><u></u></p>
<p>ఇది ఒక విష విషాద గాథ. ఇది ఈ దేశం మరోసారి మోసపోయిన జాడ. ఇది మన ప్రియ భారత జనయిత్రి మూలుగులు పీల్చడానికి చెప్పన్నారు దేశాల గద్దలూ రాబందులూ గండభేరుండాలూ కలిసి వాలిన బీభత్స గాథ. మన రాజకీయ పక్షాలన్నీ తోడేళ్లలా నక్కల్లా తమ నిజరూపాలు చూపుకుని జనాలను పీక్కు తినడానికి ఆ రాబందుల వెంట సాగిన హీన గాథ ఇది. 1991 జూలైలో (కచ్చితంగా చెప్పాలంటే జూలై 1న) మొదలైన ఈ గాథకు ఈ జూలైకి ఇరవై సంవత్సరాలు నిండాయి. ఈ ఇరవై సంవత్సరాలలో ప్రతి సంవత్సరమూ ప్రతి మాసమూ ప్రతి వారమూ ప్రతి దినమూ ప్రతి గంటా ప్రతి నిమిషమూ భారత ప్రజల సర్వసత్తాక అధికారం అవమానానికి గురయింది. ప్రజా సంక్షేమ చర్యలకూ, రాజ్యాంగబద్ధ పాలనకూ అయితే అధికారగణానికి పనిగంటలూ, సెలవులూ ఉంటాయి గాని ఈ దేశ వ్యతిరేక, ప్రజావ్యతిరేక చర్యలకు మాత్రం మన ప్రభుత్వం ఓవర్ టైమ్ పనిచేసింది. వారానికి ఏడురోజులూ రోజుకు ఇరవైనాలుగు గంటలూ పనిచేసింది. భారత ప్రజల ప్రజాస్వామిక పాలనా యంత్రాంగం దేశదేశాల ధనస్వామ్యానికి దళారీగా మారి బహుళజాతి సంస్థలు విదిల్చిన ఎంగిలి మెతుకులు ఏరుకు తింది. భారత ప్రజల సామ్యవాద ఆదర్శం, రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు తుంగలో తొక్కబడ్డాయి. లడఖ్ నుంచి లక్షద్వీపాల దాకా, కచ్ నుంచి కోహిమా దాకా ఈ దేశం అక్రమ లాభార్జనాపరుల పదఘట్టనల పొక్కిలి నేల అయింది. ఈ కథ అణువణువూ వివరించాలంటే ఈ రెండు లక్షల గంటలలో ప్రతిగంటా ఏ విధానాలు, చర్యలు, కుట్రలు, అమ్మకాలు, కొనుగోళ్లు, కొల్లగొట్టడాలు, దళారీతనాలు, విధ్వంసాలు, అక్రమార్జనలు, ప్రశ్నించిన ప్రజల మీద దమనకాండలు జరిగాయో రెండులక్షల పేజీలు రాసినా సరిపోదు. ఇక్కడ మచ్చుకు ఒక విహంగావలోకనం మాత్రమే. </p>
<p><span id="more-689"></span>
</p>
<p><b>ఎలా మొదలయింది?</b><b></b></p>
<p>లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) అనే అంతర్జాతీయ కార్యక్రమాన్ని నూతన ఆర్థిక విధానాల, ఆర్థిక సంస్కరణల పేరుతో ఈ దేశంలో అమలు చేసే ప్రక్రియను 1991 జూన్ చివరివారంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వివరాలు తెలుసుకునే ముందు అసలు ఆ అంతర్జాతీయ కార్యక్రమపు ఉద్దేశాలేమిటో, అవి ఈ దేశంలోకి ఎందుకు వచ్చాయో, అవి “నూతన” విధానాలు అవునో కాదో, “సంస్కరణలు” అవునో కాదో తెలుసుకోవలసి ఉంది. </p>
<p>రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు వస్తున్నప్పుడే, అప్పటికి రెండు మూడు వందల సంవత్సరాలుగా సాగుతున్న వలస విధానం ఇక కుదరదనీ, కొత్త ఎత్తులు ఎత్తవలసి ఉందనీ, కొత్త రూపాలలో నయావలస విధానాన్ని కొనసాగించాలనీ సామ్రాజ్యవాద దేశాలు ఆలోచించాయి. వలసవాదానికీ, సామ్రాజ్యవాదానికీ మూలం ఆర్థిక ప్రయోజనాలు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల లోని అపారమైన వ్యవసాయ, జల, అటవీ, ఖనిజ, మానవ వనరులను దోచుకోవడానికే వలసవాదం పుట్టుకొచ్చింది. పదిహేడో శతాబ్ది నుంచీ అది వ్యాపార, పారిశ్రామిక, రాజకీయాధికార, పాలనా, సైనిక రూపాలలో ఆ దోపిడీని కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక ఆ రూపాలన్నీ కుదరవనీ, ఆర్థిక, రాజకీయ అధికారాలను మాత్రం ప్రచ్ఛన్నంగానైనా కొనసాగించగలిగితే చాలుననీ పెద్దన్నలు భావించారు. ఆ పనిని సజావుగా అమలు చేయడానికి మేలిముసుగు సంస్థలుగా ప్రపంచబ్యాంకునూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థనూ ఏర్పరచారు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థను ఏర్పరచబోయి అది కుదరక వ్యాపార, సుంకాల సాధారణ ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ అయింది. ఈ దుష్టత్రయం పాత వలస దేశాల ప్రభుత్వాలను సామ్రాజ్యవాద దేశాల, బహుళజాతి సంస్థల చెప్పుచేతల్లో ఉంచడానికి అన్నిరకాల దిగ్బంధనాలు తయారు చేసి పెట్టాయి.</p>
<p>ఆ పని ఒకవైపు జరుగుతుండగానే, కొత్తగా రాజకీయ స్వాతంత్ర్యం, అధికార మార్పిడి పొందిన వలస దేశాలలోని జాతీయోద్యమాలు అప్పటికి శతాబ్దాలుగా తమను దోపిడీ చేస్తున్న సామ్రాజ్యవాదం నుంచి నిజమైన విముక్తి కావాలని, ప్రజలకు కొత్త బతుకు ఇవ్వాలని, అంటే కొత్త అభివృద్ధి నమూనాలను చేపట్టాలని భావించాయి. వ్యాపారం కోసం వచ్చి, దేశాన్నే ఆక్రమించుకున్న సామ్రాజ్యవాద విధానాల మీద అనుమానంతో విదేశీ పెట్టుబడుల మీద, పరిశ్రమల మీద ఆంక్షలు విధించాలనుకున్నాయి. చట్టబద్ధమైన ఆంక్షలు విధించాయి. అలాగే అప్పటికి విజయవంతమైన ప్రజా అభివృద్ధి నమూనాగా సోవియట్ యూనియన్ సోషలిజం ఉండడం వల్ల తమ దేశాలలో కూడ సోషలిస్టు తరహా అభివృద్ధి నమూనాను పాటించాలనుకున్నాయి. లేదా పెట్టుబడిదారీ విధానంలోని మంచినీ, సోషలిజం లోని మంచినీ కలగలిపి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు స్థాపించాలనుకున్నాయి. ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహాలను రచించుకున్నాయి. ఈ కారణాల వల్ల దాదాపు అన్ని వలసానంతర దేశాలలోనూ ఏదో ఒక స్థాయిలో ప్రభుత్వ విధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యంపై, పెట్టుబడులపై ఆంక్షలు, దేశీయ మార్కెట్లను దేశీయ సంస్థలకే పరిరక్షించే రక్షణ చర్యలు, సంక్షేమ రాజ్య భావనలు వచ్చాయి. అయితే వలస వ్యతిరేక జాతీయోద్యమాలలో పాల్గొన్న ప్రజలు ఇలా కోరుకుంటుండగా, ఈ ప్రజా ఆకాంక్షలకు ద్రోహంచేసి, పాత సామ్రాజ్యవాద శక్తులకు దళారీలుగా మారి తమ పబ్బం గడుపుకోవాలని కూడ నాయకులు భావించారు. </p>
<p>మొత్తం మీద అరకొరగానైనా అమలులోకి వచ్చిన ఈ ప్రజానుకూల విధానాలను సామ్రాజ్యవాద దేశాల ప్రభుత్వాలు, వాటిని నడిపించే బహుళజాతిసంస్థలు తీవ్రంగా విమర్శించేవి. ఆ విమర్శలను సిద్ధాంతాలుగా మార్చి దేశంలోని కొందరు మేధావుల చేత కూడ చిలుక పలుకులు పలికించేవి. దేశం నిరంకుశమైన లైసెన్స్ రాజ్ అయిపోయిందని వారు విమర్శించేవారు. అధికార యంత్రాంగానికి విశేష అధికారాలు ఇచ్చారని, దేశపు మార్కెట్ల తలుపులు మూసుకుని కూచున్నారని, దేశ ప్రజలకు తమకు వీలైన వస్తువులు కొనుక్కునే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవని వగైరా విమర్శలు సాగుతుండేవి. ఈ విమర్శకుల లక్షం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక విధానాలను సరళీకరించడం, దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, దేశంలోకి విదేశీ పెట్టుబడులు, విదేశీ సరుకులు వచ్చేలా మార్కెట్లను తెరిచి దేశాన్ని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో సమ్మేళనం చేయడం.</p>
<p>ఈ బహుళజాతి సంస్థల కోరికలనే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలుగా చెప్పవచ్చు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) 1973లో చమురు ధరలు పెంచడంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్న సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి సంస్థలు ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వాటినే 1979 నాటికి ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు షరతులుగా మార్చి వ్యవస్థాత్మక సర్దుబాట్ల రుణం అనే పద్ధతి మొదలుపెట్టాయి. మరొక దశాబ్దం గడిచేసరికి అప్పటివరకూ ప్రత్యర్థిగా కనబడిన సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు కుప్పకూలిపోవడంతో, చైనా దిక్కు మార్చడంతో, ప్రపంచమంతా పెట్టుబడిదారీ మార్కెట్ గా మారి ఈ విధానాలు మరింత ముందుకు సాగాయి. భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలు కావడానికి అంతర్జాతీయ నేపథ్యం ఇది. </p>
<p><b>దేశంలో ఏం జరిగింది?</b><b></b></p>
<p>ఈ విధానాలు నూతన ఆర్థిక విధానాల పేరుతో, సంస్కరణల పేరుతో అమలు లోకి వచ్చాయి గనుక వీటిలో నూతనత్వం ఏమిటో, సంస్కరణలు ఏమిటో కూడ పరిశీలించాలి. నిజానికి ఇవి నూతనమైనవీ కావు, పాత దాన్ని మేలు దిశగా మలిచే అర్థంలో సంస్కరణలూ కావు. అసలు ఈ విధానాలు 1947 కు ముందు నుంచీ ఉన్నవే. ఆగస్ట్ 15న అధికార మార్పిడి జరిగి రాణి, వైస్ రాయ్, గవర్నర్ జనరల్ ల పాలన తొలగినప్పటికీ పాలక విధానాలలో, పాలనా వ్యవస్థలో ఏ మార్పులూ జరగలేదు. స్వతంత్ర భారత ప్రభుత్వం బ్రిటిష్ సామ్రాజ్య ఛత్రఛాయలో, కామన్ వెల్త్ లో సభ్య దేశంగానే కొనసాగింది. కొత్త సామ్రాజ్యవాదిగా అవతరిస్తున్న అమెరికా నుంచి పెట్టుబడులనూ, సహాయాన్నీ స్వీకరించింది. 1949లోనే ప్రపంచబ్యాంకు దగ్గరికి అప్పుకోసం వెళ్లి అది చెప్పిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం మొదలుపెట్టింది. అదనంగా సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల సహాయం కూడ ఉండడంతో భారత పాలకవర్గాలకు బేరాసారాలు ఆడడానికి కాస్త వెసులుబాటు మాత్రం ఉండింది. అయితే ఆ వెసులుబాటును ప్రజాప్రయోజనాలకోసం వినియోగించిన సందర్భాలు చాల తక్కువ. </p>
<p>ఈ అగ్రరాజ్య, సామ్రాజ్యవాద అనుకూల విధానాలలో భాగమే 1960లలో పి ఎల్ 480 కింద అమెరికా సహాయం, హరిత విప్లవం పేరుతో భారత వ్యవసాయంలో అంతర్జాతీయ వ్యవసాయ బహుళజాతి సంస్థలకు మార్కెట్ కల్పించడం, 1969 ఇండో – సోవియట్ సైనిక సహకార ఒప్పందం, డీగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరం వగైరాలు. 1981 ఐఎంఎఫ్ అప్పుతో ఈ బంధం మరింత ముడిపడింది. 1985లో రాజీవ్ గాంధీ అధికారంలోకి రాగానే దిగుమతి సరళీకరణ విధానాలు ప్రకటించి అప్పటిదాకా నామమాత్రంగానైనా సాగుతుండిన దిగుమతి ప్రత్యామ్నాయ విధానాన్ని రద్దు చేశారు. ఇలా దిగుమతులు విపరీతంగా పెరిగిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు సంవత్సరాలు తిరగకుండానే చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. భారత ప్రభుత్వం దగ్గర ఒక వారం దిగుమతులకు చెల్లించవలసిన విదేశీ మారకద్రవ్య నిలువలు కూడ లేని స్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే సోవియట్ యూనియన్ కూలిపోవడంతో భారత్ ను కష్టకాలంలో ఆదుకునే మరొక ద్రవ్య వ్యవస్థ లేకుండా పోయింది. రెండు సంవత్సరాలలో మూడు ప్రభుత్వాలు మారిపోవడం వంటి రాజకీయ పరిణామాలు కూడ జరిగాయి. ఈ దశలోనే చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న ప్రభుత్వం ఒకవైపు ఐఎంఎఫ్ నుంచి అప్పు తీసుకోవాలని, మరొకవైపు రిజర్వ్ బ్యాంక్ లో నిలువ ఉన్న 20 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు తాకట్టుపెట్టి విదేశీ మారక ద్రవ్యం సంపాదించాలని నిర్ణయించింది. ఇటువంటి క్లిష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల ప్రచారం మధ్యలోనే రాజీవ్ గాంధీ హత్య జరిగింది. </p>
<p>ఇన్ని సంక్షోభాల మధ్య మైనారిటీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం స్థాపించడానికి అవసరమైన 272 స్థానాలు ఏ పార్టీకీ, కూటమికీ రాకపోవడంతో 244 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. పి వి నరసింహారావు ప్రధానమంత్రిగా, డా. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పి. చిదంబరం వాణిజ్య మంత్రిగా అధికారంలోకి వచ్చిన ఈ మైనారిటీ ప్రభుత్వం నిండా ఐదు సంవత్సరాలు సజావుగా మనగలగడం మాత్రమే కాదు, దేశ రాజకీయార్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చింది. 1980లకు ముందు జీవితంతో పోల్చి చూసేవారికి లోకం మారిపోయిందన్న ఆభాసను కల్పించింది. ఆ తర్వాతి తరానికి ఈ రంగుల ప్రపంచమే నిజమనిపించేట్టు చేసింది. </p>
<p>1991 జూన్ 21న కాంగ్రెస్ నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వాధినేతగా పి వి నరసింహారావు అధికారం స్వీకరించారు. ఆ మర్నాడు ప్రధాని తన ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ పేరు ప్రకటించారు. అప్పటివరకూ ఎన్నడూ రాజకీయాలతో సంబంధంలేని అర్థశాస్త్రవేత్త, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డైరెక్టర్ గా, సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్ గా, కొద్దికాలంపాటు ప్రధాని చంద్రశేఖర్ కు ఆర్థిక సలహాదారుగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఈ పదవిలోకి రావడం, ఆ పదవి ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలకడం యాదృచ్ఛికం కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో తాము తేదలచుకున్న మార్పులు ఆర్థికమంత్రిగా తమకు అనుకూలుడు ఉంటేనే సాధ్యమని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు, బహుళజాతి సంస్థలు భావించాయి. రాజకీయవేత్త అయితే ఎంత కాదనుకున్నా వోట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్లవలసి ఉంటుంది గనుక, ప్రజల మాట వినకతప్పదు గనుక ప్రజల మాట వినే అవసరమూ, అవకాశమూ లేని వ్యక్తే ఆ పదవిలో ఉండాలని అనుకున్నాయి. న్యాయాన్యాయాలు, దేశ ప్రజా సంక్షేమం అనే విలువల కన్న సామర్థ్యం, నైపుణ్యం అనే మోసకారి విలువలే రాజ్యం చేసే పరిస్థితికి నాందిగా “సమర్థుడయిన ఆర్థిక నిపుణుడు” పేరుతో డా. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా మార్చాయి. </p>
<p><b>తొలి నెల రోజులు</b></p>
<p>జూన్ 24 నుంచే తాను తేదలచుకున్న మార్పులేమిటో ప్రధానమంత్రికన్న ఎక్కువగా ఆర్థికమంత్రి ప్రకటించడం ప్రారంభించారు. జూన్ 27న అఖిలపక్ష సమావేశం జరిపి కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభ స్థితిలో ఐఎంఎఫ్ అప్పు తప్ప గత్యంతరం లేదని అన్ని పార్టీల ఆమోదం సంపాదించారు. అప్పు ఇవ్వడానికి ఐఎంఎఫ్ విధిస్తున్న షరతులేమిటో చెప్పాలని కొన్ని రాజకీయపక్షాలు అడిగినప్పటికీ ఆర్థికమంత్రి జవాబు దాటవేశారు. అది మైనారిటీ ప్రభుత్వం గనుక ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడితే జవాబు చెప్పక తప్పేది కాదు. కాని సిపిఐ, సిపిఎంలతో సహా ప్రతిపక్షాలేవీ ఆ ప్రశ్న మీద పట్టు పట్టలేదు.</p>
<p>ఇక ఈ అఖిల పక్ష సమావేశపు ఆమోదం చేతిలో పట్టుకుని జూలై నెల అంతా ప్రభుత్వం వీరంగమాడింది. జూలై 1న రూపాయి మారకపు విలువ 9 శాతం తగ్గించారు. నూతన పారిశ్రామిక విధానం తయారు చేస్తున్నామని, విదేశీ పెట్టుబడిమీద, గుత్తాధిపత్యం మీద ఉన్న ఆంక్షలు తొలగిస్తామని ప్రకటించారు. జూలై 3న రూపాయి విలువను మళ్లీ 12 శాతం తగ్గించారు. జూలై 4న రూపాయి మారకపు విలువ మరొక శాతం తగ్గించారు. విదేశీ వాణిజ్యం మీద ఆంక్షలు ఎత్తివేశారు. జూలై 7న వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ పేరిట పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు రాయితీలు, మినహాయింపులు ప్రకటించింది. జూలై 8న రిజర్వ్ బ్యాంక్ మరొక 20 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు తరలించింది. జూలై 11న మరొక పది టన్నుల బంగారాన్ని తరలించారు. నూతన ఆర్థిక విధానాల తర్వాత తొలి రైల్వే బడ్జెట్ లో జూలై 16న ఛార్జీలను, రవాణా ఛార్జీలను విపరీతంగా పెంచారు. జూలై 18న మళ్లీ 12 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు తరలించారు. </p>
<p>ఈ వరుస ఇలాగే సాగి జూలై 24న డా. మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ దేశదేశాల పెట్టుబడిదారులకు అనేక వరాలు ప్రకటించింది. భారత దేశపు వనరులను కొల్లగొట్టుకు పోవడానికి అన్ని మార్గాలు తెరిచి ఉంచామని హామీ ఇచ్చింది. భారత మార్కెట్లలోకి అవసరమైనవీ, అనవసరమైనవీ ఎన్నెన్ని సరుకులూ సేవలూ దించినా, దేశీయ ఉత్పత్తిదార్లు చితికిపోయేలా చేసినా తాము కల్పించుకోబోమని వాగ్దానం చేసింది. అప్పటివరకూ దేశ ప్రజలను, వనరులను, మార్కెట్లను, దేశీయ చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలను రక్షించడానికి ఉన్న చట్టాలను రద్దు చేస్తామని, మారుస్తామని, విదేశీ వ్యాపారులకు వీలు కల్పించే కొత్త చట్తాలను తెస్తామని వాగ్దానాలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, వాటాలు అమ్మివేసి, ప్రైవేటీకరించి, సిబ్బందిని తగ్గించి, విదేశీ పరిశ్రమలకు పోటీ కాకుండా చూస్తామని, దేశీయ ద్రవ్య సంస్థలు దేశీయ పారిశ్రామిక సంస్థలకు సహాయ పడకుండా చూసేందుకు ద్రవ్య రంగ సంస్కరణలు తెచ్చి వాటిని నిర్వీర్యం చేస్తామని ప్రకటించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఈ దేశం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి’ అని బహుళజాతి సంస్థలకు, సామ్రాజ్యవాద దేశాలకు, దేశదేశాల సంపన్నులకు భారత ప్రభుత్వం మంగళ హారతులు పాడింది. </p>
<p><b>తర్వాతి రెండు దశాబ్దాలు</b></p>
<p>ఈ ఆర్థిక విధానాలకు దేశంలోని అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఉంది. ఇంతకు ముందే చెప్పినట్టు 1991 జూన్ 27న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు పాల్గొన్నాయి. దేశ ఆర్థికస్థితి క్లిష్టంగా ఉన్నదని, నడుము కట్టుకుని బాగుచెయ్యాలని ప్రధాని, ఆర్థిక మంత్రి ఇచ్చిన పిలుపును ఆమోదించాయి. నాయకులు నడుం కట్టుకున్నారో లేదో తెలియదు గాని ప్రజలు కడుపు కట్టుకుని, ఒక్క పూట తిండి కూడ వదులుకుని, ఉద్యోగాలు, ఉపాధులు, భూములు, జీవితాలు పోయినా నోరు మూసుకుని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలని అన్ని రాజకీయ పక్షాలూ ఆమోదించాయి. ఆ రాజకీయ పక్షాల మధ్య ఎన్ని విభేదాలున్నా ఈ సర్వజనామోదం ఇవాళ్టి దాకా అప్రతిహతంగా కొనసాగుతోంది. </p>
<p>అందుకే ఆ తర్వాత ఐదు సంవత్సరాలకే కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి 13 రోజులు పాలించినా, ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కూటమి వచ్చి, దానిలో ఇద్దరు ప్రధాన మంత్రులు మారి పాలించినా, తర్వాత మళ్లీ భాజపా నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం మొదట 13 నెలలు, తర్వాత ఐదు సంవత్సరాలు పాలించినా, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా పాలిస్తున్నా, ఈ ప్రభుత్వాలకూ, కూటములకూ లోపలి నుంచీ బయటి నుంచీ అన్ని పార్టీల మద్దతు ఉంది. ఇన్ని కప్పల తక్కెడ పాలనలలో కూడ ఈ నూతన ఆర్థిక విధానాల కార్యక్రమం యథావిధిగా, ఏ చిన్న మార్పూ లేకుండా సాగిపోతున్నది. ఒకరినొకరు అతి తీవ్రంగా విమర్శించుకునే ఈ పక్షాలన్నీ నూతన ఆర్థిక విధానాల విషయంలో మాత్రం ఒకరి అడుగులలో మరొకరు అడుగులువేసి నడుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడో, ప్రజల సమక్షంలో ఉన్నప్పుడో ఈ విధానాలను విమర్శించినవారే, అధికార పక్షంలోకి రాగానే ఆ విధానాలను అమలు చేస్తున్నారు.</p>
<p>అంతకన్న విచిత్రంగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేపడుతున్నపార్టీలు, తమను తాము వామపక్షాలమని పిలుచుకునే పార్టీలు, నూతన ఆర్థిక విధానాలకు తాము వ్యతిరేకమని ప్రచారం చేసుకునే పార్టీలు కూడ ఇవే ఆర్థిక విధానాలను తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి నిర్ణయాధికారం ఉండగా, కనీసం ఆ అంశాలలోనైనా నూతన ఆర్థిక విధానాలను అనుసరించబోమని ప్రకటించడం లేదు, అనుసరించకుండా ఉండడం లేదు. </p>
<p><b>ఫలితాలేమిటి? </b><b></b></p>
<p>నూతన ఆర్థిక విధానాలలో ప్రభుత్వ వ్యయం తగ్గించాలనే ద్రవ్య విధానం ఉండడం వల్ల ప్రభుత్వాలు అనవసర వ్యయాలను, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న రక్షణ వ్యయాన్ని తగ్గించలేదు గాని సంక్షేమ రంగాలకు, వ్యవసాయ రంగానికి కేటాయింపులను నానాటికీ తగ్గిస్తూ వచ్చింది. అందువల్ల వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయి కొత్త నీటి పారుదల సౌకర్యాల కల్పన, పాత నీటి పారుదల సౌకర్యాల నిర్వహణ, వ్యవసాయ పరిశోధన, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ రుణాలు, పరపతి సౌకర్యాలు, మార్కెట్లలో రైతాంగానికి రక్షణ చర్యలు వంటి ఎన్నో వ్యవసాయ రంగ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. అంతేగాక ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగాన్ని విదేశీ పారిశ్రామిక అవసరాలకు కట్టివేయడంతో, దేశంలోకి విరివిగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతించడంతో వ్యవసాయ రంగం చితికిపోయింది. వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణం ఈ విధానాలే. </p>
<p>ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే, 1947 నుంచీ కొనసాగుతున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ధ్వంసం చేయడం, ప్రభుత్వ రంగానికి గతంలో ఇచ్చిన రిజర్వేషన్లను, రాయితీలను తొలగించడం, చాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించడం, ప్రైవేటు రంగంలో మితిమీరిన పోటీకి వీలు కలిగించి, విదేశీ బడా పారిశ్రామిక కంపెనీలను అనుమతించి స్థానిక, దేశీయ పరిశ్రమలు చితికిపోయేలా చేయడం, లక్షలాది మంది కార్మికులను, సిబ్బందిని వీథులపాలు చేయడం, విదేశీ, స్వదేశీ బడా పరిశ్రమల గుత్తాధిపత్యం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినా నియంత్రణ చర్యలేవీ చేపట్టక పోవడం నూతన ఆర్థిక విధానాల ఫలితాలే.</p>
<p>ఇలా స్థిరమైన, నికరమైన, భౌతికమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ఒకవేపు ధ్వంసం చేస్తూ, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పునాది సరిగ్గా లేకుండా ఉపరితలంలో నిర్మించిన ఈ పేకమేడలు మధ్యతరగతిని అబ్బురపరుస్తున్నాయి గాని నిజంగా ఈ మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులు లుకలుకలాడుతూ కనిపిస్తాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో నిజమైన ప్రగతి లేకుండా సేవారంగం అభివృద్ధి చెందిందంటే అది స్థానికమైన, సుస్థిరమైన అభివృద్ధి కాదన్నమాట. అది కేవలం విదేశీ, బహుళజాతి సేవా సంస్థల శాఖోపశాఖల విస్తరణేనన్న మాట. కనీసం విదేశీ పరిశ్రమలయితే ఇక్కడ కార్ఖానాలు పెట్టి, ఇక్కడ ఉత్పత్తి చేసి, ఇక్కడినుంచి రవాణా చేసి, భౌతికంగా ఇక్కడ కాలు నిలుపుతారనే నమ్మకమైనా ఉంటుంది. కాని అటువంటి భౌతిక పెట్టుబడి, వ్యవస్థల అవసరం లేకుండానే కేవలం ఎలక్ట్రానిక్ యంత్రాల మీద, నామమాత్రపు సిబ్బంది మీద ఆధారపడి నడిచే ద్రవ్య, బీమా, టెలికాం, ఐటి వంటి సేవారంగ సంస్థలు కాలు నిలవని, అస్థిర పెట్టుబడికి చిహ్నాలు. అవి ఎక్కడ లాభాలు ఎక్కువ ఉంటే అక్కడికి క్షణాల మీద తరలిపోతాయి. వాటి విస్తరణ వాపే తప్ప బలం కాదు.</p>
<p>ఒకవైపు అటువంటి విదేశీ సేవారంగ సంస్థలమీద ఆధారపడుతూ, ప్రజా జీవనానికి అత్యవసరమైన విద్యా, వైద్య, విహార, వినోద, ద్రవ్య, బీమా వంటి రంగాలలోని స్థానిక, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం పనిగట్టుకుని ధ్వంసం చేసింది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం అనే పేరుతో ఈ పనులన్నిటినీ ప్రైవేట్ రంగానికి అప్పగించి, వాటి పనిని సులభతరం చేసే వ్యవస్థగా మాత్రమే ప్రభుత్వం మిగలాలనే కుహనా ఆర్థిక, దోపిడీ సిద్ధాంతాలను అడ్డం పెట్టుకుని ఈ రంగాలనుంచి తన పెట్టుబడిని ఉపసంహరించుకుంది.</p>
<p>ఇక ద్రవ్య రంగంలో 1990ల మొదట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ నరసింహం నాయకత్వంలో సంస్కరణల సిఫారసుల కమిటీలు వేసి, భారత ప్రజలు మిగులు నిధులు ఆదా చేసుకునే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలను విదేశీ కంపెనీలకు అప్పగించడానికి, తద్వారా వారికి వేలకోట్ల రూపాయల నిధులను అప్పనంగా అప్పగించడానికి పథకాలు రచించింది. అలాగే 1950ల ఇన్సూరెన్స్ జాతీయకరణ వల్ల, 1969 బ్యాంకింగ్ జాతీయకరణ వల్ల ఆ నిధులలో కొంత శాతం ప్రాధాన్యతా రంగాలకు, వ్యవసాయానికి, చిన్న తరహా పరిశ్రమలకు అందాలనే రక్షణ, సంక్షేమ విధానాలను రద్దు చేసింది. </p>
<p>అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలో పిడికెడు మంది సంపన్నుల విలాస అవసరాలు తీర్చే దిగుమతులు పెరిగిపోయాయి. లేదా రక్షణ అవసరాల పేరిట వేల కోట్ల రూపాయలను అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులకు అప్పగించడం మొదలయింది. అతి విలువైన విదేశీ మారక ద్రవ్యం ఇలా వ్యర్థం కావడం, ప్రజలకు అత్యవసరమైన సరుకుల దిగుమతి ప్రాధాన్యత తగ్గిపోవడం జరిగాయి. డంకెల్ డ్రాఫ్ట్ మీద చర్చల దగ్గరి నుంచి మొదలై ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు వరకూ జరిగిన పరిణామాలలో మనకు అవసరమైనా, లేకపోయినా, మనం తక్కువ ధరకే ఉత్పత్తి చేయగలిగినా, పండించగలిగినా, విదేశీ బహుళజాతి సంస్థలు మనమీద రుద్దే అన్ని సరుకులనూ, వ్యవసాయోత్పత్తులనూ కూడ మనం దిగుమతి చేసుకోవలసిన దుస్థితికి నెట్టబడ్డాం.</p>
<p>నూతన ఆర్థిక విధానాలు మన దేశ రాజకీయాల మీద చూపిన ప్రభావం చెప్పాలంటే ఈ ఇరవై సంవత్సరాల పాలనలో పేర్లు, జెండాలు, నినాదాలు మారినా విధానాలు మారకపోవడాన్ని చూపాలి. అంటే నూతన ఆర్థిక విధానాలు ఈ దేశ పాలకులందరూ ప్రజా వ్యతిరేకులేనని, బహుళజాతి సంస్థల బిచ్చాలకు ఆశపడేవారేనని చూపాయి. బయటపడుతున్న మన రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలు ఇందుకు రుజువు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో సంబంధం వల్ల మన ఆర్థిక వ్యవస్థలోకి విపరీతంగా డబ్బు ప్రవహించి మన రాజకీయాలు పూర్తిగా డబ్బుమయం, అవినీతిమయం అయిపోయాయి. అంతకు ముందు కూడ దోపిడీ రాజకీయాలు ఉన్నప్పటికీ, ఎంతో కొంత ఆదర్శవాదం, ప్రజలపట్ల జవాబుదారీతనం, వోటర్లకు భయపడడం ఉండేవి. కాని నూతన ఆర్థిక విధానాల తర్వాత ప్రతి అంశమూ డబ్బుతోనే, అమ్మకం-కొనుగోలు లెక్కలలోనే చూసే తత్వం, జవాబుదారీతనం స్థానంలో దేన్నయినా డబ్బుతో కొనవచ్చుననీ, భిన్నాభిప్రాయాన్నీ, ప్రశ్నలనూ కూడ డబ్బుతో మాయం చేయవచ్చుననీ, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎన్నికలలో గెలవవచ్చుననీ నూతన ఆర్థిక విధానాల ఫలితంగానే మన రాజకీయ నాయకులు భావిస్తున్నారు. మొత్తంగా రాజకీయాలను కూడ ఒక వ్యాపారంగా, పెట్టుబడి మీద లాభాల రేటు అతి ఎక్కువగాఉన్న వ్యాపారంగా మార్చడం నూతన ఆర్థిక విధానాల ఫలితమే.</p>
<p>పైన చెప్పిన రంగాలలో అంత తీవ్రమైన ప్రభావం ఉన్నప్పుడు అది సంస్కృతి మీద కూడ ప్రభావం చూపక తప్పదు. ఈ ఇరవై సంవత్సరాలలో భారత ప్రజా సంస్కృతిలో కూడ గణనీయమైన మార్పులు వచ్చాయి. గతంలో లాగ సామాజిక అంశాలకు స్పందించడం, తోటి మనుషుల కష్టాల పట్ల సానుభూతితో స్పందించడం, ఆ కష్టాలు తీర్చడానికి వీలయినంత సహకారం అందించడం, అన్నార్తులపట్ల, నిస్సహాయుల పట్ల, పేదల పట్ల జాలి, సంక్షేమ భావాలు కనబరచడం క్రమక్రమంగా లోపిస్తున్నాయి. ‘మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు’ అని అందెశ్రీ రాసినట్టుగా నూతన ఆర్థిక విధానాల క్రమంలో మానవ లక్షణాలే లోపిస్తూ డబ్బు సంస్కృతి విస్తరిస్తున్నది. అమానవీయత మహమ్మారిలా వ్యాప్తిస్తున్నది. </p>
<p><b>సమర్థకుల వాదనలు</b><b></b></p>
<p>మన సామాజిక వ్యవస్థ ఇంతగా ధ్వంసమై పోతున్నా పాలకులు నూతన ఆర్థిక విధానాలను సమర్థిస్తున్నారు. ఈ విధానాలను ప్రారంభించిన పి వి నరసింహారావు ఆరు సంవత్సరాలలోనే వాటి దుష్ఫలితాలను గుర్తించి ‘నేననుకున్నది ఇది కాదు’ అని బహిరంగంగా ఒప్పుకున్నా, ఇప్పటికీ ఈ విధానాలకు అంటిపెట్టుకుని ఉన్న పాలకులున్నారు. ఈ విధానాల వల్ల లాభపడిన పిడికెడు మంది బహుళజాతి సంస్థల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలు, అమాయకులైన మధ్యతరగతి బుద్ధిజీవులు కొందరు ఈ విధానాలు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాయని ఇంకా నమ్ముతున్నారు, నమ్మబలుకుతున్నారు. వారికి కొత్త సరుకులూ సేవలూ అందుతున్న మాట నిజమే. వారి వ్యాపారాలు అభివృద్ధి చెందిన మాట నిజమే. వారికి రాజకీయాల వల్ల కోట్ల రూపాయల ఆస్తి కూడిన మాట నిజమే. వారికి సాఫ్ట్ వేర్ కంపెనీల వంటి నూతన ఆర్థిక విధానాల పర్యవసానాలలో భోగభాగ్యాలు సమకూరినమాట నిజమే. కాని నూతన ఆర్థిక విధానాల వల్ల ఇలా లాభపడిన సమూహం మొత్తం దేశంలో రెండు కోట్ల మంది మాత్రమే. ఎంత ఉదారంగా లెక్కించినా అలాంటి లబ్ధిదార్లు ఐదు కోట్లకు మించరు. అది దేశ జనాభాలో నూటికి నాలుగు కన్న తక్కువ. అంటే నూటికి నలుగురి బాగు కోసం మిగిలిన సమాజమంతా ఇంత దారుణమైన మూల్యం చెల్లిస్తున్నదన్నమాట. నూతన ఆర్థిక విధానాల వల్ల భూములు కోల్పోయి నిర్వాసితులైనవారి సంఖ్య, వ్యవసాయం, పరిశ్రమలు చితికి పోయినందువల్ల ఉపాధి కోల్పోయి బతుకు దుర్భరమైన వారి సంఖ్యలతో పోలిస్తే ఈ లాభపడినవారి సంఖ్య అతి తక్కువ. మరొకవైపు నుంచి చూస్తే నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలోని డాలర్ శతకోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నది. నూటఇరవై కోట్ల స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యులలో ఒక సంవత్సరం 46 మందిని, మరుసటి సంవత్సరం 55 మందిని శతకోటీశ్వరులను చేసిన నూతన ఆర్థిక విధానాలను చూసి మురిసిపోవడం ఎంత అమానుషం! ఎంత దుర్మార్గం! </p>
<p><b>భవిష్యత్తు ఏమిటి?</b><b></b></p>
<p><b></b></p>
<p>ఇటువంటి ప్రజావ్యతిరేకమైన విధానాలు, రోజురోజుకూ పెరిగిపోతున్న అసమానతలు, పాలకుల నిర్లక్ష్య ధోరణులు అంతిమంగా ఏ పర్యవసానాలకు దారి తీస్తాయో ప్రపంచ చరిత్ర అనేక సార్లు చెప్పింది. పూటకు తిండి దొరకని ప్రజలు కోట్లాదిగా ఉండగా, ఇంద్రభవనాలలో రాజసాలు అనుభవిస్తూ, “అయ్యో వారికి రొట్టె లేదా, అయితే కేకులు తినవచ్చు గదా” అని పలికిన ఫ్రెంచి రాణి తల పారిస్ వీథుల్లో దొర్లింది. “రొట్టె ఇవ్వలేకపోతే, సర్కస్ ఇవ్వండి” అని సర్కస్ లతో ఆకలిని జోకొట్టే ప్రయత్నం చేసినా అది ఎక్కువకాలం సాగలేదు. ఆకలిగొన్న ప్రజలు, హక్కులు కోల్పోయిన ప్రజలు, తమ వనరులు తమకు దక్కకుండా పోయిన ప్రజలు, తాము ఎన్నుకున్న పాలకులు తమ జీవితాలను ధ్వంసం చేస్తున్నారని గుర్తించిన ప్రజలు తమ సహనం కోల్పోయిన నాడు జరిగే విస్ఫోటనం ఘోరమనీ, దురంతమనీ మనం ఎన్ని మాటలయినా అనవచ్చు. కాని ఆ పర్యవసానానికి దారి తీస్తున్న క్రమం గురించి ఒక్క క్షణమయినా ఆలోచించడం మంచిది. </p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/689/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/689/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/689/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/689/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/689/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/689/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/689/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/689/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/689/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/689/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/689/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/689/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/689/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/689/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=689&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%87%e0%b0%b0%e0%b0%b5%e0%b1%88-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b1%80%e0%b0%95%e0%b0%b0%e0%b0%a3/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ప్రజల పాటకు ప్రతిఫలం మరణశిక్ష!</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%a3/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%a3/#comments</comments>
		<pubDate>Tue, 16 Aug 2011 11:04:34 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%a3/</guid>
		<description><![CDATA[వీక్షణం ఆగస్ట్ 2011 జార్ఖండ్ ప్రజా కళాకారుడు, పదిహేను సంవత్సరాలకు పైగా ఖొత్తా, సంథాలీ, నాగ్ పురి, హిందీ భాషలలో ప్రజా చైతన్య గీతాలు ఆలపిస్తూ తిరుగుతున్న ప్రముఖ గాయకుడు జీతన్ మరాండీకి ఒక అబద్ధపు కేసులో, దొంగ సాక్ష్యాల ఆధారంగా గిరిది న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసు వివరాలు చూస్తే ఈ దేశంలో, ముఖ్యంగా జార్ఖండ్ వంటి పోరాట ప్రాంతాలలో పాలకవర్గాలు ప్రజా ఉద్యమకారుల మీద, ఉద్యమ సమర్థకుల మీద, ప్రచారకుల మీద [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=688&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><u>వీక్షణం ఆగస్ట్ 2011 </u></p>
<p>జార్ఖండ్ ప్రజా కళాకారుడు, పదిహేను సంవత్సరాలకు పైగా ఖొత్తా, సంథాలీ, నాగ్ పురి, హిందీ భాషలలో ప్రజా చైతన్య గీతాలు ఆలపిస్తూ తిరుగుతున్న ప్రముఖ గాయకుడు జీతన్ మరాండీకి ఒక అబద్ధపు కేసులో, దొంగ సాక్ష్యాల ఆధారంగా గిరిది న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసు వివరాలు చూస్తే ఈ దేశంలో, ముఖ్యంగా జార్ఖండ్ వంటి పోరాట ప్రాంతాలలో పాలకవర్గాలు ప్రజా ఉద్యమకారుల మీద, ఉద్యమ సమర్థకుల మీద, ప్రచారకుల మీద ఎంత దుర్మార్గమైన దమననీతిని అనుసరిస్తున్నాయో అర్థమవుతుంది. ఒక సాంస్కృతిక సంస్థ నాయకుడిగా, గాయకుడిగా, సాంస్కృతిక కార్యకర్తగా బహిరంగ జీవితంలో ఉన్న వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యాలతో హత్యానేరాన్ని ఆరోపించడమే ఒక కుటిలనీతి కాగా, సాక్ష్యాల బోలుతనం స్పష్టంగా బయట పడుతున్నా, బధిరాంధ న్యాయస్థానం మరణ శిక్ష విధించడం మరింత నీచం.</p>
<p><span id="more-688"></span>
</p>
<p>జీతన్ మరాండీ జార్ఖండ్ లోని గిరిది జిల్లాలో సుదూర్ అనే ఊళ్లో 1980లలో పుట్టాడు. “మా కుటుంబంలో చదువుకున్న వాళ్లెవరూ లేదు. దుర్భర దారిద్ర్యంలో ప్రతి ఒక్కరూ పనిచేసి పొట్టనింపుకోవలసి ఉండేది. అలా నా జీవితం కూడ పశువుల కాపరిగా మొదలయింది. పలకా బలపం పట్టుకోవలసిన వయసులో ఆ చేతులతో పశువులను అదిలించే కర్ర పట్టుకున్నాను. పశువుల లెక్క కోసం కూడ గులకరాళ్లే ఉపయోగించేవాణ్ని. అతి కష్టం మీద మూడో తరగతి చదివాను. నా బడి చదువు అంతే” అని ఆయన ఒక రచనలో అన్నాడు. </p>
<p>కాని త్వరలోనే ఆయన లోకం పోకడ తెలుసుకున్నాడు. లోకాన్ని మార్చవలసి ఉందని అనుకున్నాడు. మొదట గాంధేయ ప్రభావంతో పాటలు పాడడం, జానపద కళా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. క్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆదివాసి సాంస్కృతిక కళారూపాల సంరక్షకుడిగా, వారసుడిగా గుర్తింపు పొందాడు. “అలా మేం పల్లె నుంచి పల్లెకూ, పట్నాలకూ చేరుకున్నాం. ఇతర ప్రాంతాల ప్రగతిశీల వ్యక్తులతో, బృందాలతో పరిచయం పెంచుకున్నాం. మా భావాలూ ఉద్వేగాలూ హారంలో పూలలా కలిసిపోయాయి” అని ఆయన చెప్పుకున్నాడు. అలా ఆయన విప్లవోద్యమ సమర్థకుడిగా, విప్లవోద్యమ సాంస్కృతిక గళంగా ఎదిగాడు. జార్ఖండ్ ఎబెన్ అనే సాంస్కృతిక బృందాన్ని నిర్వహించాడు. అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితిలో భాగమయ్యాడు. </p>
<p>“మేం వేలాది మంది ప్రజల ప్రేమాదరాలను చూరగొన్నాం. రచయితలు, కళాకారులు, సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తలు ఎందరో నన్ను ప్రోత్సహించారు. వాళ్లందరికీ నేను ఒక ప్రజా కళాకారుడిగా, ప్రగతిశీల సామాజిక కార్యకర్తగా, ప్రజలను మేల్కొలిపిన గాయకుడిగా తెలుసు. నా చేతుల్లో నగారా, ఢోలక్, హార్మోనియం వంటి సంగీత సాధనాలే తప్ప ఆయుధాలు ఎప్పుడూ చూడలేదని వాళ్లెవరయినా చెప్పగలరు. ఒక జానపద సాంస్కృతిక కళాకారుడిగా ధోతి, జుబ్బా, గజ్జెలు ధరించి ఉండగానే చూశారు గాని మరే ఇతర యూనిఫారంలో చూడలేదు. నా గళమూ నా సంస్కృతీ మాత్రమే నా సాధనాలు. నా చుట్టూ ఎప్పుడు చూసినా కళాకారుల గుంపే ఉండేది. ముఖ్యంగా బాల కళాకారులు ఉండేవారు. మేం జానపదకళలను ప్రచారం చేస్తూ గ్రామాలూ పట్టణాలూ తిరిగాం. నేనెన్నడూ ఒక కలం పేరు వాడలేదు. నాకొక అలియాస్ లేదు. నేను నా పేరుతోనే, జీతన్ మరాండీగానే ప్రచారమయ్యాను. నా పేరుమీదనే నా గొంతుతోనే నాలుగైదు భాషల్లో పాటల కాసెట్లు విడుదలయ్యాయి. ఆ పాటలేవీ అసభ్యమైనవి కాదు, తప్పుదారి పట్టించేవి కాదు. అవన్నీ సామాజిక స్పృహను రేకెత్తించేవి” అని ఆయన జైలు నుంచి రాసిన ఉత్తరంలో అన్నాడు.</p>
<p>అసలు ఆయన జైలుకు ఎందుకు వెళ్లవలసి వచ్చింది? గిరిది జిల్లా దేవరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ఖారా గ్రామంలో 2007 అక్టోబర్ 26న మావోయిస్టు గెరిల్లా దళం జరిపిన దాడిలో అప్పటి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కొడుకు అనూప్ మరాండీతో సహా 20 మంది మరణించారు. చిల్ఖారీ హత్యాకాండగా ప్రసిద్ధమైన ఈ ఘటన తర్వాత ఆ హత్యాకాండలో “జీతన్ మరాండీ” అనే పేరుగల నాయకుడు పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. ఒక పత్రిక అయితే కళాకారుడు జీతన్ మరాండీ ఫొటో కూడ వేసి వార్త రాసింది. వెంటనే జీతన్ మరాండీ దాన్ని ఖండించాడు. పత్రికల్లో ఆ ప్రకటన కూడ వచ్చింది. పోలీసులు కూడ ఈ జీతన్ మరాండీ, ఆ జీతన్ మరాండీ వేరు వేరు అన్నారు.</p>
<p>కాని ఐదు నెలల తర్వాత, 2008 ఏప్రిల్ లో జీతన్ మరాండీ రాంచీ నుంచి ప్రయాణంలో ఉండగా పోలీసులు పట్టుకుపోయారు. పది రోజుల పాటు రహస్య ప్రదేశంలో అక్రమ నిర్బంధంలో చిత్రహింసలకు, వేధింపులకు గురిచేసి, ముఖ్యమంత్రి ఇంటి ముందు ప్రదర్శన జరిపి, ఉపన్యాసం ఇచ్చాడనే కేసు పెట్టి జైలుకు పంపారు. జైలులో ఉండగానే ఆయన మీద మరెన్నో కేసులు బనాయించారు. అలా బనాయించిన కేసులలో ఒకటి చిల్ఖారీ హత్యాకాండ కేసు. </p>
<p>మరొక కేసు కోసం కోర్టుకు తీసుకువచ్చినప్పుడు పోలీసు అధికారి జీతన్ మరాండీని కొందరు వ్యక్తులకు పరిచయం చేశాడు. ఆ వ్యక్తులు చిల్ఖారీ కేసులో సాక్షులనీ, వారు జీతన్ మరాండీని కోర్టులో గుర్తించడానికే ఈ పరిచయం అనీ ఆ తర్వాత తేలింది. ఆ ఇద్దరు “సాక్షులు” తప్ప మరెవరూ, చివరికి హతుల బంధువులుగాని, గ్రామస్తులు గాని ఈ జీతన్ మరాండీ హత్యాస్థలంలో ఉన్నాడని సాక్ష్యం చెప్పలేదు. </p>
<p>ఈ అబద్ధపు కేసుల, దొంగ సాక్ష్యాల తతంగాలను ఎప్పటికప్పుడు జీతన్ మరాండీ కింది నుంచి పైదాకా అధికారుల దృష్టికి తెస్తూనే ఉన్నాడు. అయినా గిరిది మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఐ డి మిశ్రా జూన్ 23న ఇచ్చిన తీర్పులో జీతన్ మరాండీకి, ఛత్రపతి మండల్, మనోజ్ రాజ్ వర్, అనిల్ రామ్ అనే మరో ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించాడు. ఆరుగురు నిందితులను నిర్దోషులుగా వదిలిపెట్టాడు.</p>
<p>ఈ కేసు నడిచిన పద్ధతి గాని, సాక్షుల విచారణ గాని, శిక్ష విధించిన తీరు గాని కేవలం ఒక ప్రజా సాంస్కృతిక కార్యకర్త మీద కక్ష సాధింపు ధోరణిలో మాత్రమే సాగాయి. ఈ మరణ శిక్షను ఖండించడం, ఈ మరణ శిక్ష రద్దు చేయాలని పోరాడడం ప్రజాస్వామిక వాదుల, ప్రజా సాంస్కృతిక కార్యకర్తల కర్తవ్యం.</p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/688/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/688/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/688/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/688/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/688/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/688/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/688/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/688/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/688/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/688/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/688/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/688/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/688/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/688/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=688&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%a3/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పులు</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d/#comments</comments>
		<pubDate>Tue, 16 Aug 2011 10:45:41 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d/</guid>
		<description><![CDATA[వీక్షణం ఆగస్ట్ 2011 &#160; భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలై మొదటివారంలో రెండు చరిత్రాత్మకమైన తీర్పులు ప్రకటించింది. తమముందు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న రెండు కేసులలో జూలై 4న, 5న తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురిందర్ సింగ్ నిజ్జర్ దేశ రాజకీయార్థిక వ్యవస్థ గురించీ, పాలన గురించీ, ప్రపంచీకరణ విధానాల గురించీ, ప్రజా ఉద్యమాల గురించీ చాల ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న భారతీయ సంపదను [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=686&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><u>వీక్షణం ఆగస్ట్ 2011 </u></p>
<p>&#160;</p>
<p>భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలై మొదటివారంలో రెండు చరిత్రాత్మకమైన తీర్పులు ప్రకటించింది. తమముందు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న రెండు కేసులలో జూలై 4న, 5న తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురిందర్ సింగ్ నిజ్జర్ దేశ రాజకీయార్థిక వ్యవస్థ గురించీ, పాలన గురించీ, ప్రపంచీకరణ విధానాల గురించీ, ప్రజా ఉద్యమాల గురించీ చాల ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న భారతీయ సంపదను వెనక్కి తేవాలనే కేసులోనూ, చత్తీస్ గడ్ లో సాల్వా జుడుం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అకృత్యాలను అరికట్టాలనే కేసులోనూ ఈ తీర్పులు వెలువడ్డాయి. ప్రజల గురించి, దేశం గురించి, న్యాయం గురించి ఈ తీర్పులు మళ్లీ ఒకసారి మౌలికమైన చర్చను ముందుకు తెచ్చాయి. ఈ దేశంలో అధికార వ్యవస్థలలో, పాలక సంస్థలలో కూడ ఎక్కడో ఒకచోట న్యాయాన్యాయాలు ఆలోచించగల వాళ్లు ఇంకా ఉన్నారని రుజువు చేశాయి.</p>
<p><span id="more-686"></span>
</p>
<p>వీటిలో మొదటి కేసును ‘సిటిజెన్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున రాం జత్మలానీ, గోపాల్ శర్మ, జలబాల వైద్య, కె పి ఎస్ గిల్, ప్రొ. బి బి దత్తా, సుభాష్ కాశ్యప్ వంటి సామాజిక కార్యకర్తలు, మాజీ ప్రభుత్వాధికారులు 2009 ఏప్రిల్ లో సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. భారతదేశపు నాయకులు, అధికారులు స్విట్జర్లాండ్ లోనూ, ఇతర ప్రాంతాలలోనూ దాచుకున్న అక్రమ సంపద గురించి విరివిగా వార్తలు వస్తున్నాయని, ఆ అక్రమ ధనాన్ని వెనక్కి తెప్పించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి గనుక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలయిందని, ఆ వ్యాజ్యాన్ని అంగీకరించగూడదని ప్రభుత్వం వాదించింది. ఆ తర్వాత కేసు అనేక మలుపులు తిరిగి, మధ్యలో హసన్ అలీ ఖాన్, కాశీనాథ్ తపురియా, చంద్రికా తపురియా వంటి వారికి విదేశీ ఖాతాలలో వేల కోట్ల రూపాయల అక్రమ నిధులు ఉన్నాయని నిర్దిష్ట సమాచారం కూడ వచ్చింది. ఆ సమాచారం మీద కూడ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోకపోవడమూ, దానిమీద సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించడమూ కూడ జరిగాయి. ధర్మాసనం ఇచ్చిన ఎన్నో మధ్యంతర ఉత్తర్వులను కూడ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. </p>
<p>ఈ అక్రమ నిధుల వ్యవహారం చాల విస్తృతమైనది గనుక, ప్రభుత్వం నిర్లక్ష్యంగా, అలసత్వంతో వ్యవహరిస్తున్నది గనుక, ఈ వ్యవహారాన్ని పరిశోధించడానికి ఒక ప్రత్యేక పరిశోధనా బృందాన్ని నియమించాలని, దానిలో న్యాయమూర్తులను, ప్రజాజీవితంలో మచ్చలేనివారిని చేర్చాలని ఈ వాదనల క్రమంలో దరఖాస్తుదారులు వాదించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని, పరిశోధన సక్రమంగానే సాగుతున్నదని, అక్రమ నిధులను వెనక్కి తీసుకువస్తామని, కనుక దరఖాస్తుదారుల విన్నపాన్ని అంగీకరించవద్దని ప్రభుత్వం వాదించింది.</p>
<p>చిట్టచివరికి 2011 జూలై 4న ఇచ్చిన తీర్పులో అక్రమధనం వ్యవహారాన్ని పరిశోధించడానికి ఒక ఉన్నతస్థాయి ప్రత్యేక పరిశోధక బృందాన్ని నియమించాలని న్యాయస్థానం ఆదేశించింది. పదకొండు మంది ఉన్నతాధికారులతో ఏర్పడే ఈ బృందం మాజీన్యాయమూర్తులు జస్టిస్ బి పి జీవన్ రెడ్డి, జస్టిస్ ఎం బి షా ల నేతృత్వంలో పనిచేయాలని ఆదేశించింది. ఈ బృందానికి అన్ని అధికారాలూ కల్పించాలని, బృందం సుప్రీంకోర్టుకు జవాబుదారీగా పనిచేయాలని, అన్ని ప్రభుత్వ శాఖలూ ఈ బృందానికి సహకరించాలని ఆదేశించింది. అలాగే, దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ, ఈ విషయంలో రహస్యమేమీ లేదని, ఆ సమాచారమంతా దరఖాస్తుదారులకు అందజేయాలని ఆదేశించింది. ఈ తీర్పులోని అన్ని ఆదేశాలను పాటించారో లేదో ఆగస్ట్ మూడో వారంలో న్యాయస్థానానికి నివేదించాలని ఆదేశించారు.</p>
<p>ఈ ఆదేశాలకన్న ముఖ్యంగా, ఎనభై పేరాగ్రాఫుల తీర్పులో, మొదటి ఇరవై ఒక్క పేరాగ్రాఫులలో న్యాయమూర్తులు ఈ మొత్తం వ్యవహారంపై తమ సైద్ధాంతిక వైఖరిని ప్రకటించారు. మొత్తానికి మొత్తంగా ప్రజానుకూల దృక్పథంతో రాసిన ఈ భాగాన్ని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా చదవాలి. ‘స్వార్థమే మేలు’ అనే తప్పుడు సంస్కృతి మన సమాజంలో పెరిగిపోతున్నదని, గత రెండు మూడు దశాబ్దాలుగా, నయా ఉదారవాద సంస్కరణలలో భాగంగా ప్రభుత్వం ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నదని న్యాయమూర్తులు అన్నారు. అందులో భాగంగానే అంతకంతకూ ఎక్కువగా అక్రమ సంపాదన, పన్నుల ఎగవేత, అక్రమ ధనాన్ని విదేశాలకు తరలించడం, దాన్నే ఇతర మార్గాలలో సక్రమ ధనంగా దేశంలోకి తిరిగి తీసుకురావడం జరుగుతున్నదని, ఇందులో రాజకీయ నాయకుల, అధికారవర్గాల పాత్ర ఉన్నదని తీర్పు అభిప్రాయపడింది. ఇవాళ అత్యవసరమైన రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక అవగాహనలను ఈ తీర్పులో పందుపరిచారు.</p>
<p>ఈ తీర్పు వెలువడినవెంటనే రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, ప్రపంచీకరణ శక్తులు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. న్యాయస్థానం తన పరిధి దాటి వ్యాఖ్యానించిందని విమర్శించారు. ప్రభుత్వం చేయవలసిన పనిని న్యాయస్థానం తన పరిధిలోకి తీసుకుందని అన్నారు. చివరికి ఈ తీర్పు చెల్లదని, దీని మీద పునర్విచారణ జరపాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు జూలై 15న అప్పీలు చేసుకుంది. ఆ అప్పీలు మీద విచారణ జరగవలసి ఉంది. కాని అక్రమధనం మీద స్వతంత్ర, చట్టబద్ధ పరిశోధన జరగడం తమకు ఇష్టం లేదని ప్రభుత్వం స్పష్టంగా చెపుతున్నదని రుజువయింది. “రాజకీయ వ్యవస్థను నడపడంలో ఉన్న వాస్తవికమైన, ఆచరణాత్మకమైన ఇబ్బందులను” న్యాయవ్యవస్థ అర్థం చేసుకోవాలని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇచ్చిన సలహా చూస్తే, అక్రమ ఆస్తులను విదేశాలకు తరలించినవారిని కాపాడడమే ఈ రాజకీయ వ్యవస్థ చేసే “వాస్తవికమైన, ఆచరణాత్మకమైన” పని అని రుజువయింది. </p>
<p>ఇక రెండవ కేసు 2007లో సామాజిక శాస్త్రవేత్త ప్రొ నందినీ సుందర్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ ఎ ఎస్ శర్మ దాఖలు చేసినది. చత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికనే పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాల్వా జుడుం అనే ప్రైవేటు సైన్యం వల్ల, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల (ఎస్పీవోల) వల్ల పెద్దఎత్తున మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, దానితో ఆదివాసి ప్రజల మధ్య అంతర్యుద్ధానికి ప్రభుత్వమే ఆజ్యం పోస్తున్నదని, ఈ రాజ్యాంగేతర ప్రత్యేక పోలీసు అధికారుల నియామకాన్ని ఆపివేయాలని దరఖాస్తుదారులు కోరారు. విచారణ జరిగిన ఐదు సంవత్సరాలలో మరికొంతమంది దరఖాస్తుదారులు చేరారు, మరెన్నో ఘటనలు జరిగాయి. మధ్యలో దరఖాస్తుదారుల ఆరోపణలపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించవలసిందిగా సుప్రీంకోర్టు జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆదేశించింది. ఆ నివేదిక 2008 ఆగస్టులో రాగా, ఆ సిఫారసులను పాటించవలసిందిగా సుప్రీంకోర్టు చత్తీస్ గడ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాంతంలో పాఠశాలలను, విద్యార్థుల వసతి గృహాలను పోలీసులు ఆక్రమించుకుని, చదువు సాగకుండా చేస్తున్నారని వచ్చిన ఆరోపణలను, ఆదివాసులను హత్య చేసిన ఎస్పీవోలపై కేసులు నమోదు చేయడం లేదనే ఆరోపణలను కూడ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు కూడ ఎన్నో మలుపులు తిరిగి చివరికి 2011 మార్చ్ లో మోర్పల్లి, తాడిమెట్ల, తిమ్మాపురం గ్రామాల మీద కోయ కమాండోలు జరిపిన దాడి దాకా వచ్చింది. ఆ దాడి నిజానిజాలు పరిశీలించడానికి, బాధితులకు సహాయం అందించడానికి సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ వెళ్లగా, రక్షణ కల్పిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఉండగానే, ఆయన మీద ఎస్పీవోలు దాడి చేసిన ఘటనను కూడ సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. </p>
<p>చిట్టచివరికి 2011 జూలై 5న వెలువరించిన తీర్పులో న్యాయమూర్తులు ప్రధానంగా ఎస్పీవోల నియామకం గురించి, స్వామి అగ్నివేష్ ను అడ్డుకున్న ఘటన గురించి తమ ఆదేశాలు ప్రకటించారు. ఎస్పీవో అనే ప్రత్యేక అధికారులను ప్రత్యేకంగా అవసరమైన సందర్భాలలో నియోగించడానికి చట్టం అనుమతిస్తుంది గాని చత్తీస్ గడ్ లో ప్రస్తుతం ఏర్పాటయిన ఎస్పీవోలకు ఆ చట్ట నిబంధనలేవీ లేవని సుప్రీంకోర్టు ఆధారాలతో సహా చెప్పింది. భారత రాజ్యాంగం, భారత శిక్షా స్మృతి, భారత నేర విచారణా స్మృతి, సాక్ష్యాధారాల చట్టం వంటి నిబంధనలు చదివే సామర్థ్యం లేని, అనుమానితుల ప్రాథమిక హక్కుల గురించి పరిజ్ఞానం లేని, ఐదోతరగతి కూడ చదవని ఆదివాసులను కేవలం వారికి మావోయిస్టుల మీద ఉన్న కసి, ప్రతీకారవాంఛ ఆధారంగా నియమించారని, వారి జీతభత్యాలు, క్రమశిక్షణా చర్యలు, పదవీ విరమణ కాలం, విరమణానంతర ప్రతిఫలాలు ఏమీ నిర్ధారించకుండా, కేవలం నెలకు రు. 3000 ఇచ్చి, వారి చేతికి తుపాకి ఇచ్చి వారేమి చేసినా అడగబోమని ప్రభుత్వం చెప్పిందని కోర్టు ప్రకటించింది. ఈ మితిమీరిన అధికారం వల్లనే ఎస్పీవోలు అనేక అత్యాచారాలకు పాల్పడ్డారని, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోర్టు అభిప్రాయపడింది. ఇలా ప్రజలలో ఒక వర్గాన్ని మరొక వర్గం మీద ఉసి గొల్పడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, అమానుషం అని కోర్టు అభిప్రాయపడింది. </p>
<p>అందువల్ల చత్తీస్ గడ్ రాష్ట్రప్రభుత్వం వెంటనే ఎస్పీవో వ్యవస్థను రద్ధు చేయాలని, ఈ ఎస్పీవో వ్యవస్థకు కేంద్రప్రభుత్వ నిధులను వెంటనే ఆపు చేయాలని, ఎస్పీవోలకు ఇచ్చిన ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించబడిన ఎస్పీవోల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, సాల్వా జుడుం, కోయ కమాండోల పేరు మీద చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడే అన్ని బృందాలను రద్దుచేయాలని ఆదేశించింది. అలాగే స్వామి అగ్నివేష్ మీద జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తులు ఆ దాడి సంఘటనపైనా, అసలు ఆ మూడు గ్రామాలపై జరిగిన దాడి పైనా విచారణ జరపాలని సిబిఐని ఆదేశించారు.</p>
<p>సిబిఐ ఈ విచారణ నివేదికలను ఆరువారాల లోగా సమర్పించాలని, అలాగే చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కూడ మిగిలిన ఆదేశాల మీద తగిన చర్యలు తీసుకుని, ఆరు వారాలలోగా తమకు ఆ చర్యల గురించి చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. </p>
<p>ఈ తీర్పులో కూడ ఈ ఆదేశాలు ఒక ఎత్తయితే, ఈ 81 పేరాగ్రాఫుల తీర్పులో మొదటి 22 పేరాగ్రాఫులలో న్యాయమూర్తులు తమ సైద్ధాంతిక అవగాహనను వివరించడం మరొక ఎత్తు. వలసవాద దుర్మార్గం వల్ల, వనరుల దోపిడీ వల్ల కాంగోలో జరిగిన విధ్వంసం గురించిన నవలను ఉటంకిస్తూ ప్రారంభమైన ఈ భాగం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గురించి, వనరుల దోపిడీ గురించి, దేశదేశాల సంపన్నులకు ప్రభుత్వం దళారీగా వ్యవహరించడం గురించి ప్రస్తావించింది. అందువల్ల ప్రజలు అనివార్యంగా ఉద్యమాలవైపు చూడవలసి వస్తున్న పరిస్థితి గురించి రాసింది. మావోయిస్టులకు కూడ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే హక్కు లేదని, వారిది హింసాకాండ అని పాలకవర్గ వైఖరినే ఒక పేరాగ్రాఫులో రాసినప్పటికీ, మొత్తంగా ప్రజల పోరాడే హక్కు పట్ల ఈ తీర్పు అనుకూలంగా స్పందించింది.</p>
<p>ఈ తీర్పు మీద ఒకవైపు ప్రపంచీకరణ శక్తులు, మరొక వైపు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రతినిధులు దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. ఈ తీర్పును కూడ రద్దు చేయాలని అప్పీలు వెళతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇంతవరకూ అలాంటి అప్పీలుకు వెళ్లలేదు గాని, న్యాయస్థానపు ఆదేశాలను కూడ పాటించలేదని, ఎస్పీవోలను రద్దుచేయలేదని వార్తలు వస్తున్నాయి. </p>
<p>ఐతే ఈ తీర్పులు ఎంత ప్రగతిశీలంగా, ప్రజాపక్షంగా ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ, కొనసాగుతున్న రాజకీయార్థిక వ్యవస్థలో వీటికి ఎటువంటి ప్రభావం ఉండబోదనే సూచనలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ తీర్పులలో వ్యక్తమయిన అభిప్రాయాల ఆధారంగా విశాల సంఘటిత ప్రజా ఉద్యమాలు సాగినప్పుడు మాత్రమే, ప్రజాశక్తి మాత్రమే ఈ తీర్పుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోగలదు. </p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/686/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/686/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/686/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/686/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/686/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/686/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/686/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/686/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/686/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/686/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/686/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/686/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/686/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/686/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=686&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>నెల్లూరు గుండెలపై కుంపట్లు</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d/#comments</comments>
		<pubDate>Tue, 16 Aug 2011 10:39:38 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d/</guid>
		<description><![CDATA[వీక్షణం ఆగస్ట్ 2011 &#160; నెల్లూరు జిల్లా సముద్రతీరంలోని ముత్తుకూరు మండలంలో, దానికి ఆనుకుని ఉన్న చిల్లకూరు, వెంకటాచలం మండలాలలో ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఆరు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యుత్ కేంద్రాలలో ప్రైవేటు రంగంలో 25, ప్రభుత్వ రంగంలో ఒకటి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఆగిపోయాయని, మందకొడిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం అనుకున్నట్టుగా నిర్మాణం సాగితే, కొద్ది సంవత్సరాలలో ఈ విద్యుత్ కేంద్రాల వల్ల రోజుకు [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=684&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><u><font size="3">వీక్షణం ఆగస్ట్ 2011</font> </u></p>
<p>&#160;</p>
<p>నెల్లూరు జిల్లా సముద్రతీరంలోని ముత్తుకూరు మండలంలో, దానికి ఆనుకుని ఉన్న చిల్లకూరు, వెంకటాచలం మండలాలలో ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఆరు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యుత్ కేంద్రాలలో ప్రైవేటు రంగంలో 25, ప్రభుత్వ రంగంలో ఒకటి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఆగిపోయాయని, మందకొడిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం అనుకున్నట్టుగా నిర్మాణం సాగితే, కొద్ది సంవత్సరాలలో ఈ విద్యుత్ కేంద్రాల వల్ల రోజుకు రెండు లక్షల టన్నుల బూడిద, 15 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్, 22,000 టన్నుల గంధకం, వేరువేరు పరిమాణాలలో పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి అణుధార్మిక, విషపదార్థాలెన్నో వెలువడతాయి. ఎనిమిది గ్రామాలలో నెలకొల్పుతున్న ఈ కేంద్రాల వల్ల చుట్టూ నెల్లూరు జిల్లా సముద్రతీర ప్రాంతమంతా బూడిదకుప్పగా మారిపోతుంది. అక్కడి నీరు, గాలి విషపూరితమై వ్యవసాయానికీ, పళ్లతోటలకూ, చేపల చెరువులకూ, సముద్రం మీద చేపలవేటకూ అవకాశాలు మృగ్యమైపోతాయి. ఏటేటా దూరతీరాల నుంచి వచ్చే పక్షుల విహార కేంద్రాలు వట్టిపోతాయి. అక్కడి ప్రజలందరూ అక్కడే ఉంటే చనిపోవడమో, తీవ్రంగా అనారోగ్యం బారినపడడమో జరుగుతుంది. లేదా ఉన్నఊరూ, ఉపాధీ వదిలిపెట్టి పొట్టచేత పట్టుకుని వలస వెళ్లవలసి వస్తుంది. </p>
<p><span id="more-684"></span>
</p>
<p>ఈ విద్యుత్ కేంద్రాలవల్ల ఎన్ని మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని ఏర్పరచబోతున్నామో, జరగనున్న విద్యుదుత్పత్తి వల్ల ఎన్ని కొత్త పరిశ్రమలు రాబోతున్నాయో, ఎన్ని వేల కోట్ల పెట్టుబడి రాబోతోందో, ఎన్ని ఉద్యోగాల కల్పించబోతున్నామో పాలకులు చాల భారీ అంకెలు ప్రకటిస్తున్నారు. ఎన్నెన్నో ఆకుకు అందని పోకకు పొందని “అభివృద్ధి” స్వప్నాలను అమ్ముతున్నారు. కాని ఆ కలలన్నీ తీరప్రాంత మత్స్యకారులకు, వ్యవసాయదారులకు, పేద, మధ్యతరగతి ప్రజలకు పీడకలలే కానున్నాయి. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ మహాయజ్ఞంలో నెల్లూరు ప్రజలు సమిధలు కాబోతున్నారు. ఈ ప్రయత్నమంతా ప్రజలను తమ భూములనుంచీ, ఉపాధినుంచీ, జీవితాలనుంచీ నిర్వాసితులను చేయబోతున్నది. ఇప్పటికే ప్రభుత్వం 30,000 ఎకరాల సారవంతమైన, వరి పండించే భూములను, చేపల చెరువులను ఆక్రమించి పెట్టుబడిదారులకు అప్పగించింది. </p>
<p>ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధికి కాక, ఒక మహా విధ్వంసానికే దారితీయబోతున్నది. పిడికెడు మంది పెట్టుబడిదార్లకు, బహుళజాతి సంస్థలకు, దేశ దేశాల సంపన్నులకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదించుకునే అవకాశాలు ఇవ్వడం తప్ప ఈ విద్యుదుత్పత్తి కేంద్రాల వల్ల జరగబోయే అభివృద్ధీ లేదు, ప్రజల మేలూ లేదు. అసలు సంత పెద్ద మొత్తంలో తయారయ్యే విద్యుత్తు ప్రజలకు అవసరమే లేదు. ఆ విద్యుత్తుతో వచ్చే పరిశ్రమల్లో స్థానికులకు అవసరమైన వస్తువులు ఉత్పత్తి కాబోవడం లేదు. ఆ విద్యుత్ కేంద్రాలలోనూ, పరిశ్రమలలోనూ వస్తాయని చెపుతున్న ఉద్యోగాలలో నూటికి ఒక్కటి కూడ స్థానికులకు రాదు. అక్కడికి రాబోతున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడి వల్ల స్థానిక ప్రజల జీవితాలలో ఇసుమంత మెరుగుదల కూడ జరగదు సరిగదా, వారి జీవితాలూ జీవనోపాధులూ రద్దయిపోతాయి. </p>
<p>అసలింత హడావుడిగా 30,000 మెగా వాట్ల విద్యుదుత్పత్తి కోసం కేంద్రాలు నిర్మించవలసిన అవసరం ఉందా అని మొట్టమొదట ప్రశ్నించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికీ గడిచిన 55 ఏళ్లలో సాధించిన విద్యుదుత్పత్తి సామర్థ్యం 14,769 మెగావాట్లు (2010 సెప్టెంబర్ నాటికి). ఇందులో సగమే థర్మల్ విద్యుత్తు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుత వినియోగానికి అవసరమైన సామర్థ్యం కన్న ఇది వెయ్యి మెగావాట్లు మాత్రమే తక్కువ. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రానున్న 15 సంవత్సరాలలో పెరిగే వినియోగాన్ని బట్టి మరొక 15,000 మెగావాట్ల సామర్థ్యం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఒక్క నెల్లూరు జిల్లాలోనే 30,000 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని కల్పించడం ఎందుకు? ఇంతకూ ఈ కేంద్రాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు రాష్ట్రానికి ఇవ్వకపోయినా ఫరవాలేదని, ఆ కంపెనీలు తమ ఇష్టం వచ్చిన ధరకు, ఇష్టం వచ్చినవారికి అమ్ముకోవచ్చునని కూడ ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇక ఈ విద్యుత్ కేంద్రాలన్నీ ఉత్పత్తిలోకి దిగితే, నిజంగానే విద్యుత్తు ఉత్పత్తి అయితే అది అమ్ముకోవడానికి కృష్ణపట్నం ఓడరేవు వల్ల రాగల పరిశ్రమలు, మద్రాసు నగరంలోని పరిశ్రమలు మాత్రమే మిగులుతాయి. ఆ పరిశ్రమలకు కూడ అంత విద్యుత్తు అవసరం ఉంటుందా, ఉన్నా మద్రాసు పరిశ్రమలు నెల్లూరు కేంద్రాల నుంచి కొనుక్కుంటాయా అన్నీ అనుమానాలే. అంటే అన్ని వైపులనుంచీ ఆలోచించి చూస్తే, విద్యుత్ కేంద్రాల పేరుమీద భూములు ఆక్రమిస్తున్న, ఇతర మినహాయింపులు, రాయితీలు సంపాదిస్తున్న కంపెనీలకు విద్యుదుత్పత్తి కాక ఇతర ప్రయోజనాలు, ఉద్దేశాలు ఏవో ఉన్నాయన్నమాట. ఈ భూమి అంతా సముద్రతీరంలో విలాస, విహారకేంద్రాలు ఏర్పరచడానికో, రియల్ ఎస్టేట్ గా మార్చడానికో, రాయలసీమ-కర్ణాటక సరిహద్దులలోని ఖనిజ నిలువలను విదేశాలకు ఎగుమతి చేసే కేంద్రాలు నిర్మించడానికో ఉపయోగపడుతుందన్నమాట. </p>
<p>ఈ మౌలిక ప్రశ్నలను కూడ అలా ఉంచి, మన ప్రభుత్వాధికార వర్గాల అవకతవకలు, అవినీతి, అక్రమాలు కూడ ఈ నెల్లూరు విధ్వంసకాండ తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ విద్యుదుత్పత్తి కేంద్రాల కోసం ఎంత భూమి అవసరమో, ఎంత సేకరించారో, ఎంత పారిశ్రామికవేత్తలకు ఇచ్చారో, ఏ ధరన లెక్కకట్టి ఇచ్చారో, రైతుల దగ్గరినుంచి ఏ ధరన సేకరించారో, ఏ ఒక్కటీ పారదర్శకంగా లేవు. ప్రభుత్వం చెపుతున్నవన్నీ తప్పుల తడకలు, పచ్చి అబద్ధాలు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే జిల్లా కలెక్టర్ 5.9.2010న రాసిన లేఖలో కోస్టల్ ఆంధ్రా పవర్ కార్పొరేషన్ కు 2,687 ఎకరాలు ఇచ్చామని అన్నారు. కాని మూడు నెలల తర్వాత ఎపిఐఐసి ఏర్పాటు చేసిన సమావేశ ఎజెండాలో అదే కంపనీకి 21 ఎకరాలు మాత్రమే ఇచ్చామని రాశారు. ఎక్కడి 2,687? ఎక్కడి 21? మూడు నెలల్లోనే 2,665 ఎకరాలు ఎట్లా ఎక్కడ కరిగిపోయాయి? అలాగే సింహపురి ఎనర్జీ అనే కంపెనీ పెట్టుబడి కలెక్టర్ లేఖలో రు. 2600 కోట్లు ఉన్నదల్లా మూడునెలల తర్వాత సమావేశం నాటికి రు. 6000 కోట్లు అయింది. అలాగే కైనెటా పవర్ ప్రాజెక్ట్ అనే కంపెనీ వ్యయం మొదట రు. 7868 కోట్లు ఉన్నదల్లా సమావేశం నాటికి రు. 10,000 కోట్లు అయింది. అసలు నిర్మాణమూ, ఉత్పత్తీ మొదలుపెట్టకుండానే ఈ పెట్టుబడి వ్యయం అంకెలను ఇలా విపరీతంగా పెంచడానికి కారణం ఎవరు? ఎవరి ముడుపుల కోసం ఈ అంకెలు పెరిగాయి? మరొక ఆసక్తికరమైన విషయమేమంటే వీటిలో కోస్టల్ ఆంధ్రా పవర్ కార్పొరేషన్ అంబానీలకు చెందిన రిలయన్స్ ది. సింహపురి ఎనర్జీ తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావుది. కైనెటా పవర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరిది. </p>
<p>ఇంత పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి కేంద్రాలు నెల్లూరు జిల్లాకే ఎందుకు వస్తున్నాయో కూడ ఆలోచించవలసి ఉంది. అటుకొసన శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో ఇలాగే లెక్కలేనన్ని విద్యుత్ కేంద్రాలు వస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి కాదనేది స్పష్టమే. విరివిగా సముద్రజలాలు, తీరప్రాంతం, లోతట్టున ఖనిజ వనరులు, అభివృద్ధి చెందిన ఓడరేవులు ఉన్న ప్రదేశంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాల కోసం గాని, రియల్ ఎస్టేట్ కోసం గాని ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కృష్ణపట్నం ఓడరేవు, తమిళనాడుకూ, చెన్నై నగరానికీ చేరువలో ఉండడం, రాయలసీమ – కర్ణాటక సరిహద్దులలోని ఖనిజ నిలువలకు అతి తక్కువ దూరంలో ఉన్న సముద్రతీరం కావడం, గ్రాండ్ ట్రంక్ రైలు, రోడ్డు మార్గాలు చేరువలో ఉండడం వంటి అనేక కారణాలున్నాయి. ఈ జిల్లాకే చెందిన రాజకీయ నాయకులకు ఇటువంటి వ్యాపారాలలో ఆసక్తి ఉండడం మరొక అదనపు కారణం.</p>
<p>కాని నెల్లూరు సహజ, ప్రాకృతిక కారణాలవల్ల ఇటువంటి విధ్వంసకరమైన అభివృద్ధి నమూనాను ఎంతమాత్రం అమలు చేయడానికి వీలులేదు. ఈ జిల్లా 163 కి.మీ. సముద్రతీరంతో, దాదాపు 140 తీర గ్రామాలతో, వేలాది మంది మత్య్సకారుల ఆశ్రయంగా ఉంది. పెన్నార్, స్వర్ణముఖి నదీ ప్రవాహాలవల్ల, చిన్నతరహా నీటి పారుదల సౌకర్యాల వల్ల ఈ జిల్లా అనేక పంటలకు, ముఖ్యంగా వరికి ప్రసిద్ధిగాంచింది. గత మూడు దశాబ్దాలుగా సముద్ర తీర గ్రామాలలో, కొంత లోతట్టు గ్రామాలలో చేపల చెరువులు కూడ పెరిగాయి. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల విహారకేంద్రం వంటి ప్రకృతి సహజమైన స్థలాలు ఉన్నాయి. మొత్తానికి ఈ జిల్లా పర్యావరణ రీత్యా చాల సున్నితమైన ప్రాంతాలలో ఒకటి. ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థలో ఏమాత్రం చిన్న కాలుష్యమైనా తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది. అటువంటి చోట ఇంత భారీ కాలుష్యానికి, విధ్వంసానికి పూనుకోవడం దుర్మార్గం. </p>
<p>నిజానికి ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పాలకులు తామే రాసుకున్న అనేక చట్టాలను, నిబంధనలను కూడ ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగంలో ప్రజలకు హామీ ఇచ్చిన అనేక రక్షణలకు, ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నారు. జల కాలుష్యానికి వ్యతిరేకంగా 1974లో, వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా 1981లో, సముద్ర తీరప్రాంతాల రక్షణకోసం 1991లో తామే తీసుకు వచ్చిన చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. నూతన ఆర్థిక విధానాల, ప్రపంచీకరణ విధానాల వెల్లువలో దేశవ్యాప్తంగా ఇదే జరుగుతున్నది. కాని ఇక్కడ బహుళజాతిసంస్థల, బడా వ్యాపారస్తుల ప్రయోజనాలతో పాటు అదనంగా వ్యాపారవేత్తలయిన స్థానిక రాజకీయ నాయకుల పాత్ర కూడ ఉంది.</p>
<p>ఒక్కసారి ఈ విద్యుత్ కేంద్రాల జాబితాను పరిశీలిస్తే, ఆ కంపనీలలో ఎక్కువ భాగం బడా పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలయిన రాజకీయ నాయకులకు సంబంధించినవేనని అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు టి సుబ్బరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, వల్లభనేని బాలశౌరి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి వంటి రాజకీయ నాయకులు మాత్రమే కాక, అటు కాంగ్రెస్ కో, ఇటు తెలుగుదేశంకో, లేదా రెండు పార్టీలకు ఉమ్మడిగానో మద్దతు, ముడుపులు ఇచ్చే వ్యాపారవేత్తలు ఈ కేంద్రాల మదుపుదార్లుగా ఉన్నారు.</p>
<p>ఇన్నిరకాల తప్పుడు ప్రయోజనాలతో, అనవసరంగా, దుర్మార్గంగా, విధ్వంసకరంగా, ప్రజాజీవితానికి వినాశకరంగా నెల్లూరును మహమ్మారిలా ముంచెత్తుతున్న ఈ థర్మల్ ప్రాజెక్టుల వ్యవహారాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదికి, ప్రజాపక్ష ఆలోచనాపరులకు తప్పనిసరి బాధ్యత. </p>
<p>(పెన్నార్ డెల్టా ఆయకట్టుదార్ల సంఘం అధ్యక్షులు బెజవాడ గోవిందరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ వ్యాసానికి ప్రధాన ఆధారం)<br />
<table border="1" cellspacing="0" cellpadding="0">
<tbody>
<tr>
<td valign="top" width="37">
<p>సం.</p>
</td>
<td valign="top" width="204">
<p>విద్యుత్ కంపెనీ పేరు</p>
</td>
<td valign="top" width="71">
<p>స్థాపిత శక్తి (మెవా)</p>
</td>
<td valign="top" width="128">
<p>గ్రామం</p>
</td>
<td valign="top" width="198">
<p>ప్రధాన పెట్టుబడిదారు / సహకరిస్తున్న రాజకీయవేత్త</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>1.</p>
</td>
<td valign="top" width="204">
<p>మహావీర్ ఎనర్జీ ప్రై. లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>500 </p>
</td>
<td valign="top" width="128">
<p>అంకులపాటూరు</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>2. </p>
</td>
<td valign="top" width="204">
<p>వి ఎస్ ఎఫ్ ప్రాజెక్ట్స్ లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>485</p>
</td>
<td valign="top" width="128">
<p>అంకులపాటూరు</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>3.</p>
</td>
<td valign="top" width="204">
<p>డా. ఆర్ కె పి పవర్ లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>420</p>
</td>
<td valign="top" width="128">
<p>అంకులపాటూరు</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>4.</p>
</td>
<td valign="top" width="204">
<p>ఎస్ బి క్యు స్టీల్స్ లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>300</p>
</td>
<td valign="top" width="128">
<p>అంకులపాటూరు</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>5.</p>
</td>
<td valign="top" width="204">
<p>బాలాజీ పవర్ అండ్ సోలార్ ఎనర్జీ</p>
</td>
<td valign="top" width="71">
<p>100</p>
</td>
<td valign="top" width="128">
<p>అంకులపాటూరు</p>
</td>
<td valign="top" width="198">
<p>మాగుంట శ్రీనివాస రెడ్డి</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>6.</p>
</td>
<td valign="top" width="204">
<p>గూడూర్ థర్మల్ పాంట్</p>
</td>
<td valign="top" width="71">
<p>300</p>
</td>
<td valign="top" width="128">
<p>అంకులపాటూరు</p>
</td>
<td valign="top" width="198">
<p>లగడపాటి రాజగోపాల్</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>7.</p>
</td>
<td valign="top" width="204">
<p>ప్రాగ్దిశ పవర్ ప్రై. లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>2640</p>
</td>
<td valign="top" width="128">
<p>మోమిడి</p>
</td>
<td valign="top" width="198">
<p>లగడపాటి రాజగోపాల్</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>8.</p>
</td>
<td valign="top" width="204">
<p>శివస్వాతి కన్ స్ట్రక్షన్స్ ప్రై. లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>1200</p>
</td>
<td valign="top" width="128">
<p>మోమిడి</p>
</td>
<td valign="top" width="198">
<p>ప్రత్తిపాటి పుల్లారావు</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>9.</p>
</td>
<td valign="top" width="204">
<p>లాంకో పవర్</p>
</td>
<td valign="top" width="71">
<p>1000</p>
</td>
<td valign="top" width="128">
<p>మోమిడి</p>
</td>
<td valign="top" width="198">
<p>లగడపాటి రాజగోపాల్</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>10.</p>
</td>
<td valign="top" width="204">
<p>ఎన్ ఎస్ ఎల్ ఆంధ్రా పవర్ ప్రై. లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>1320</p>
</td>
<td valign="top" width="128">
<p>మోమిడి, ఏరూరు</p>
</td>
<td valign="top" width="198">
<p>మండవ ప్రభాకర రావు</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>11.</p>
</td>
<td valign="top" width="204">
<p>ఆశ్రిత్ ఎనర్జీ ప్రై లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>200</p>
</td>
<td valign="top" width="128">
<p>ఏరూరు</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>12.</p>
</td>
<td valign="top" width="204">
<p>కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్</p>
</td>
<td valign="top" width="71">
<p>1980</p>
</td>
<td valign="top" width="128">
<p>తమ్మినపట్నం, మోమిడి</p>
</td>
<td valign="top" width="198">
<p>నవయుగ గ్రూప్, నేదురుమల్లి జనార్దనరెడ్డి</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>13.</p>
</td>
<td valign="top" width="204">
<p>కైనెటా పవర్ ప్రాజెక్ట్స్ లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>1980</p>
</td>
<td valign="top" width="128">
<p>తమ్మినపట్నం, మోమిది</p>
</td>
<td valign="top" width="198">
<p>వల్లభనేని బాలశౌరి</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>14.</p>
</td>
<td valign="top" width="204">
<p>మీనాక్షి ఎనర్జీ ప్రై. లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>2320</p>
</td>
<td valign="top" width="128">
<p>తమ్మినపట్నం, మోమిది</p>
</td>
<td valign="top" width="198">
<p>కాట్రగడ్డ శ్రీనివాసరావు</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>15.</p>
</td>
<td valign="top" width="204">
<p>సింహపురి ఎనర్జీ ప్రై. లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>1920</p>
</td>
<td valign="top" width="128">
<p>తమ్మినపట్నం</p>
</td>
<td valign="top" width="198">
<p>నామా నాగేశ్వరరావు</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>16.</p>
</td>
<td valign="top" width="204">
<p>వి ఎన్ ఆర్ పవర్ టెక్ ప్రై.లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>330</p>
</td>
<td valign="top" width="128">
<p>తమ్మినపట్నం, మోమిడి</p>
</td>
<td valign="top" width="198">
<p>వాకాటి నారాయణ రెడ్డి</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>17.</p>
</td>
<td valign="top" width="204">
<p>నెక్కంటి పవర్ ప్రై. లి.</p>
</td>
<td valign="top" width="71">
<p>60</p>
</td>
<td valign="top" width="128">
<p>చిల్లకూరు మం.</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>18.</p>
</td>
<td valign="top" width="204">
<p>ఎన్ కార్ పవర్ జెన్</p>
</td>
<td valign="top" width="71">
<p>350</p>
</td>
<td valign="top" width="128">
<p>చిల్లకూరు మం.</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>19.</p>
</td>
<td valign="top" width="204">
<p>ఎక్సెలాన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్</p>
</td>
<td valign="top" width="71">
<p>350</p>
</td>
<td valign="top" width="128">
<p>చిల్లకూరు మం.</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>20.</p>
</td>
<td valign="top" width="204">
<p>థర్మల్ పవర్ టెక్ కార్పొరేషన్</p>
</td>
<td valign="top" width="71">
<p>1980</p>
</td>
<td valign="top" width="128">
<p>నేలటూరు/పైనాపురం</p>
</td>
<td valign="top" width="198">
<p>గాయత్రి ప్రాజెక్ట్స్ (సుబ్బరామిరెడ్డి)</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>21.</p>
</td>
<td valign="top" width="204">
<p>దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్</p>
</td>
<td valign="top" width="71">
<p>1600</p>
</td>
<td valign="top" width="128">
<p>నేలటూరు</p>
</td>
<td valign="top" width="198">
<p>ఏ పి జెన్ కో</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>22.</p>
</td>
<td valign="top" width="204">
<p>లెదర్ పార్క్ పవర్</p>
</td>
<td valign="top" width="71">
<p>500</p>
</td>
<td valign="top" width="128">
<p>కృష్ణపట్నం</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>23.</p>
</td>
<td valign="top" width="204">
<p>కోస్టల్ ఆంధ్రా పవర్ కార్పొరేషన్</p>
</td>
<td valign="top" width="71">
<p>3960</p>
</td>
<td valign="top" width="128">
<p>కృష్ణపట్నం</p>
</td>
<td valign="top" width="198">
<p>రిలయన్స్ గ్రూప్ (అంబానీ)</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>24.</p>
</td>
<td valign="top" width="204">
<p>నెల్ కాస్ట్ ఎనర్జీ</p>
</td>
<td valign="top" width="71">
<p>1320</p>
</td>
<td valign="top" width="128">
<p>పైనా పురం</p>
</td>
<td valign="top" width="198">
<p>నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపనీ (రాజు), సుబ్బరామిరెడ్డి</p>
</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>25.</p>
</td>
<td valign="top" width="204">
<p>శౌర్య ఎనర్జీ</p>
</td>
<td valign="top" width="71">
<p>100</p>
</td>
<td valign="top" width="128">
<p>తిరుమలమ్మ పాలెం</p>
</td>
<td valign="top" width="198">&#160;</td>
</tr>
<tr>
<td valign="top" width="37">
<p>26.</p>
</td>
<td valign="top" width="204">
<p>పూజిత ఇంజనీరింగ్ కంపనీ</p>
</td>
<td valign="top" width="71">
<p>100</p>
</td>
<td valign="top" width="128">
<p>తిరుమలమ్మ పాలెం</p>
</td>
<td valign="top" width="198">
<p>విపిజె గ్రూప, సికిందరాబాద్</p>
</td>
</tr>
</tbody>
</table>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/684/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/684/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/684/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/684/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/684/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/684/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/684/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/684/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/684/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/684/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/684/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/684/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/684/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/684/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=684&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/08/16/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ఎప్పటికైనా రాజపక్షను శిక్షిస్తారా?</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%8e%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%88%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%8e%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%88%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95/#comments</comments>
		<pubDate>Mon, 25 Jul 2011 12:45:21 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%8e%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%88%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95/</guid>
		<description><![CDATA[సంపాదకీయ వ్యాఖ్యలు 2 శ్రీలంకలో స్వతంత్ర ఈలం స్థాపించుకోవాలనే తమిళ జాతి ఆకాంక్ష సాయుధపోరాట రూపం తీసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఇరవై సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, అతి భయంకరమైన అణచివేతకు గురై ఓడిపోయి రెండు సంవత్సరాలయింది. 2009 మేలో శ్రీలంక ప్రభుత్వం, భారత ప్రభుత్వ సహాయంతో అతి దుర్మార్గమైన దాడులు జరిపి అత్యంత కిరాతకంగా వేలాది మంది ఎల్ టి టి ఇ సైనికులను, సాధారణ తమిళ ప్రజలను చంపివేసింది. హతుల సంఖ్య నలభై వేల [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=680&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>సంపాదకీయ వ్యాఖ్యలు 2</p>
<p>శ్రీలంకలో స్వతంత్ర ఈలం స్థాపించుకోవాలనే తమిళ జాతి ఆకాంక్ష సాయుధపోరాట రూపం తీసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఇరవై సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, అతి భయంకరమైన అణచివేతకు గురై ఓడిపోయి రెండు సంవత్సరాలయింది. 2009 మేలో శ్రీలంక ప్రభుత్వం, భారత ప్రభుత్వ సహాయంతో అతి దుర్మార్గమైన దాడులు జరిపి అత్యంత కిరాతకంగా వేలాది మంది ఎల్ టి టి ఇ సైనికులను, సాధారణ తమిళ ప్రజలను చంపివేసింది. హతుల సంఖ్య నలభై వేల నుంచి లక్ష దాకా ఉండవచ్చని అంచనా. </p>
<p><span id="more-680"></span>
<p>శ్రీలంక సైనికులు వేలాది మంది స్త్రీలపై అత్యాచారాలు చేశారు. పిల్లలను ఊచకోత కోశారు. లిబరేషన్ టైగర్స్ తో ఏ సంబంధమూ లేనివారిని, చివరికి శరణార్థి శిబిరాలలో చేరినవారిని కూడ తమిళులైతే చాలు అన్నట్టుగా జాతిహననకాండ జరిపారు. ఆఖరి యుద్ధం జరిగిన ముల్లైతీవు ప్రాంతంలో ప్రభుత్వమే ‘కాల్పులు జరపని ప్రాంతం’ అని కొన్ని ప్రాంతాలను నిర్దేశించి, సాధారణ ప్రజానీకాన్ని అక్కడ సమీకరించి వారిని ఊచకోత కోశారని బయటపడింది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సహాయంతో యుద్ధ ప్రాంతంలో ఆస్పత్రులు ఏర్పాటు చేసి, వాటి మీద బాంబులు వేయకుండా ఉండడానికి పైకప్పుల మీద కనబడేట్టుగా రెడ్ క్రాస్ చిత్రించాలని ఆదేశం ఇచ్చి, ఆ గుర్తు ఉన్న భవనాల మీదనే బాంబుదాడులు జరిపారు. తాజాగా బిబిసి ఛానల్ 4 లో ప్రదర్శించిన ‘శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్’ లో లిబరేషన్ టైగర్లను నగ్నంగా చేసి ఎదురుగా నిలబెట్టి ఎలా కాల్చిచంపారో, లిబరేషన్ టైగర్స్ కు చెందిన మహిళల మీద ఎలా అత్యాచారాలు జరిపారో దారుణమైన వీడియోలు బయటపడ్డాయి. ఈ దుర్మార్గానికి భారత ప్రభుత్వం ఆర్థిక, సైనిక, ఆయుధ, నైతిక సహకారం అందించగా, సభ్యసమాజం అనబడేది మౌనసాక్షిలా నిలిచిపోయింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచంలో మానవతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే తాము కంకణం కట్టుకున్నామని బూటకపు ప్రవచనాలతో ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లలో నరమేధం సాగించిన అమెరికన్, యూరపియన్ ప్రభుత్వాలు రాజపక్ష రక్తపిపాసపై పల్లెత్తుమాట అనలేదు. రెండు సంవత్సరాలుగా ప్రగతిశీల మేధావులు, తమిళ శరణార్థులు సాగించిన ప్రయత్నాల ఫలితంగా చిట్టచివరికి ఐక్యరాజ్యసమితి నియమించిన పరిశీలక బృందం శ్రీలంక ప్రభుత్వపు దుర్మార్గాల చిట్టాను బయటపెట్టింది. ఏప్రిల్ లో ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శికి అందిన ఈ నివేదిక శ్రీలంక ప్రభుత్వం సాగించిన ఐదు దుర్మార్గాలను స్పష్టంగా ప్రకటించింది. కాల్పులు జరగగూడని ప్రాంతాలలో సాధారణ పౌరుల మీద జరిగిన కాల్పులు; ఆస్పత్రులమీద, మానవ ఆవాసాల మీద బాంబు దాడులు; ఆహారం, ఔషధాలు వంటి మానవతా సహాయం అందకుండా అడ్డుకోవడం; శరణార్థులమీద, టైగర్ల మీద యుద్ధానంతరం జరుగుతున్న కక్ష సాధింపు, మానవహక్కుల ఉల్లంఘనలు; మొత్తంగా దేశంలోనే ప్రచార సాధనాల మీద, విమర్శకుల మీద జరుగుతున్న దాడులు. ఈ నివేదిక ఎల్ టి టి ఇ మీద కొన్ని విమర్శలు చేసింది గాని ఇప్పుడు అవి అప్రస్తుతం. ఈ నివేదిక వెలువడి రెండు నెలలు గఢిచినా, ప్రపంచ దేశాలలో ఏఒక్కటీ ఈ నివేదిక ఆధారంగా శ్రీలంక ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలని కోరలేదు. కనీసం ఆ నివేదికలో సూచించినట్టు అంతర్జాతీయ న్యాయవిచారణ జరపడానికి ప్రయత్నించడం లేదు. మన కళ్ల ముందర ఒక జాతి స్వయం నిర్ణయాధికార ఆకాంక్షను ఇంత బీభత్సంగా, దుర్మార్గంగా చిదిమివేస్తే మాట్లాడకుండా, ప్రశ్నించకుండా, ప్రతిఘటించకుండా కూచున్న మహాఘనత వహించిన ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏమనాలి? ఇరవయ్యొకటో శతాబ్దపు హిట్లర్ గా తనను తాను రుజువు చేసుకున్న మహింద రాజపక్ష యుద్ధ నేరాలకు ఎప్పటికైనా శిక్ష పడుతుందా? </p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/680/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/680/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/680/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/680/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/680/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/680/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/680/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/680/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/680/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/680/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/680/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/680/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/680/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/680/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=680&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%8e%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%88%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>అసలు సమస్యలను మసకబార్చే &#8216;అవినీతి వ్యతిరేకత&#8217;</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b8%e0%b0%95%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b8%e0%b0%95%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87/#comments</comments>
		<pubDate>Mon, 25 Jul 2011 12:43:17 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b8%e0%b0%95%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87/</guid>
		<description><![CDATA[సంపాదకీయ వ్యాఖ్యలు 1 ద్వంద్వాలుగా కనబడేవన్నీ, ద్వంద్వాలుగా చూపబడేవన్నీ ద్వంద్వాలు కావు. ఎదురెదురుగా ఉన్నట్టు, తీవ్రమైన ఘర్షణ పడుతున్నట్టు కనబడుతున్నవన్నీ నిజంగా ప్రత్యర్థి శక్తులు కావు. పాలకవర్గ ముఠాల మధ్య కూడ తమ స్వార్థ ప్రయోజనాల కోసం భీకరమైన ఘర్షణలే జరుగుతాయి. అన్నా హజారే – కపిల్ సిబాల్, బాబా రాందేవ్ – ప్రభుత్వం, యుపిఎ – బిజెపి, అవినీతి – అవినీతి రాహిత్యం అనే ద్వంద్వాలను ఇవాళ పాలకవర్గాలలోని వివిధ ముఠాలు, ఆ ముఠాలకు ప్రాతినిధ్యం [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=679&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>సంపాదకీయ వ్యాఖ్యలు 1</p>
<p>ద్వంద్వాలుగా కనబడేవన్నీ, ద్వంద్వాలుగా చూపబడేవన్నీ ద్వంద్వాలు కావు. ఎదురెదురుగా ఉన్నట్టు, తీవ్రమైన ఘర్షణ పడుతున్నట్టు కనబడుతున్నవన్నీ నిజంగా ప్రత్యర్థి శక్తులు కావు. పాలకవర్గ ముఠాల మధ్య కూడ తమ స్వార్థ ప్రయోజనాల కోసం భీకరమైన ఘర్షణలే జరుగుతాయి. అన్నా హజారే – కపిల్ సిబాల్, బాబా రాందేవ్ – ప్రభుత్వం, యుపిఎ – బిజెపి, అవినీతి – అవినీతి రాహిత్యం అనే ద్వంద్వాలను ఇవాళ పాలకవర్గాలలోని వివిధ ముఠాలు, ఆ ముఠాలకు ప్రాతినిధ్యం వహించే ప్రచారసాధనాలు నిజంగా ఎదురుబొదురుగా నిలబడిన ద్వంద్వాలన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. </p>
<p><span id="more-679"></span>
<p>ఆయా వ్యక్తులలో ఎవరో ఒకరు నిజాయితీపరులు కూడ కావచ్చు. తాము నమ్మిన విశ్వాసానికి తగినట్టు పనిచేస్తుండవచ్చు. కాని ఇది వ్యక్తుల సమస్య కాదు. ఒక చారిత్రక ఘట్టంలో ఒకే పాలకవర్గంలోని వివిధ ముఠాల ప్రయోజనాల మధ్య బయటపడుతున్న ఘర్షణ కొందరు వ్యక్తుల, కొన్ని నినాదాల రూపం తీసుకుంటున్నది. ఆ ఘట్టమే అదా ఇదా, అటుంటావా ఇటుంటావా అని ఒక కుహనా సవాల్ విసురుతున్నది. ఇద్దరూ దొంగలే అయినచోట ఒక దొంగ పక్షం వహించకతప్పని నిర్బంధ స్వేచ్ఛను ప్రజలకు ఇస్తున్నది. ఈ కనబడే నాటకమంతా నిజమని భ్రమపడే మధ్య తరగతి ఈ ద్వంద్వాల్లో ఒకదానికి, తాము సరైనదనుకునేదానికి మద్దతు ఇస్తూ వీథుల్లోకి వస్తోంది. రూపానికీ సారానికీ తేడా లేకపోతే శాస్త్రం అవసరమే ఉండదన్నాడు మార్క్స్. ఇవాళ దేశంలో ఘర్షణ రూపంలో సాగుతున్న ఈ ప్రహసనపు సారాంశాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. అన్నా హజారే నుంచి బాబా రాందేవ్ దాకా, భారతీయ జనతా పార్టీ నుంచి లోక్ సత్తా దాకా ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్న వారెవరూ రోగలక్షణం గురించే మాట్లాడుతున్నారు తప్ప రోగం గురించీ, రోగ కారణాల గురించీ మాట్లాడడం లేదు. రోగలక్షణాలను తొలగించే పని ఎంత నిజాయితీగా జరిగినా రోగం లేకుండాపోదు. ఈ వ్యవస్థ ఇప్పుడున్న స్థితిలో కొనసాగడమే అవినీతికి మూలం. ఈ పాలనను, ఈ రాజ్యాంగ వ్యవస్థను, ఇవాళ్టి రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక ధర్మాన్ని కూలదోయకుండా, ఇవి ఇలాగే ఉంచి, అవినీతిని రద్దు చేస్తామని అనడం తెలిసి చేసినా తెలియక చేసినా అర్థరహితం. అవినీతి మహమ్మారి లాగ విస్తరించింది గనుక, ప్రతి జీవన రంగాన్నీ అతలాకుతలం చేస్తున్నది గనుక, అవినీతిని నిర్మూలించాలి అనే నినాదానికి ప్రజల నుంచి మద్దతు వచ్చే మాట నిజమే. ఆ మద్దతు ఒకరకంగా యథాస్థితి పట్ల ప్రజల వ్యతిరేకతకు చిహ్నం. ఆ వ్యతిరేకతను సరైన దారిలో నడిపించాలంటే అవినీతి మూలాలను వివరించి, నిర్మూలన ఎలా సాధ్యమో చెప్పాలి. అవినీతిని నిర్మూలించాలంటే వ్యవస్థను మార్చాల్సి ఉంటుందనే అవగాహన ఇవ్వాలి. కాని ఇవాళ ఈ “అవినీతి నిర్మూలన” ఉద్యమాన్ని నడుపుతున్నవి పాలకవర్గ ముఠాలే గనుక ఆ మౌలిక అంశాల జోలికి పోకుండా ప్రజల అసంతృప్తిని చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. చట్టంలో మార్పులు తెస్తే, నిజాయితీపరులైన అధికారులు ఉంటే, చట్టాలను సరిగా అమలు చేస్తే అవినీతి రద్దయిపోతుందనే భ్రమలు కలిగిస్తున్నాయి. నిజమైన పరిష్కారాలవైపు, అర్థవంతమైన ప్రత్యామ్నాయాలవైపు ప్రజలు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని మించి ఈ ఆందోళనలు సాధించగలిగినదేమీ లేదు. పాలకవర్గాలలోని ప్రతిపక్ష ముఠాలు ఈ నాటకం ఆడుతుండగా, పాలకముఠా ఈ మాత్రం నటన కూడ అవసరం లేదనే మొరటుతనాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటిదాకా మౌనంగానో, స్వల్పస్థాయి ఆందోళనతోనో కూచున్న ప్రేక్షకులు లేచి నిలిచి రంగస్థలం మీదికి దండయాత్ర జరిపేదాకా ఈ నాటకాలు సాగుతూనే ఉంటాయి. </p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/679/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/679/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/679/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/679/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/679/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/679/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/679/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/679/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/679/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/679/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/679/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/679/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/679/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/679/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=679&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b8%e0%b0%95%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ప్రజల పట్ల శ్రద్ధ లేని పాలకులు</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%be/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%be/#comments</comments>
		<pubDate>Mon, 25 Jul 2011 12:40:47 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%be/</guid>
		<description><![CDATA[వీక్షణం – జూలై 2011 సంపాదకీయం &#160; తమను తాము ప్రజాస్వామిక అవతారాలమని, అత్యధిక వోట్లు తెచ్చుకున్న ప్రజాప్రతినిధులమని, తమ పనులకన్నిటికీ ప్రజామోదం ఉన్నట్టేనని చెప్పుకుంటున్న పాలకులకు ప్రజల పట్ల కనీస శ్రద్ధ లేదని రోజురోజూ రుజువవుతున్నది. ప్రత్యేకించి రాష్ట్రం సమస్యల సుడిగుండంలో నానాటికీ దిగజారిపోతుండగా, ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేలిపోతుందోననిపించే స్థితి ఉండగా పాలకులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ఏ ఒక్క ప్రజాసమస్యనైనా పరిష్కరిద్దామనే ఆలోచనే పాలకుల దరిజేరడం లేదు. పాత సమస్యలను, ప్రజలు లేవనెత్తుతున్న [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=678&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><u>వీక్షణం </u><u>–</u><u> జూలై 2011 </u>సంపాదకీయం</p>
<p>&#160;</p>
<p>తమను తాము ప్రజాస్వామిక అవతారాలమని, అత్యధిక వోట్లు తెచ్చుకున్న ప్రజాప్రతినిధులమని, తమ పనులకన్నిటికీ ప్రజామోదం ఉన్నట్టేనని చెప్పుకుంటున్న పాలకులకు ప్రజల పట్ల కనీస శ్రద్ధ లేదని రోజురోజూ రుజువవుతున్నది. ప్రత్యేకించి రాష్ట్రం సమస్యల సుడిగుండంలో నానాటికీ దిగజారిపోతుండగా, ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేలిపోతుందోననిపించే స్థితి ఉండగా పాలకులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ఏ ఒక్క ప్రజాసమస్యనైనా పరిష్కరిద్దామనే ఆలోచనే పాలకుల దరిజేరడం లేదు. పాత సమస్యలను, ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించకపోవడం మాత్రమే కాదు, ప్రజలకు కొత్త సమస్యలను పాలకులే సృష్టిస్తున్నారు. మరొకవైపు ప్రజలకు ఎంతమాత్రం సంబంధంలేని పనికిమాలిన వ్యవహారాలలో, విలాసాలలో, పక్కదారి పట్టించే, ప్రజలకోసమేనని మభ్యపెట్టే కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతమూ ఏ ఒక్క ప్రజాసమూహమూ సమస్యలు లేని స్థితిలో లేదు. </p>
<p><span id="more-678"></span>
<p>తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి సాగుతున్న ఆందోళన, అనిశ్చితి, ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజలమీద నిర్బంధం ఏడాదిన్నరకు పైగా యథాతథంగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన మూడు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు మొదలయ్యాయి. మరొకవారంలో విద్యాసంవత్సరం మొదలై విద్యార్థుల సమస్యలు మొదలయ్యాయి. విద్యార్థుల సమస్యలలో భాగంగానే వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఉపకార వేతనాల, బోధనా ఫీజుల రియింబర్స్ మెంట్ సమస్యలు మొదలయ్యాయి. పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో జరిగిన అశాంతి, అక్రమ కార్యకలాపాలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టుకు విలువైన బీల భూమి అప్పగిస్తూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. స్థానిక స్వపరిపాలనా సంస్థల పదవీకాలం ముగిసిపోయి సంవత్సరం గడిచిపోయినా, మళ్లీ ఎన్నికలు జరిపితే గెలిచే ఆశలేని పాలకపార్టీ ఆ ఎన్నికలను ఎగ్గొట్టడానికి అనేక కుటిల యత్నాలు పన్నుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయనే మాట కూడ చిన్నదైపోయేంతగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర శాసనసభ ప్రజాసమస్యలను చర్చించలేదు సరిగదా, ఆ చర్చకు అవకాశం ఇచ్చే అవిశ్వాస తీర్మానాన్ని కూడ చేపట్టకుండా పదవుల పందేరంతో ముగిసిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజానీకం యావత్తూ తక్షణ పరిష్కారం కోరుతూ డజన్లకొద్దీ చిన్నా పెద్దా సమస్యలు ముందుకు తెచ్చి వాటిపై ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తుండగా పాలకులు మాత్రం వాటిని పట్టించుకునే స్థితిలో లేరు. ఆ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న రాజకీయపక్షాలకు చిత్తశుద్ధి లేకపోవచ్చు. అవి నిజమైన ప్రజా నాయకత్వం కింద జరుగుతుండకపోవచ్చు. సంఘటిత నిర్మాణ రూపం ధరించలేక పోవచ్చు. ప్రస్తుతం తెలుగు సమాజానికి అలవాటయిపోయిన రాజకీయ, కుల, మత, ప్రాంత విభజనల కింద చీలిపోయి ఉండవచ్చు. కాని సమస్యల ఉనికి, అవి పరిష్కారం కావాలనే ప్రజల ఆకాంక్ష రెండూ కూడ ‘ఎందెందు వెదకి చూచిన అందందే’ అన్నట్టు వాస్తవంగా ఉన్నాయి. కాని వినగల దానవాగ్రణి లేడు. ఈ సమస్యలేవీ పట్టని పాలకులు రాజకీయ పదవుల పంపకాలలో, ఆస్తి ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడంలో, ప్రత్యర్థులను బుజ్జగించడంలో, బెదిరించడంలో, ఆత్మస్తుతి &#8211; పరనిందలలో కాలం గడుపుతున్నారు. ప్రతి ప్రజాస్వామిక ఆకాంక్షనూ శాంతి భద్రతల సమస్యగా చూసి, చూపి దమనకాండను అమలు చేయడం, ఆ ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యక్తం చేసే వారికి ఒక గడ్డిబొమ్మ ప్రతినిధిని తయారుచేసి, ఆ ప్రతినిధికి పదవుల ఎరచూపి కొనివేయడం, ఒక సమస్యను మించి మరొక సమస్యను సృష్టించి ప్రజల దృష్టి మళ్లించడం ఈ దేశ పాలకులకు అలవాటయిన విద్యలు. రాష్ట్రంలో వర్షాలు మొదలై, దుక్కులు కూడ ప్రారంభమైన తర్వాత కూడ ప్రభుత్వం వైపు నుంచి విత్తనాల సరఫరా క్రమబద్ధం కాలేదు. మృగశిరకు ముందే తగిన ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని, విత్తన వ్యాపారుల అక్రమ నిలువల మీద, అధికధరల మీద నిఘా పెట్టవలసిన ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ అధీనంలోని విత్తన డిపోలలో తగిన మోతాదులో విత్తనాలు నిలువ ఉంచవలసిన ప్రభుత్వాధికారులు మొత్తం ప్రైవేటు వ్యాపారస్తులకు దళారులుగా మారిపోయారు. చాల చోట్ల అవసరమైన విత్తనాల పరిమాణంలో పావు వంతు కూడ అందుబాటులో లేక, లాటరీ చీట్లు తీసి రైతులకు విత్తనాలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గిరాకీ గురించి ప్రభుత్వానికి తగిన సమాచారం లేకపోవడం, అందువల్ల సరఫరా కాస్త తక్కువ పడడం ఎప్పుడైనా జరగవచ్చు. కాని ఈ సారి జరిగినది మాత్రం తలకిందులు. ఎక్కడా అవసరమైనదానిలో పావు వంతు కన్న ఎక్కువ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది, ప్రైవేటు వ్యాపారులు చేసేలా నియంత్రించ లేకపోయింది. విత్తనాల కోసం రైతులు గంటలకొద్దీ బారులు తీరి పడిగాపులు పడడం, లాటరీలు, విత్తనాలు అందలేదని నిరసన వ్యక్తం చేసిన రైతుల మీద లాఠీచార్జిలు, ఘర్షణలు, రాజకీయ ఆశ్రితులకే సహాయం అందుతున్నదనే ఆరోపణలు, మంత్రుల ఘెరావ్ లు, చివరికి రైతులు ఈ సంవత్సరం పంటలు పండించబోమని, క్రాప్ హాలిడే ప్రకటించడం మన పాలకుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి, ప్రజలతో సంబంధం లేకపోవడానికి అద్దంపడుతున్నాయి. సరిగ్గా రైతులకు విత్తనాల విషయంలో జరిగినట్టే పాఠశాల విద్యార్థుల పుస్తకాల విషయంలో జరిగింది. అది సమసిపోకముందే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం విషయంలో ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించడం మొదలుపెట్టింది. ఇంకొకవైపు పుట్టపర్తి ఆశ్రమంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతుంటే, కనీస చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి కూడ ప్రభుత్వం సిద్ధపడడం లేదు. ఈ లోగా భూములను సంపన్నవర్గాలకు కట్టబెట్టడంలో ఎపిఐఐసి అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. సోంపేట భూముల గురించి ప్రభుత్వ ఉత్తర్వును హైకోర్టు తప్పుపట్టింది. ఇన్ని సమస్యలు ఉండగా, వీటిని పరిష్కరించడానికి ఇసుమంత ప్రయత్నమయినా చేయని ప్రభుత్వం తెలంగాణను బుజ్జగించడానికి ఒక తెలంగాణ వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవి, ఒక సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఆ వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి లాంటి తూతూ మంత్రపు చర్యలతో ఆయా ప్రాంతాల, వర్గాల అసంతృప్తులను చల్లార్చగలనని కలలు కంటున్నది. పాలకులు ప్రజలకు ఇంతగా దూరమైతే అంతిమ పర్యవసానం ఎంత విస్ఫోటకంగా ఉంటుందో చరిత్ర ఎన్నోసార్లు చెప్పింది. ఇవాళ కాకపోతే రేపయినా మననేలమీద ఆ చరిత్ర పునరావృతం కాకతప్పదు.</p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/678/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/678/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/678/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/678/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/678/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/678/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/678/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/678/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/678/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/678/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/678/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/678/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/678/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/678/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=678&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%be/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>అదృశ్యమైన ధృవతార ఆర్ ఎస్ రావు</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%a6%e0%b1%83%e0%b0%b6%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a7%e0%b1%83%e0%b0%b5%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%a6%e0%b1%83%e0%b0%b6%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a7%e0%b1%83%e0%b0%b5%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d/#comments</comments>
		<pubDate>Mon, 25 Jul 2011 12:37:41 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%a6%e0%b1%83%e0%b0%b6%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a7%e0%b1%83%e0%b0%b5%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d/</guid>
		<description><![CDATA[మనకాలపు మహామేధావి, సునిశితమైన మార్క్సిస్టు విశ్లేషకుడు ఆర్ ఎస్ రావు కన్నుమూశారు. ముప్పై సంవత్సరాలుగా ఆయనతో సాగిన అనుబంధంలో కలిసి చేసిన ఆలోచనలు, పనులు, ప్రయాణాలు, కలిసి కన్న కలలు, పొందిన విజయాలు, వైఫల్యాలు అన్నీ ముగింపుకు వచ్చినట్టు గుండె పగిలే మౌనం. మహానిశ్శబ్దం. ‘చలనం మాత్రమే ఉంది. విశ్రాంతి, విరామం లేవు, విశ్రాంతి, విరామాల గురించి ఉన్న తాత్విక ప్రత్యయం కేవలం మన ఆలోచనా సౌలభ్యానికే తప్ప, సాపేక్షికంగానే తప్ప ప్రకృతిలో, సమాజంలో, మానవ మేధలో [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=677&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>మనకాలపు మహామేధావి, సునిశితమైన మార్క్సిస్టు విశ్లేషకుడు ఆర్ ఎస్ రావు కన్నుమూశారు. ముప్పై సంవత్సరాలుగా ఆయనతో సాగిన అనుబంధంలో కలిసి చేసిన ఆలోచనలు, పనులు, ప్రయాణాలు, కలిసి కన్న కలలు, పొందిన విజయాలు, వైఫల్యాలు అన్నీ ముగింపుకు వచ్చినట్టు గుండె పగిలే మౌనం. మహానిశ్శబ్దం. ‘చలనం మాత్రమే ఉంది. విశ్రాంతి, విరామం లేవు, విశ్రాంతి, విరామాల గురించి ఉన్న తాత్విక ప్రత్యయం కేవలం మన ఆలోచనా సౌలభ్యానికే తప్ప, సాపేక్షికంగానే తప్ప ప్రకృతిలో, సమాజంలో, మానవ మేధలో దానికి అవకాశమే లేదు’ అని ఎప్పుడూ చెపుతుండే ఆయన మేధ విరామానికి చేరింది. బహుశా అది ఆ ఆలోచనలకు విరామం కాదేమో. ఆ చలనం కొనసాగుతూనే ఉంటుందేమో.</p>
<p>నిజంగా ఆయనతో మాట్లాడడం అంటే ఒక చలనం, ఒక చైతన్యం, ఒక వెలుగు. అప్పటిదాకా మనకు తట్టని ప్రశ్నను మన మెదడులో ప్రవేశపెట్టి అల్లకల్లోలం చేసేవారాయన. ఇక ఇది అంతిమ నిర్ణయం, ఆలోచించవలసిందేమీ లేదు అనుకున్న దాని మీద కందిరీగల తుట్టెను రేపేవారాయన. అప్పటిదాకా ఎన్నో వైపుల ఆలోచించిన విషయానికే మరొక కొత్త కోణాన్ని చూపెట్టేవారాయన. గ్రామీణ వ్యవసాయ సమాజంలో చీకటి రాత్రి దిక్కు చూపడానికి ప్రతి మనిషీ వాడుకునే ధృవనక్షత్రం లాంటి వారాయన. ముసిముసి చీకటి తొలగిపోకముందే వెలుగుదారి పరిచే వేగుచుక్క ఆయన. తెలుగు సమాజమూ, భారత విప్లవోద్యమమూ అతి కీలక దశలో ఉన్నప్పుడు, ఎన్నెన్నో కొత్త, సంక్లిష్ట సమస్యలకు జవాబులు వెతకవలసిన తరుణంలో ఆ ధృవతార అదృశ్యమయింది. </p>
<p><span id="more-677"></span>
</p>
<p>ఎప్పుడో 1990లో పర్ స్పెక్టివ్స్ ప్రచురణగా చిన్నపుస్తకంగా వచ్చిన ‘అభివృద్ధి &#8211; వెలుగు నీడలు’ వ్యాసం మినహా ఈ ఇరవై ఏళ్ళలో ఆయన రచనలు పుస్తకరూపంలో రాలేదు. అంతకు ముందూ ఆ తర్వాతా కలిపి అరవై దాకా వ్యాసాలు రాశారు. దాదాపు అన్ని ప్రజాసంఘాల సభలలో, సమావేశాలలో వందకు పైగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ కృషినంతా ఎప్పటికైనా ఒక్కచోటికి తీసుకురావాలనే కలలో భాగంగా వీక్షణం ప్రచురణల తరఫున ఆర్ ఎస్ రావు తెలుగు రచనల సమగ్ర సంపుటం ‘కొత్తచూపు’ 2010 నవంబర్ లో వెలువరించాం. దానికి రాసిన ముందుమాటలో ఆయనతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఎక్కువ రాశానని, ఆయన మీద నా భక్తిని బహిరంగంగా వ్యక్తీకరించానని నాకే అనుమానం వచ్చింది. ప్రచురణకు కొద్దిరోజుల ముందు ఆ ముందుమాట ఆయన చేతికిస్తూ బెరుకుగా “సబ్జెక్టివ్ గా వచ్చినట్టుంది” అన్నాను. “నువ్వు సబ్జెక్టివ్ అనుకునేది మరొకరికి ఆబ్జెక్టివ్ కావచ్చు. మరొకరికి సబ్జెక్టివ్ అనిపించినది నీకు ఆబ్జెక్టివ్ కావచ్చు. అది రిలేటివ్. అసలింతకీ ఆబ్జెక్టివ్ లేని సబ్జెక్టివ్ ఉండదు, సబ్జెక్టివ్ లేని ఆబ్జెక్టివ్ ఉండదు. వాటిమధ్య విభజన రేఖ మనం గీసిందే. చాలసార్లు అనవసరమైనదే” అన్నారు ఆయనకు సహజమైన ఒక కొంటె చిరునవ్వుతో. ఆయనతో చర్చలలో వందలసార్లు ఈ సాపేక్షికత గురించీ, అందులోని గతితార్కికత గురించీ ప్రస్తావన వచ్చింది. భారత కమ్యూనిస్టు సంప్రదాయంలో అలవాటయిన తప్పుడు వాదనాపద్ధతుల గురించి మాట్లాడేటప్పుడు చాల సందర్భాలలో ఆయన ముఖం మీద ఇటువంటి కొంటె చిరునవ్వు విరిసేది. </p>
<p>ముప్పై ఏళ్లుగా చూస్తున్న ఆ చిరునవ్వు ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో జూన్ 17 మధ్యాహ్నం చెరిగిపోయింది. నిజం చెప్పాలంటే మరణం తర్వాత ఆ స్ఫటికం లాంటి స్పష్టమైన, కత్తి అంచులాంటి నిశితమైన వాదన ఆగిపోయింది గాని ఆయన ముఖం మీద ఆ పెదాల ముడి అట్లాగే కొంటె చిరునవ్వుగా నిలిచిపోయే ఉంది. మరణానికి కొద్ది గంటల ముందు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ మీద, ముఖం మీద గాజు మాస్క్ తో, వళ్లంతా గొట్టాలతో, యంత్ర పరికరాలతో ఉన్న ఆయన చెయ్యి పట్టుకుని “సార్, సార్” అని పిలిస్తే మూసిన కనురెప్పలు విప్పి చూశారు. చాల రోజులుగా మాట లేదు గాని, గాజు మాస్క్ కింది నుంచి పెదవి కదల్చడానికి ప్రయత్నించారు. అప్పటికి ఇరవై రోజులుగా ఊపిరి తిత్తులు పని చేయడం లేదు, గుండె పని చేయడం లేదు. మూడు రోజులుగా మూత్ర పిండాలు పని చేయడం లేదు. కాని ఆ సునిశితమైన మేధ ఇంకా సున్నితంగా ప్రతిస్పందిస్తూనే ఉంది.</p>
<p>నలభై సంవత్సరాలుగా మార్క్సిస్టు రాజకీయార్థిక, తాత్విక దృక్పథాన్ని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా అన్వయిస్తూ, వివరిస్తూ, విశ్లేషిస్తూ ఆయన సాగించిన అనితరసాధ్యమైన కృషిని ఒక వ్యాసంలో, అదీ సంస్మరణ సందర్భంలో రాయడం సాధ్యం కాదు. కాని స్థూలంగానైనా ఆయన అనుసరించిన సంవిధానపు విశిష్టతలు ఏమిటో, ఆయన నుంచి నేర్చుకోవలసినదేమిటో తెలుసుకోవలసి ఉంది.</p>
<p>విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన ఆచార పరాయణులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రేగులగడ్డ సోమేశ్వరరావు అర్థశాస్త్రం, గణాంకశాస్త్రం చదువుకుని, సంగీతం మీద, పూలమీద, నాటకాల మీద ఆసక్తితో జీవితం ప్రారంభించి, మార్క్సిజం అధ్యయనంతో మార్క్సియన్ ఆలోచనాపరుడిగా మారి, మొత్తంగా భారత సమాజంలోని, ప్రత్యేకంగా ఒరియా, తెలుగు సమాజాలలోని అట్టడుగు ప్రజలను అధ్యయనం చేసి, నక్సల్బరీ విప్లవోద్యమంతో సన్నిహితంగా నడిచి మనకాలపు గొప్ప మార్క్సిస్టు విశ్లేషకుడిగా మారిన పరిణామ క్రమం, ఆయన మిగిల్చి పోయిన తార్కిక, తాత్విక చింతన అత్యద్భుతమైనవి. వాటినుంచి అర్థం చేసుకోవలసినదీ, నేర్చుకోవలసినదీ, ఆచరించవలసినదీ ఎంతో ఉంది. </p>
<p>మార్క్స్ నూ మావో నూ ఆయన తన ఆలోచనల్లో, ప్రవర్తనలో జీర్ణం చేసుకున్నారు. ముఖ్యంగా మార్క్స్ తన ఆదర్శాలుగా ప్రకటించిన రెండు మాటలు (‘ప్రతిదాన్నీ ప్రశ్నించు’, ‘మానవీయమైనదేదీ నాకు పరాయిది కాదు’) ఆర్ ఎస్ రావు గారికి కూడ ఆదర్శాలుగా ఉన్నాయి. దేన్నీ ప్రశ్నించకుండా, ఆలోచించకుండా, పరిశోధించకుండా, సొంత వాదనతో విశ్వాసం కుదుర్చుకోకుండా విశ్వసించగూడదు అనేదే ఆయన నేర్పిన పాఠం. ఇలా ప్రతిదాన్నీ ప్రశ్నించి, తర్కించి, పరిశోధించి, తనకు తానుగా నిర్ధారించుకున్న తర్వాతనే నమ్మారు గనుకనే ఆయనకు తాను చెప్పే విషయాలపట్ల అసాధారణమైన స్పష్టత ఉండేది. అపారమైన ఆత్మవిశ్వాసం ఉండేది. ఆ లక్షణం వల్లనే ఆయన కొత్త ప్రశ్నలు లేవదీసేవారు. కొత్త జవాబులు అన్వేషించేవారు. కొత్త ఆలోచనలు చేయడానికి ప్రోత్సహించేవారు. ‘గాలిపటాలు ఎగరేయాలి’ అనే అలంకారంతో ఆయన ఆలోచనలను గాలిపటాలుగా చూశారు. ఎటువంటి గాలిలోనైనా, ఎంత ఎదురుగాలిలోనైనా గాలిపటాన్ని ఎగరేయాలి. దాన్ని గాలిలో స్వేచ్ఛగా తిరగనివ్వాలి. కొత్త గాలి తెమ్మరలను ఆస్వాదించనివ్వాలి. కొత్త రంగాలలోకి ప్రవేశించనివ్వాలి. అయితే ఆ గాలిపటం ఎంత దూరం వెళ్లినా విశృంఖలంగా, గాలివాటుగా, నేలతో, మనిషితో సంబంధం వదిలి కాదు. ఎగరేయడం చేసేది మనిషి మాత్రమే. ఆ గాలిపటాన్ని స్వేచ్ఛగా వదిలేలా సూత్రం పట్టుకున్న మనిషి, నేల మీద స్థిరంగా నిలబడ్డ మనిషి మాత్రమే. ఆ స్వేచ్ఛ, ఈ స్థిరత్వం రెండూ అవసరమే. సరిగ్గా అట్లాగే గత నలభై సంవత్సరాలలో ఆయన చేసిన కృషిలో మార్కిజం పట్ల అచంచల విశ్వాసం అనే స్థిరత్వమూ ఉంది, దేన్నయినా పరిశీలించాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎన్ని ప్రశ్నలైనా ఎదుర్కోవాలి అనే స్వేచ్ఛా ఉంది. </p>
<p>మళ్లీ ‘మానవీయమైనదేదీ నాకు పరాయిది కాదు’ అని మార్క్స్ ఉటంకించిన సూక్తినీ ఆర్ ఎస్ రావు గారు ఆలోచించిన, రచించిన, వ్యాఖ్యానించిన విషయాల విస్తృతినీ చూస్తే ఇక్కడ కూడ ఆయన మార్క్స్ అడుగుజాడల్లో నడిచారని అర్థమవుతుంది. భారత సామాజిక సంబంధాలు, భూస్వామ్యం, సామ్రాజ్యవాదం, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్ర, ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం, పాలనా విధానాలు, భూసంస్కరణలు, ప్రజా సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ భావజాలం, అభివృద్ధి, విస్థాపన, పర్యావరణం, చరిత్ర నిర్మాణంలో ప్రజల పాత్ర, భారత సామాజిక ఆర్థిక వ్యవస్థల సంక్షోభం, నక్సల్బరీ వెలుగులో భారత విప్లవోద్యమం నిర్మిస్తున్న చరిత్ర, సామ్యవాద ప్రయోగాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, పౌరహక్కుల ఉద్యమం, సామ్రాజ్యవాద ప్రభావానికీ కుల, మత వాదాలకూ సంబంధం, స్త్రీవాదం, తెలుగు సాహిత్యం వంటి అనేక విషయాల మీద ఆయన అద్భుతమైన రచనలెన్నో చేశారు. </p>
<p>అప్పటికే మార్క్సిజం చదువుకుని, విశ్వసిస్తున్న ఆర్ ఎస్ రావు నక్సల్బరీ ఉద్యమ ప్రజ్వలనంతో క్రియాశీల మార్క్సిస్టు మేధావిగా మారారు. నక్సల్బరీ పంథా దేశాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య సమాజంగా అభివర్ణించినప్పుడు, ఆ సూత్రీకరణ ఎంత వాస్తవికమైనదో చూపడానికి 1970లో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లో ఒక చిన్న ప్రశ్నావ్యాసంతో ప్రవేశించిన ఆర్ ఎస్ రావు చనిపోయే సమయానికి ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య సూత్రీకరణను సమర్థించే పత్రం తయారుచేసే పనిలో ఉన్నారు. </p>
<p>1970లోనే ఆయన వేసిన రెండు ప్రశ్నలు ఆయన దృష్టి నైశిత్యానికీ, ప్రజల పట్ల ప్రేమకూ, విప్లవోద్యమ నిబద్ధతకూ అద్దం పడతాయి. భారత వ్యవసాయంలోకి పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిందని సిపిఐ, సిపిఎంలకు చెందిన సిద్ధాంతవేత్తలు, స్వతంత్ర అర్థశాస్త్రవేత్తలు సిద్ధాంతాలు చేస్తున్నపుడు ఆయన “పెట్టుబడిదారీ రైతును వెతుకుతూ&#8230;” అని ఆ వాదనలను ఖండించే చిన్న వ్యాసం రాశారు. వ్యవసాయంలోకి “ఆధునిక” పరికరాలు రావడమే పెట్టుబడిదారీ విధానానికి నిదర్శనమనే వాదనకు జవాబు చెపుతూ “ఆధునిక అనేది సాపేక్షిక పదం. కర్రనాగలి కన్న ఇనుపనాగలి ఆధునికం. ట్రాక్టర్ ఇంకా ఆధునికం. ఒకానొక సమయంలో మూడూ సహజీవనం చేస్తూ ఉండవచ్చు కూడ. సాధనం పాతదా, కొత్తదా అని కాదు, పెట్టుబడి సంచయనం అంతకంతకూ ఎక్కువగా జరుగుతూ ఉండడమే పెట్టుబడిదారీ విధానాన్ని నిర్ణయిస్తుంది” అని మౌలిక ప్రశ్న సంధించారు. ఈ వ్యాసంలోనే “చూడవలసింది ఏది ఉన్నది అని కాదు, అది ఎలా మారుతున్నది అని” అని సూత్రీకరించారు. చలనంలో ఉన్న వస్తువును అధ్యయనం చేయడం, చలనాన్ని అధ్యయనం చేయడం అనే మౌలిక భావనలకు ఆయన అప్పటినుంచీ నలభై సంవత్సరాలపాటు స్థిరంగా అంటిపెట్టుకుని ఉన్నారు.</p>
<p>అలాగే 1969-70లలో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన బ్యాంకుల జాతీయకరణ ప్రగతిశీల విధానమని పార్లమెంటరీ కమ్యూనిస్టు నాయకులు, అర్థశాస్త్రవేత్తలు పొగుడుతున్నప్పుడు, నాగపూర్ లో ఒక సదస్సులో “బ్యాంకుల జాతీయకరణ సరే, పాలన జాతీయకరణ ఎప్పుడు” అనే మౌలిక ప్రశ్న వేసి ఆయన కందిరీగల తుట్టెను కదల్చారు. </p>
<p>లోలోపల ఆలోచన, మిత్రులతో చర్చలో, సంభాషణలో ఆలోచన, గాలిపటాలు ఎగరేయడం వల్ల ఆయన చేయవలసినంత రచన చేయలేదని, ఆయన అద్భుత అన్వేషణలన్నీ మౌఖిక సంప్రదాయంలోనే మిగిలిపోయాయని అనిపిస్తుంది. అత్యవసరమనుకుంటే తప్ప, ఎవరైనా అడిగితే తప్ప ఆయన రాయలేదు. సభలకు, సమావేశాలకు పిలిస్తే తప్పనిసరిగా లిఖిత పత్రంతోనో, నోట్స్ తోనో వచ్చేవారు. </p>
<p>తెలుగులో వార్త దినపత్రికకు తప్ప ప్రధానస్రవంతి పత్రికలలో ఆయన దాదాపుగా ఎప్పుడూ రాయలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తన 150 ఏళ్ల సందర్భంగా 1990లో ఆయనతో ఒక వ్యాసం రాయించుకుని దాన్ని అచ్చువేయలేదు. ఆ సందర్భంగా ఆయన రాసిన అద్భుతమైన వ్యాసం అచారిత్రక ప్రజల చరిత్ర రచన. ప్రజలు, ప్రజల శ్రమ, ప్రజల ఆకాంక్షలు, ప్రజల సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల సంస్కృతి – ఈ అంశాలు ఆయనకు అన్నిటికన్న ముఖ్యమైనవి. ఏ చర్చనైనా ఆయన ఈ మౌలిక అంశాలవైపు మళ్లించేవారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం రాసిన వ్యాసానికి కూడ ఈ ఆలోచనలే పునాది. </p>
<p>ప్రజల గురించి ఇంత లోతుగా ఆలోచించే క్రమంలోనే ఆయన ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకూ పాలకుల అభివృద్ధి భావజాలానికీ మధ్య అంతరం గురించి చెప్పడం ప్రారంభించారు. అసలు పాలకులు అభివృద్ధిగా భ్రమలు కల్పిస్తున్నది అభివృద్ధి కానేకాదని, అభివృద్ధి పథకాలనే అభివృద్ధిగా పాలకులు ప్రచారం చేస్తున్నారని, మధ్యతరగతి ఆ ప్రచారానికి లొంగిపోతున్నదని ఆయన విస్తారంగా రాశారు. </p>
<p>ఈ విశ్లేషణ వల్లనే ఆయన నక్సల్బరీ వెలుగులో నడుస్తున్న భారత విప్లవోద్యమాన్ని ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా చూశారు. దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా ఆయన రచనలు, ఉపన్యాసాలు అన్నిటిలోనూ, ఇతర అంశాలకన్న ఎక్కువగా ఈ ప్రజా, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా విశిష్టత గురించి వివరించడానికి, దాన్ని విస్తరించడానికి ప్రయత్నించారు. “నక్సలైట్లు ఇంకా విజయం సాధించి ఉండకపోవచ్చు. కాని భారత ఆర్థిక వ్యవస్థలో పేదరైతులకూ, వ్యవసాయ కూలీలలకూ ప్రధాన స్థానం ఉంటుందని వాళ్ళు లేవనెత్తిన అంశాలు, పేదరికం గురించీ, మార్కెట్ సమస్య గురించీ లేవనెత్తిన అంశాలు ఒకవైపు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద, సహాయం మీద ఆధారపడడం గురించిన ప్రశ్నలు మరొకవైపు ఒక చట్రాన్ని ప్రతిపాదించే ఇతివృత్తాలవుతాయి. ఆ చట్రం పకడ్బందీ చట్రం కాకపోయినప్పటికీ, భారత వాస్తవికతను అర్థం చేసుకునే చట్రం ఇదే” అని 1984లో ఒక సదస్సులో ఆయన అన్నారు. ఈ దేశంలో ప్రజా ఉద్యమాలలో నక్సల్బరీ ప్రవేశపెట్టిన ఆ చట్రాన్ని అర్థం చేసుకోవడం, వివరించడం, విశ్లేషించడం, విస్తరించడం, ఇంకా పకడ్బందీగా మార్చడానికి ప్రయత్నించడం, ఈ చట్రం వైపు ఇతర ఆలోచనాపరులను ఆకర్షించడం ఆర్ ఎస్ రావు గత నలభై సంవత్సరాలు నిరంతరంగా చేసిన పని. ఆ పనిని కొనసాగించడమే ఆయనకు నివాళి.</p>
<p>ఆయన నుంచి అన్నిటికన్న ఎక్కువగా నేర్చుకోవలసినది ఆశావాదం. ప్రకృతి, సమాజం, మానవమేధలలో నిరంతరం సాగే చలనాన్ని విశ్లేషించే వ్యక్తిగా ఆయన “ఇవాళ తెలియకపోతే రేపు తెలుసుకుంటాం. ఇవాళ తప్పు చేస్తే రేపు సరి చేయడానికి ప్రయత్నిస్తాం. ఎప్పటికైనా మనిషే సాధించగలడు” అనేవారు. అపజయాలు, వైఫల్యాలు, తప్పులు, అనుకున్న పనులు కాకపోవడం ఎన్ని జరిగినా ఆయన ఆ తాత్విక దృక్పథం వల్లనే కుంగిపోలేదు, బెంబేలు పడలేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా వీక్షణంతో, సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్, రిసర్చ్ అండ్ కమ్యూనికేషన్ తో ఆయన సంబంధంలో, మార్గదర్శకత్వంలో కూడ పదే పదే ఈ ఆశావహ దృక్పథమే వ్యక్తమయింది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆలోచిస్తున్న పరిశోధనా కేంద్రం ఆరు సంవత్సరాల కింద వాస్తవరూపం ధరించి, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు విమర్శనాత్మకంగానైనా సెంటర్ తో కొనసాగారు. ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అనేక రచనలతో ఏకీభావం లేకపోయినా, పని జరగాలని వెన్నుతట్టారు. భువనేశ్వర్ లో మరొక పరిశోధనా కేంద్రం ప్రారంభమై పనిచేస్తుందనే ఆశతో అక్కడికి వెళ్లి, అక్కడా అనుకున్న పని జరగక వెనక్కి తిరిగి వచ్చి, “నేనూ భారతి గారూ ఏమి రాసినా, ఏమి చేసినా వీక్షణం, సి డి ఆర్ సి ప్రచురణలుగానే రావాలి” అని వీక్షణం – సి డి ఆర్ సి బృందంపై తన విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యక్తిగతంగా నాకు గీటురాయిగా నిలిచారు. రాంకినీ, రామునూ ఆలోచన, రచన, వ్యక్తీకరణల వైపు ప్రోత్సహించారు. సారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితిలోనయినా వమ్ము చేయబోమని ఆయన చివరి క్షణాలలో హామీ ఇచ్చాను. నేత్రదానం వల్ల ఇంకా జీవిస్తున్న ఆయన కళ్లు మమ్మల్ని చూస్తూనే ఉంటాయి. ఆయన వదిలివెళ్లిన అసంపూర్ణ కర్తవ్యాలు మమ్మల్ని నడుపుతూనే ఉంటాయి. </p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/677/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/677/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/677/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/677/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/677/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/677/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/677/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/677/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/677/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/677/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/677/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/677/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/677/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/677/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=677&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%85%e0%b0%a6%e0%b1%83%e0%b0%b6%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a7%e0%b1%83%e0%b0%b5%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>క్షమించండి, కొన్నాళ్లు తప్పులు భరించాలి</title>
		<link>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4/</link>
		<comments>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4/#comments</comments>
		<pubDate>Mon, 25 Jul 2011 12:32:16 +0000</pubDate>
		<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
				<category><![CDATA[Telugu]]></category>

		<guid isPermaLink="false">https://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4/</guid>
		<description><![CDATA[ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను గనుక ఈ తప్పటడుగుల్ని పెద్దమనసుతో క్షమించండి. కొంతకాలం ఇవ్వండి.<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=676&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><font size="3">ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను గనుక ఈ తప్పటడుగుల్ని పెద్దమనసుతో క్షమించండి. కొంతకాలం ఇవ్వండి. </font></p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/kadalitaraga.wordpress.com/676/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/kadalitaraga.wordpress.com/676/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/kadalitaraga.wordpress.com/676/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/kadalitaraga.wordpress.com/676/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/kadalitaraga.wordpress.com/676/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/kadalitaraga.wordpress.com/676/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/kadalitaraga.wordpress.com/676/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/kadalitaraga.wordpress.com/676/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/kadalitaraga.wordpress.com/676/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/kadalitaraga.wordpress.com/676/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/kadalitaraga.wordpress.com/676/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/kadalitaraga.wordpress.com/676/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/kadalitaraga.wordpress.com/676/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/kadalitaraga.wordpress.com/676/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=kadalitaraga.wordpress.com&amp;blog=795645&amp;post=676&amp;subd=kadalitaraga&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://kadalitaraga.wordpress.com/2011/07/25/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/dc51ed30ef50cf83db2cb21797deb169?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">ఎన్.వేణుగోపాల్</media:title>
		</media:content>
	</item>
	</channel>
</rss>
