Feed on
టపాలు
వ్యాఖ్యలు

చిరకాల మిత్రుడు, పాత్రికేయవృత్తిలో సహాధ్యాయి, తెలంగాణ చరిత్ర గురించీ, భాష గురించీ, సంస్కృతి గురించీ గణనీయమైన కృషి చేసిన పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ జైలుపాలు కావడం తీవ్రంగా ఆందోళనపరుస్తున్నది. అదికూడ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని దూషించాడనే, అగౌరవపరిచాడనే తప్పుడు ఆరోపణపై నిర్బంధానికి గురికావడం మరింత విచారకరంగా ఉన్నది. పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ‘మీట్ ద ప్రెస్’ సమావేశాలలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు తమ అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు. ఆ అభిప్రాయాలలో ఎక్కువభాగం ఊకదంపుడు మాటలు, ఎంతమాత్రమూ నమ్మని, ఆచరణలో పెట్టదలచుకోని ఆదర్శాలు, ఆత్మస్తుతి, పరనింద ఉంటాయి గనుక వాటిని పట్టించుకోనవసరం లేదు. కాని ఆ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు భారత పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

రాష్ట్రంలో డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 మే 14 న అధికారం చేపట్టిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనను పూర్తిచేసుకున్నది. ఈ నాలుగు సంవత్సరాలలో చాల లోతయిన రాజకీయ, సామాజిక పరిణామాలే జరిగాయి. రాజకీయంగా ఐక్యసంఘటన ప్రభుత్వంగా, మిశ్రమ మంత్రివర్గంగా మొదలయినదల్లా రెండుసంవత్సరాలు తిరగకుండానే ఏకపార్టీ పాలనగామారిపోయింది. పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

భారతీయులు ఎక్కువ తింటూ ఉండడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా ఆహారపదార్థాల ధరల పెరుగుదల సంక్షోభం వచ్చిందని అమెరికన్ పాలకవర్గ ప్రతినిధులు కొత్తపాట ఎత్తుకున్నారు.

పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి. పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇరవై ఐదు సంవత్సరాల కింద కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తూ ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పథకం అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రుల కింద అనేక రకాలుగా మారుతూ వచ్చి డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మళ్లీ మొదటికి వచ్చింది. పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

రెండు మూడు రోజుల కింద పత్రికల్లో ఒక చిన్న వార్త వచ్చింది. లోపలిపేజీల్లో అప్రధానంగా వచ్చిన ఆ వార్త పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించి ఉండకపోవచ్చు. రాష్ట్రంలో పనిచేసిన ఒక మాజీ అత్యున్నతాధికారి రాజధానీ నగరంలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్ లో తన చేతిగడియారం పోగొట్టుకున్నారట. పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

హైదరాబాదులో ఏడు దశాబ్దాలుగా పనిచేస్తున్న బేగంపేట గాలిమోటర్ల అడ్డాను తోసిరాజంటూ కొత్త అడ్డా వచ్చింది. వారం రోజుల కింద యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించిన ఆ అడ్డా అధికారిక పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నిర్మాణ వ్యయం రు. 1418 కోట్ల అంచనాతో మొదలయి, త్వరలోనే రు. 1760 కోట్ల వ్యయ అంచనాకు చేరినాక పనులు మొదలయి, ప్రస్తుతానికి రు. 2,478 కోట్ల వ్యయంతో ముగిసింది. పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

రైతులకు రుణమాఫీ, రుణాల చెల్లింపులో రాయితీల పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో అరవైవేల కోట్ల రూపాయల సహాయం అందించబోతున్నామని, ఇంతటి మహత్కార్యానికి దేశమంతా నీరాజనాలు పలకవలసి ఉందని బడ్జెట్ ఉపన్యాసంలో కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం అన్నారు. పైపైన చూస్తే, అరవైవేలకోట్ల రూపాయలు అనే పెద్దఅంకెచూస్తే అదేదో రైతులకు, దేశ వ్యవసాయరంగానికి చేస్తున్న గొప్ప మేలు లాగనే కనబడుతుంది. కాని తీగలాగి డొంక కదిలిస్తే ఈ ప్రకటన బండారం బయటపడుతుంది. పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

పాత టపాలు »